Pawan Kalyan: తీర ప్రాంత డబ్బంతా పెద్దిరెడ్డి కంపెనీలకే
దివీస్ను సముద్రంలో కలిపేస్తానన్న ముఖ్యమంత్రి.. దాంతోపాటు ఇప్పుడు అరబిందోను కూడా తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ పరిశ్రమలతో మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయన్నారు.
దివీస్ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారుగా..
ఆ మాట మర్చిపోయిన సీఎం అరబిందోనూ తెచ్చారు
ఆ పరిశ్రమలతో మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
ఈనాడు, కాకినాడ: దివీస్ను సముద్రంలో కలిపేస్తానన్న ముఖ్యమంత్రి.. దాంతోపాటు ఇప్పుడు అరబిందోను కూడా తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ పరిశ్రమలతో మత్స్యకారుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయన్నారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని.. కానీ మీ అభివృద్ధి, వృత్తి దెబ్బతీయకుండా కృషి చేస్తాను, మీరంతా సమష్టిగా ఉండకపోతే రోడ్డున పడిపోతారని మత్స్యకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు మాకు అండగా ఉంటే.. జనసేన మీ కోసం పోరాడుతుందన్నారు. పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం కాకినాడ బోట్ జెట్టీ నుంచి మోటారు బోటులో ఉప్పుటేరులో పర్యటించి మత్స్యకార ప్రాంతాలను పరిశీలించారు. ఏటిమొగలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. తొండంగి మండలంలో దివీస్, అరబిందో పరిశ్రమలు వస్తే మత్స్యకారుల జీవనం అతలాకుతలం అవుతుందన్నారు. ఓఎన్జీసీతో సమస్య ఉందని, చమురుతట్టు సముద్రంలోకి వెళ్లడంతో మత్స్యకారులు నష్టపోతున్నారన్నారు. మరి ఇంతమంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రిలయన్స్, ఓఎన్జీసీ, ఇతర సంస్థలతో మాట్లాడతానన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దగ్గర మూడు కంపెనీలు ఉన్నాయని.. ఈ తీరప్రాంతానికి చెందిన డబ్బంతా వాటికే పోతోందని ఆరోపించారు. ఇసుక ఉచితం చేస్తే దానిపై ఆధారపడే బీసీ కులాలతోపాటు.. మత్స్యకారులూ బతుకుతారన్నారు. కష్టపడేవారి దగ్గరే పెట్టుబడి ఉండాలన్నారు. మీరు నన్ను గెలిపిస్తే.. ఆ పెట్టుబడి ఇవ్వగలనని పవన్ అన్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తీర ప్రాంతంలో తాగునీటి సమస్యనూ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ ఎంపీ తోట నర్సింహం కుటుంబసభ్యులు ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్కు చెందిన 248 ఎకరాలను గుప్పిట పెట్టుకున్నారని ఎంఎస్ఎన్ ఛారిటీస్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మల్లాడి రాజు ఆరోపించారు. ఛారిటీస్కు 1,800 ఎకరాల భూమి ఉండేదని.. కబ్జాలతో 1,258 ఎకరాలే మిగిలిందన్నారు.
నేరగాళ్లు రాజ్యమేలితే శాంతిభద్రతలు క్షీణిస్తాయి
‘సాక్షాత్తూ ఎంపీ కుటుంబానికే రాష్ట్రంలో రక్షణ లేదు. తన అక్కను వేధిస్తున్నారని నిలదీస్తే 14 ఏళ్ల బాలుడిని పెట్రోలు పోసి తగలబెట్టేశారు. నేరగాళ్లు రాజ్యమేలితే శాంతిభద్రతలు ఇలాగే క్షీణిస్తాయి’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కాకినాడలో జనసేన వీర మహిళలతో ఆయన సమావేశమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జోనల్ రైల్వే వినియోగదారుల సంఘం సభ్యుడు వైడీ రామారావు మాట్లాడుతూ అన్నవరం నుంచి గ్రీన్ఫీల్డ్ పోర్టు, కాకినాడ పోర్టు, కోటిపల్లి, నరసాపురం మీదుగా రేపల్లె వరకు రైల్వేలైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పవన్ స్పందిస్తూ కోస్తా రైలు మార్గం అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పంతం నానాజీ, బొమ్మిడి నాయకర్, నగర అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
* వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన తరుణంలో మంగళవారం నుంచి పవన్ కల్యాణ్ ఉపవాస దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ దీక్షను నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగిస్తారు.
వైకాపా వల్లే వ్యవస్థ గాడి తప్పుతోంది
‘పాలకులు బాధ్యతగా వ్యవహరించకపోతే.. యంత్రాంగం కూడా సక్రమంగా పనిచేయదు. చిన్న పరిశ్రమ ఏర్పాటుకూ ఏళ్ల తరబడి అనుమతులు రావు. ప్రతికూల పరిస్థితులతో ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను పూర్తిగా చంపేసింది’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా సోమవారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ప్రముఖులు, మేధావులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిలా నోటికొచ్చిన హామీ ఇచ్చి వదిలేయనని.. జనసేన సుపరిపాలన ప్రతి వర్గానికి జవాబుదారీగా ఉంటుందన్నారు. మన ఎంపీలు పార్లమెంటుకు వెళ్లి ప్రజల సమస్యలపై ఒక్క మాటా మాట్లాడరని.. టిఫిన్లు తినేసి వచ్చేస్తారని విమర్శించారు. వైకాపా రాజకీయాలు చూసి ఇలాంటి కుళ్లు రాజకీయాలు మాకెందుకని వైద్యులు, న్యాయవాదులు, మేధావులు దూరంగా ఉండిపోతున్నారన్నారు. కాకినాడ వంటి నగరాల్లోనూ ప్రజలు ఓటేయడానికి రాకపోవడానికి కారణం ఇదేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
తాను అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేరని, అందుకే తనతో చర్చకు నిరాకరిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. -
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గట్టికౌంటర్ ఇచ్చారు. -
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
రాహుల్ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. -
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. -
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు