ఓటు లేని విద్యార్థుల విజ్ఞప్తులు వినాలని.. ‘డయల్ యువర్ విలేజ్’ పోస్టుకార్డు ప్రచారం
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. ఓటు వేసే వారికే విలువ ఉంటుందని.. మరి, హక్కు లేని విద్యార్థుల సమస్యలు ఎవరు పట్టించుకోవాలని "డయల్ యువర్ విలేజ్" అనే ఎన్నారై సంస్థ ప్రశ్నించింది.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. ఓటు వేసే వారికే విలువ ఉంటుందని.. మరి, హక్కు లేని విద్యార్థుల సమస్యలు ఎవరు పట్టించుకోవాలని "డయల్ యువర్ విలేజ్" అనే ఎన్నారై సంస్థ ప్రశ్నించింది.
"నేటి బాలలే రేపటి పౌరులు" అంటారు. రేపు పౌరులుగా ఎదగాల్సిన వారికి సరైన విద్యాబుద్ధులు నేర్పిస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. గత ఏడు దశాబ్దాల స్వతంత్ర దేశంలో ఇంకా గ్రామీణ ప్రాంత పిల్లలకు సరైన విద్య అందడం లేదు. ప్రభుత్వ విద్యపై నమ్మకం కోల్పోయిన ప్రజలు ప్రైవేట్లో వేల, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి మారాలని, నూతన ప్రభుత్వం విద్యను ఒక ప్రాధాన్యతగా తీసుకొని, భారీగా బడ్జెట్ కేటాయించాలని "డయల్ యువర్ విలేజ్" అనే ఎన్నారై సంస్థ "పోస్టుకార్డు ప్రచారం" మొదలుపెట్టింది. వేలాదిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు ముందుకొచ్చారు. ఇరవై వేలకు పైగా విద్యార్థులు తమ బడులలో సమస్యలను రాసి, ముఖ్యమంత్రికి నేరుగా పోస్ట్ కార్డు ద్వారా పంపించారు.
"ఇది పోస్ట్ కార్డు కాదు, విద్యార్థుల ఆవేదన! ఉపాధ్యాయుల విజ్ఞప్తి! సమస్త గ్రామీణ ప్రజల ఆకాంక్ష! కేవలం మాకు నాణ్యమైన విద్య ఇస్తే చాలు, ఏ ఉచితాలు మాకు అక్కర్లేదు, మా భవిష్యత్తు మేము నిర్మించుకోగల్గుతాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఉచితాల పేరిట మమ్మల్ని నిర్వీర్యులను చేయకండి. మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి" అని వాళ్ల మనసులు ఘోషిస్తున్నాయని "డయల్ యువర్ విలేజ్" సంస్థ పేర్కొంది.
‘‘ఉచితాలు ఇస్తే తీసుకుంటున్నారుగా అని అనకండి. అది కేవలం మాకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మేము మా పిల్లలకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాం. మా ఖర్చులు తగ్గించుకుని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు బీద ప్రజలను న్యూనత భావనలోకి నెడుతున్నాయి. వారిని కేవలం ఓటు, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. చదువు రాని వాళ్లను అట్లాగే ఉంచేసి, ఒక బానిస సమాజాన్ని తయారు చేస్తున్నారు. దానితో, తమ డబ్బుతో చదువు ‘కొనే’ వారికే అన్ని అవకాశాలు, ప్రయోజనాలు చేకూరుతున్నాయి. బీద, గ్రామీణ సమాజానికి, ధనిక, పట్టణ వాసులకు అంతరం రోజు రోజుకి పెరుగుతుంది. మంచి విద్య లేకపోతే, స్వావలంబన, సృజనాత్మకత ఎలా వస్తుంది? ఈ అర కోర చదువుల వల్లే యువత ప్రభుత్వ ఉద్యోగాలపై అనవసర ఆశలు పెట్టుకొని తమ సమయాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం. ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య బీదలకు, గ్రామీణులకు, పట్టణాల్లో ఉన్న పేదలకు అందించడం’’ అని ఆ సంస్థ సూచించింది.
‘‘పరిపాలనలో దక్షత, సుపరిపాలన అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల ప్రణాళికలు, వాటి ఫలితాలు ప్రజలకు చేరే విధంగా చూడటం. కేవలం డబ్బులు పంచడం విజ్ఞత కాదు. అది పరిపాలన అనిపించుకోదు. ప్రభుత్వ విధానాలు సంస్కరించడానికి మొదటి చర్య విద్య కావాలి. ఎన్నారైలుగా మాకు విద్య విలువ తెలుసు. కేవలం విద్య ఉండటం వల్లే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా ఈ స్థాయికి రాగలిగాం. ప్రతి పేద, గ్రామీణ విద్యార్థికి ఆ అవకాశం ఉంది. కేవలం మంచి విద్య ఇవ్వండి చాలు. అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని నిలబెడుతుంది. మేము అనేక రకాలుగా మాకు అవకాశం ఉన్నంతవరకు అనేక విద్యార్థులకు, బడులకు సాయం చేస్తున్నాం. కానీ, మా సాయం పరిమితం. అక్కడి అవసరాలు పరిమితం’’ అని ఆ సంస్థ తెలిపింది. బడులను బాగు చేయాలని.. విద్యా వ్యవస్థను కాపాడాలని అందరి విద్యార్థుల తరఫున తాము విజ్ఞప్తి చేస్తున్నామని "డయల్ యువర్ విలేజ్" కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!