YSRCP: మార్కాపురం ఎమ్మెల్యేపై సీబీఐకి ఫిర్యాదు చేస్తా: వైకాపా బహిష్కృత నేత

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిపై వైకాపా బహిష్కృత నేత సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

Updated : 18 Dec 2023 20:56 IST

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిపై వైకాపా బహిష్కృత నేత సూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల నుంచి 10శాతం కమీషన్‌ తీసుకొని నాగార్జునరెడ్డి మామ, బావమరిది అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ ఆసరాలో భారీగా అవినీతి చేశారని, రోగులు లేకపోయినా కొన్ని ఆస్పత్రుల్లో ఉన్నట్లు చూపించి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆయన మామ, బావమరిదిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని