US: ఎడిసన్‌ సిటీ సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్‌

అమెరికాలో భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌ సిటీ సాంస్కృతిక కళల 

Published : 05 Sep 2022 11:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌ సిటీ సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్‌ కాస్థల నియమితులయ్యారు. గత పదేళ్లుగా ఆయన ఎడిసన్‌లో నివసిస్తూ ప్రవాస భారతీయ సంఘాల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహహణలో కీలకపాత్ర పోషించారు. న్యూజెర్సీ స్టేట్‌లో ఐదో పెద్దనగరంగా ఉన్న ఎడిసన్‌ సిటీ జనాభా లక్షకు పైగా ఉంటే.. వారిలో 30 మంది భారత సంతతి వారే. లిటిల్‌ ఇండియాగా పిలిచే ఓక్‌ ట్రీ రోడ్డు ఎడిసన్‌ నగరంలోనే ఉంది. 2022 జనవరిలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా భారత సంతతికి చెందిన సామ్‌ జోషి మేయర్‌గా ఎన్నికయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని