స్వదేశంలో బీటెక్.. విదేశాల్లో ఎంఎస్
ఇంజినీరింగ్లో పీజీ ఎక్కడ చదువుతావని బీటెక్ విద్యార్థులను అడిగే పరిస్థితి ఇక రాకపోవచ్చు.. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో ఎంటెక్ చదివే వారి సంఖ్య నామమాత్రంగా మారుతోంది. బీటెక్ తర్వాత ఏం
రాష్ట్రంలో ఎంటెక్ చదివేది 4వేల మంది.. విదేశాల్లో ఎంఎస్లో చేరుతోంది 25వేల మంది
ఇంజినీరింగ్లో పీజీ ఎక్కడ చదువుతావని బీటెక్ విద్యార్థులను అడిగే పరిస్థితి ఇక రాకపోవచ్చు.. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో ఎంటెక్ చదివే వారి సంఖ్య నామమాత్రంగా మారుతోంది. బీటెక్ తర్వాత ఏం చేస్తావని అడిగితే.. ఉద్యోగం వస్తే ఇక్కడే ఉంటా.. లేకుంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఎక్కడోచోట ఎంఎస్ చేస్తా అని ఎక్కువ మంది యువత బదులిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం కొలువులు వచ్చినా వాటిని వదిలి.. పీజీ ఇంజినీరింగ్కు విదేశాలకు వెళ్లేవారే అధికంగా కనిపిస్తున్నారు.
నాలుగింతలు అధికం
రాష్ట్రంలో ఎంటెక్లో చేరుతున్న వారు ఏటా సరాసరి 4వేల మందే. బీటెక్ పూర్తయినవారు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) రాసి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఎంటెక్ చేసేవారు మరో రెండు, మూడువేల మంది ఉంటారన్నది అంచనా. ఆ మొత్తం కలిపినా ఆరేడు వేలకు మించదు. అదే సమయంలో రాష్ట్రం నుంచి ఏటా 10-12వేల మంది ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళుతున్నారని అంచనా. ఇక కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో పీజీ చేసేందుకు వెళ్తున్నవారు మరో 10-15వేల మంది ఉంటారు. ఇలా మొత్తంగా రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య 25వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే ఇక్కడ కంటే విదేశాల్లో ఎంఎస్ చేసేవారే నాలుగింతల మంది ఎక్కువగా ఉంటుండటం గమనార్హం.
అందుకే ఎంటెక్ చేయడం లేదు
ఉద్యోగ ఇంటర్వ్యూలకు కనీసం పిలవాలని కోరినా అనేక కంపెనీలు ఎంటెక్ వాళ్లు అవసరం లేదంటున్నాయి. అలాంటి ఆ డిగ్రీతో మాకేం ప్రయోజనం అంటూ విద్యార్థులు ఎంటెక్ చేయడం లేదు’ అని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రవీంద్ర అభిప్రాయపడ్డారు.
ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నందుకే
బోధన, పరిశోధన వైపు వెళ్లాలనుకునేవారే ఎక్కువగా ఎంటెక్ చేస్తున్నారు. మిగిలినవారు ఆ పట్టాతో భారత్లో తమ కెరీర్కు ఉపయోగం లేదంటూ విదేశాలకు వెళుతున్నారని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహమూ ఉంటోందన్నారు. మెండుగా ఉద్యోగావకాశాలు లభిస్తాయనే యువత అటువైపు దృష్టిపెడుతోందని వివరించారు.
* ఆర్థిక స్థోమత లేనివారు విద్యా రుణాలు తీసుకొంటున్నారు. ఆ మొత్తాన్నీ డ్రా చేయడం లేదు. మొదటి సెమిస్టర్ నుంచే పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తూ వసతి, భోజనాది ఖర్చులతో పాటు కొంత ఫీజునూ విద్యార్థులే చెల్లిస్తున్నారని ఐఎఫ్ఎంఎస్ విదేశీ కన్సల్టెన్సీ సంచాలకుడు అజయ్కుమార్ చెప్పారు.
ఎందుకీ పరిస్థితి..?
‘ఎంటెక్లో కూడా సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, డిజైన్ ఇంజినీరింగ్ లాంటి కొన్ని బ్రాంచీల వారికే ఉద్యోగాల్లో కాస్త ప్రాధాన్యం ఉంటుంది. దానివల్ల పీజీ చదివేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు’ అని జేఎన్టీయూహెచ్ కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు కామాక్షిప్రసాద్ చెప్పారు. వైద్యరంగంలో పీజీకి, ఫార్మాలో ఎంఫార్మసీ, న్యాయరంగంలో ఎంఎల్కు ఎంతో ప్రాధాన్యం ఉండగా.. ఇంజినీరింగ్లో తద్భిన్న పరిస్థితి కొనసాగుతోంది. అదే అమెరికాలో అయితే ఎంఎస్ ఆధారంగానే ఉద్యోగాలిస్తున్నారు. అందువల్ల మన యువత ఆ దేశం వైపు చూస్తోంది అన్నారాయన.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్