బాలాచారికి మెగాసిటీ నవ కళావేదిక విశిష్ట పురస్కారం

మెగాసిటీ నవకళా వేదిక సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఇచ్చే విశిష్ట ఉగాది పురస్కారాలు ఈ ఏడాది కూడా ప్రదానం అచేశారు. వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్ఠులైన

Published : 01 Apr 2022 14:37 IST

హైదరాబాద్‌: మెగాసిటీ నవకళా వేదిక సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఇచ్చే విశిష్ట ఉగాది పురస్కారాలు ఈ ఏడాది కూడా ప్రదానం అచేశారు. వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్ఠులైన ప్రముఖులకు వాటిని అందజేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలు అందించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఎన్‌.బాలాచారికి మధుసూదనాచారి విశిష్ట పురస్కారం అందజేశారు. 

బాలాచారి గత 22 ఏళ్లుగా ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేసి తనదైన ముద్రవేశారు. స్వచ్ఛ భారత్‌, స్వయం సహాయక సంఘా ఏర్పాటు, రుణాల అందజేత, గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై యూనిసెఫ్‌తో కలిసి 6 ఏళ్లు సేవలు  అందించారు. ఈ సందర్భంగా బాలాచారి మాట్లాడుతూ ఇలాంటి సత్కారాలు ఇంధనంలా పనిచేస్తాయని పేర్కొన్నారు. దీనివల్ల ఇంకా ఉత్తేజితమై మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని