Saamanyudu: మధు ఎవడో చెబితే వాడిని మాత్రమే కొడతా..!

విశాల్‌ కథానాయకుడిగా శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామాన్యుడు’.

Published : 01 Feb 2022 18:39 IST

హైదరాబాద్‌: విశాల్‌ కథానాయకుడిగా శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామాన్యుడు’. డింపుల్‌ హయాతీ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైవోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ‘సామాన్యుడు-స్నీక్‌ పీక్‌’ అంటూ పంచుకున్న వీడియోలో మధు అనే వ్యక్తిని వెతుక్కుంటూ విశాల్‌ బార్‌కు వస్తాడు. ‘మధు ఎవరు’ అంటూ అక్కడున్న వారందరినీ అడుగుతాడు. అయితే, ఎవరూ సమాధానం చెప్పకపోగా, విశాల్‌ను చంపడానికి వస్తార.. దీంతో విశాల్‌ అందరినీ చితక్కొడతాడు. ఇంతకీ మధు ఎవరు? అతడి కోసం విశాల్‌ అక్కడకు ఎందుకు వెళ్లాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని