సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తిరుమలకు కాలి నడకన ఎన్నారైలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కొందరు ఎన్నారైలు తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి అమెరికాలో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. 

Updated : 09 Dec 2023 12:05 IST

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కొందరు ఎన్నారైలు తిరుమలకు కాలినడకన వెళ్లారు. రేవంత్ రెడ్డికి అమెరికాలో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.

రేవంత్ సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి, రవి పొట్లూరితో పాటు పలువురు ఎన్నారైలు.. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా వారు శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లారు.

'మేమందరం ఏడు కొండలు నడిచి ఎక్కుతామని ఆ వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాం. ఇప్పుడు ఆ మొక్కు చెల్లించుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందాలని కోరుకుంటున్నాం’ అని రవి పొట్లూరి తెలిపారు. అనుముల జగదీశ్వర్ రెడ్డి, కాట్ల రాజు, మిడుదుల సుధీర్ రెడ్డి, స్రవంత్‌, ఆదిత్య, ముప్పా రాజ శేఖర్‌ కాలినడకన తిరుమల చేరుకొన్నారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణించాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని