Diwakarbabu: తొలి సినిమాకే నా పేరు లేదు: సినీ రచయిత దివాకర్బాబు
బాల్యం నుంచే రంగస్థల నటుడిగా, నాటక రచయితగా జీవితాన్ని ఆరంభించారు. కవి, కథారచయితగా పేరుగాంచారు.
సినిమాలు రావడం లేదు..వస్తే రాస్తా
ఇంటర్నెట్డెస్క్: బాల్యం నుంచే రంగస్థల నటుడిగా, నాటక రచయితగా జీవితాన్ని ఆరంభించారు. కవి, కథా రచయితగా పేరుగాంచారు. ఆయనే మాడభూషి దివాకర్బాబు. నాటక రచయితగా ప్రఖ్యాతిగాంచిన సమయంలో ‘కొంటె కాపురం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపుగా 100 సినిమాలకు పైగా కథ, స్క్రీన్ప్లే, మాటలు అందించారు. ఈటీవీ వార్తా ఛానెళ్లలో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.
100కి పైగా సినిమాలు చేశారు. వాటిలో 80 సూపర్ హిట్. మంచి డైలాగ్స్తో పాటు అందరూ నవ్వే హాస్యంతో మీకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమయ్యింది..?
దివాకర్బాబు: నిరంతరం కష్ట పడటం వల్లే ఏదైనా సాధ్యమవుతుంది. దానికి తోడు నాకు అవకాశాలు కూడా వచ్చాయి. మంచి విజయాలు సాధించడంతో పేరొచ్చింది.
మీ బాల్యం ఎక్కడ గడిచింది..?
దివాకర్బాబు: గుంటూరు. పుట్టింది తాడేపల్లిగూడెం. నాన్నగారు కూడా నాటక రంగంలో పని చేశారు. ఆయన నాటకాలను చూశాను. ఒక నాటకంలో లోహితశ్రీ పాత్రధారుడు రాకపోతే నేనే వెళ్లి వేశా. మా నాన్న నన్ను చూసి షాక్ తిన్నారు. ఆ తర్వాత నేను కంగుతిన్నా.. డైలాగులు మర్చిపోవటడంతో వెనక నుంచి అందించారు.
నాన్న నాటక రచయితగా పని చేశారా..?
దివాకర్బాబు: మా నాన్నగారే కాదు..తాత దగ్గరి నుంచి అందరూ నాటకాలు, ఇతర రచనలు చేశారు. నానమ్మ పాటలు రాసేది. రచన మా రక్తంలోనే ఉంది. మా ఇంట్లో దొంగలు పడి నగదు, నగలు, వస్తువులు, బట్టలు తీసుకెళ్లారు. దొంగ దొరికిన తర్వాత మా నాన్నమ్మ వాడిని అడిగిన ప్రశ్న ఒకే ఒక్కటి. ‘నా పాటల పుస్తకం ఏం చేశావ’ని.. వాడు గోదాట్లో విసిరేశానన్నాడు.
ఎప్పుడు కలం పట్టి రాయడం మొదలెట్టారు..?
దివాకర్బాబు: కాలేజీడేస్లో క్రీడల వైపు కాకుండా చిత్రలేఖనం, కల్చరల్ వింగ్లో ఉండేవాడిని. నేను మ్యాగజైన్లకు కథలు రాసేవాడిని. నాటకాల్లో పాత్రలు వేయడం, డైరెక్షన్ కూడా చేశా. నాటక పరిషత్తులలో నాటకాలు వేయడానికి నాటకం ఎవరూ ఇవ్వరు. అందుకే సొంతంగా రాయాలనుకున్నా. అదే సమయంలో గుంటూరు శాస్త్రి తెల్లారేసరికి ఒక నాటకం రాయాలని కోరారు. రాత్రంతా కూర్చొని అసుర గణం నాటకం రాశాను. అది బాగా ప్రాచుర్యం పొందింది. అందులో స్త్రీ పాత్ర ఉండదు.
ఉద్యోగం ఎక్కడ చేశారు..?
దివాకర్బాబు: నిరుద్యోగ పర్వం చాలా డేంజరస్. మొదటి ఉద్యోగం అబిడ్స్లోని అన్నపూర్ణ హోటల్లో రిసెప్షనిస్టుగా ఒక నెల చేసి మానేశా. బందరులో ఎల్ఐసీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రాయడం మొదలెట్టాను.
మీరు రాసిన ‘కుందేటి కొమ్ము’ చాలా ప్రసిద్ధి పొందింది. అది మూడు భాషల్లోకి అనువదించారు. ఇటీవల దిల్లీలో నాటక ప్రదర్శన జరిగితే ప్రధాని మెచ్చుకున్నారు. ఆ అనుభవాలు చెప్పండి..?
దివాకర్బాబు: మొదట రవీంద్రభారతిలో నాటకం వేశాం. నేను కూడా ఒక పాత్ర వేశా. ఆ నాటకం కావాలని ఒకరొచ్చారు. అప్పటికే మా బృందానికి ఇచ్చానని చెప్పా. ‘అయితే సరి’ అనేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మా టీం సభ్యులు వచ్చి ‘ఏం గురూ వి.మధుసూదన్రావు ఏం మాట్లాడారు’ అని అడిగారు. ఆయనని నాకు తెలియదు. ఆ తర్వాత ఆయన్ని కలిశాను. చాలా రోజుల తర్వాత హిందీలో ఆ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు రూ.5లక్షల బహుమతి వచ్చింది. అది ఎవర్గ్రీన్ నాటకమని గర్వంగా చెప్పుకోగలను. నా నాటికలన్నీ 40 ఏళ్లుగా వేస్తూనే ఉన్నారు.
సినిమా అవకాశం ఎప్పుడు, ఎక్కడ వచ్చింది..?
దివాకర్బాబు: విజయవాడ బ్యాంకులో పని చేస్తున్న సమయంలో ‘కుందేటి కొమ్ము’కు మంచి పేరు వచ్చింది. డైరెక్టర్ రేలంగి నరసింహారావు కబురు పెడితే వెళ్లా. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చూసిన తర్వాత ఒక కొత్త ఆలోచన వచ్చింది. దాన్నే ఆయనకు చెప్పా. కానీ, తర్వాత మరచిపోయా. ఒక మిత్రుడు గుర్తు చేస్తే ఉద్యోగానికి వారం సెలవు పెట్టి 80-85 సీన్లు రాసి పంపించా. డైరెక్టర్ ఒప్పుకున్నారు. డైలాగ్లు కూడా నన్నే రాయమని చెప్పారు. మద్రాస్ రమ్మంటే వెళ్లా. కానీ ఆ సినిమా ఆగిపోయింది. వెనక్కి వెళ్లిపోయా. మళ్లీ అదే కథతో ‘కొంటె కాపురం’ సినిమా వచ్చింది. కానీ, అందులో నా పేరు లేదు. తొలి సినిమాకే నా పేరు లేకుండా పోయింది. చాలా నిరుత్సాహపడ్డా.
‘కొంటె కాపురం’ తర్వాత సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి..?
దివాకర్బాబు: రెండేళ్లు ఉద్యోగానికి సెలవు పెట్టా. ‘డబ్బెవరికి చేదు’, ‘మన్మథలీల కామరాజుగోల’ అలా సినీ ప్రయాణం కొనసాగింది. సిక్లీవ్ పెట్టి సినిమాలు చేస్తున్నట్టు.. మా యూనియన్ వాళ్లు ఉద్యోగం చేయడమా..? మానేయడమా.?ఏదో ఒకటి చెప్పాలన్నారు. రాజీనామా చేస్తానంటే అందరూ గొల్లుమన్నారు. మా ఇంట్లో నేనొక్కడినే సంపాదించేవాణ్ణి. అది తప్ప ఆధారం లేదు. మా మామగారు ఒక్కరే భరోసా ఇచ్చి సినిమాల్లోకి వెళ్లమన్నారు.
దర్శకుడు రేలంగితో 20కిపైగా సినిమాలు చేశారు కదా..ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది..?
దివాకర్బాబు: బ్యాంకులో ఉద్యోగం మానేయడానికి ముందు రేలంగితో మాట్లాడా. ‘నన్ను నమ్ముకుని ఉద్యోగం మానేయొద్దు. మీకు అవకాశాలు ఇవ్వొచ్చు.. ఇవ్వలేకపోవచ్చు’ అన్నారు. ఆ తర్వాత చాలా సినిమాలకు అవకాశం ఇచ్చారు.
పింగళి ‘మాయబజారు’లో చాలా ఊతపదాలు వాడారు. అవి ప్రాచుర్యం పొందాయి. అలాంటి ప్రయోగాలు మీ సినిమాల్లో కూడా వాడారు. వాటి గురించి..?
దివాకర్బాబు: పాతాళభైరవిలో గురూ ఊతపదం మొదలెట్టారు. ఊతపదాలు ఆయన కనిపెట్టారు. కృష్ణారెడ్డి సినిమాల్లో ఊతపదాలు ప్రయోగం చేయడానికి అవకాశం వచ్చింది. ఎన్నో భావాలతో చెప్పేదాన్ని ఒక్క ముక్కలో చెప్పడానికి వీలుంటుంది.
హాస్యమంటే మీకు ఇష్టమా..? ఆ క్యారెక్టర్కు తగ్గట్టు చేసేవారా..?
దివాకర్బాబు: ‘మాయలోడు’ గుర్తుందా.. అలీ మేనరిజం బాగా పండింది. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ వీడియో క్యాసెట్ చూస్తుంటే పనివాడు పక్కనే కూర్చొని విచిత్రంగా ప్రవర్తించాడు. దాన్ని ‘మాయలోడు’లో అలీ పాత్రకు పెట్టాం. సూపర్హిట్ అయ్యింది. ‘ఘటోత్కచుడు’లో ఏవీఎస్ను రౌడీ పాత్రకు ఎంపిక చేశాం. ‘రంగుపడుద్ది’ డైలాగ్ మాత్రమే ఇచ్చాం. ‘యమలీల’లో హిమక్రిములు పెట్టా.
చిరంజీవితో చేసిన సినిమాలు..?
దివాకర్బాబు: ‘చూడాలని ఉంది’ చాలా గ్రేట్ ఎక్స్పిరియన్స్. స్క్రీన్ప్లేపై అవగాహన అనేది డైరెక్టర్కే ఉంటుంది. కానీ ఆ పని చేసేది రచయిత. ఇలా ఇండియన్ మూవీస్లో ఉంటుంది. ఇది తప్పు. ఇంగ్లిష్లో ఇలా ఉండదు. ‘చూడాలని ఉంది’లో నా కంట్రిబ్యూషన్ తక్కువ. స్క్రీన్ప్లే గుణశేఖర్ చేశారు.
దాసరితో కూడా చేశారు కాదా..?
దివాకర్బాబు: నా మొదటి సినిమా వంద రోజుల ఫంక్షన్కు దాసరిగారు వచ్చారు. ఈ సినిమాకు కథే హీరో అన్నారు. ఆయనతో అనుబంధం ఎక్కువ. ఆయన నటించిన సినిమాలకు మాటలు రాశా. ఆయన డైరెక్షన్లోనూ రాశాను. దాసరి, విశ్వనాథ్ దగ్గర చేశానని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అంతా వాళ్లే రాసుకుంటారు. మా పేర్లు వేస్తారు.
విశ్వనాథ్తో ఏ సినిమా చేశారు..?
దివాకర్బాబు: ‘సిరిమువ్వల సింహనాదం’ సినిమా అది. ఆయన ప్రతి సినిమా ‘ఎస్’తోనే వస్తుంది. అంతా కొత్తవాళ్లే. ఆయన దగ్గరకు వెళితే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కథ చెప్పడంలో ఆయన నంబర్వన్. ఆయన చెబుతుంటే హాస్యం వస్తే నవ్వుతాం.. ట్రాజెడీ వస్తే ఏడ్చేస్తాం. ఆయనలా ఎవరూ చెప్పలేరు. ‘మావిచిగురు’లో ‘ఏమిటో’ ఊతపదం ఆయన దగ్గరి నుంచి తీసుకున్నదే..!
కె.రాఘవేంద్రరావు ఎలా పరిచయం అయ్యారు..?
దివాకర్బాబు: మా ఇద్దరికి గొడవతోనే మొదలయ్యింది. తప్పు నాది. చేసిన పాపం చెబితే పోతుంది. ‘పెళ్లిసందడి’కి నన్ను రాయమన్నారు. కథ విన్నా. నాకు చిన్న సమస్య వచ్చింది. ఆ సినిమా చేయలేనని చెప్పా. ఆయనకు కోపం వచ్చింది. ‘కథ వినక ముందు చెప్పాలి. కథ విని చేయనంటే ఎలా’ అని ఆగ్రహించారు. ‘చూడాలని ఉంది’ షూటింగ్ నాంపల్లిలో జరిగింది. చిరంజీవి, నేనూ స్టేషన్ మాస్టర్ గదిలో ఉన్నాం. అప్పుడు ఒక లైన్ చెప్పి కథ రాయమన్నారు. దాన్ని రాఘవేంద్రరావు చేస్తారన్నారు. ‘సార్.. నేను పొరపాటు చేశా. ఆయన నాతో చేయరేమో’నన్నా. ‘ఆయన ప్రతి విషయాన్నీ గుర్తు పెట్టుకోరులే’ అని చెప్పారు. ఆ సినిమానే ‘ఇద్దరు మిత్రులు’. అప్పటి నుంచి మా సంబంధం కొనసాగుతోంది.
దర్శకుడు కోడిరామకృష్ణతో మీ జర్నీ ఎలా సాగింది..?
దివాకర్బాబు: కోడిరామకృష్ణకున్న మల్టీపుల్ టాలెంట్ ఎవరికీ లేదు. ఇది ఇప్పటి దర్శకుల గురించి కాదు..ఎన్ని టేకులు తీసుకున్నా కోపం రాదు. ప్రశాంతంగా ఉంటారు. అన్ని రకాల సినిమాలు చేశారు. రచయితకు నమ్మకం కలిగిస్తారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మీ గురించి బాగా చెప్పారు..?
దివాకర్బాబు: టెక్నిషియన్లకు గౌరవం ఇస్తారు. మాట్లాడుకున్న పారితోషికం ఎప్పుడు కావాలన్నా అడగాలని చెప్పేవారు. డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకోవచ్చు. ఎవరి జాబ్ వాళ్లను చేసుకోవడానికి అవకాశం ఇస్తారు.
వందకుపైగా సినిమాలు చేసిన మీరు ఎందుకు ఆపేశారు..?
దివాకర్బాబు: నాకు సినిమాలు రావడం లేదు. ఎందుకు రావడం లేదో తెలియదు. నాటికలు రాస్తున్నా. కథలు రాస్తున్నా. ఈటీవీకి రెండు, మూడు చేస్తున్నాను. యానిమేషన్ వైపు వెళ్తున్నాను. రచన ఎక్కడా ఆగడం లేదు.
సినిమాలు చూస్తున్నారా..? మీకు ఇష్టమైన రచయితలెవరూ..?
దివాకర్బాబు: ఎప్పటికప్పుడు చూస్తున్నా. చాలా మంది మంచి రచయితలున్నారు. సాయిమాధవ్. త్రివిక్రమ్, లక్ష్మీ భూపాల్.
ఇప్పుడు విలనిజమ్ కూడా హీరోగా చూపించడంతో సమాజంపై ప్రభావం ఎలా చూపుతుంది..?
దివాకర్బాబు: రామారావుగారు రావణాసురుడిని మంచివాడిగా చూపించారు. ఒక హీరో చెడ్డ పాత్ర వేసినా కూడా ఆ పాత్ర మంచిదే అనిపించేలా రామారావుగారే చేశారు. సినిమా అనేది కాలక్షేపం. నెగెటివ్ పాత్రలను చూసి ఎవరూ చెడిపోరు.
సురభిలో పనిచేసేవారికి పింఛన్లు ఇస్తున్నారు. నాటకాలు, నాటక పరిషత్తులోని వారికి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందన్నారు..?
దివాకర్బాబు: సురభి కళాకారులు వృత్తికళాకారులు . మిగిలిన వారు సాంఘిక కళాకారులు. క్రీడా కోటాలో ఇచ్చినట్టే..ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాను.
మీరు రాసిన రసరాజ్యం వందలసార్లు ప్రదర్శించారు..? పూర్వవైభవం రావాలంటే ఎలా..?
దివాకర్బాబు: చాలా నాటికలు వందలు, వేల సార్లు ప్రదర్శించారు. కొన్ని నాటికలు సినిమాలుగా వచ్చాయి. తమిళనాడులో టికెట్ తీసుకొని వెళ్తారు. కానీ మన వాళ్లు టికెట్పై రారు. సినిమాల్లో ఎన్నో హంగులుంటాయి. నాటకాల్లో ఉండవు కదా..
మీ పిల్లలు ఏం చేస్తున్నారు..?
దివాకర్బాబు: అబ్బాయి శ్రీకర్బాబు రెండు సినిమాలు డైరెక్టు చేస్తున్నారు. అమ్మాయి సాహిత్య ఆంగ్లంలో పట్టుంది. నాతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తోంది.
మిమ్మల్ని మళ్లీ రచయితగా చూడాలనుకుంటున్నాం..?
దివాకర్బాబు: నేను రాయగలిగే స్థితిలోనే ఉన్నాను. ఆ వేగం తగ్గలేదు. ఆసక్తి తగ్గలేదు. శక్తికూడా తగ్గలేదు. కొన్ని చర్చలు జరుగుతున్నాయి. తొందరలోనే మీ ముందుకు రావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్