Minister Peddireddy: పుంగనూరు పెద్దిరెడ్డి జాగీరా?
పుంగనూరు ఏమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాగీరా? అక్కడ ఎవరూ అడుగుపెట్టకూడదా? వైకాపా మినహా ఇతర ఏ పార్టీ జెండా ఎగరకూడదా? ఏంటీ దాష్టీకం? పుంగనూరు ప్రత్యేక దేశమా? అక్కడకు వెళ్లాలంటే పెద్దిరెడ్డి నుంచి పాస్పోర్టు, వీసా తీసుకోవాలా?
తెదేపా జెండా పట్టుకున్నందుకు దాష్టీకమా?
బట్టలు విప్పించి.. బూతులతో విరుచుకుపడతారా?
ఇది ‘గూండా రాజ్’ కాకపోతే మరేంటి?
ఈనాడు-చిత్తూరు, అమరావతి: పుంగనూరు ఏమైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాగీరా? అక్కడ ఎవరూ అడుగుపెట్టకూడదా? వైకాపా మినహా ఇతర ఏ పార్టీ జెండా ఎగరకూడదా? ఏంటీ దాష్టీకం? పుంగనూరు ప్రత్యేక దేశమా? అక్కడకు వెళ్లాలంటే పెద్దిరెడ్డి నుంచి పాస్పోర్టు, వీసా తీసుకోవాలా? తమ అభిమాన నాయకుడైన చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న సామాన్య తెదేపా కార్యకర్తలపై పుంగనూరులో వైకాపా కార్యకర్తల దాష్టీకానికి పాల్పడిన ఘటన ఒకప్పటి ఆటవిక రాజ్యాల్లోని పరిస్థితులను తలపించింది. సైకిల్ యాత్రికులు ధరించిన పసుపు చొక్కాలను విప్పించి, తెదేపా జెండాలు, పసుపు కండువాలు తీసేయించి.. అసభ్య పదజాలంతో దూషించడం అక్కడ గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న అరాచకానికి ఓ తార్కాణం మాత్రమే. ‘ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం. ఇక్కడ తెదేపా జెండా ఎగరకూడదు. మిమ్మల్ని కొట్టకుండా పంపిస్తున్నాం సంతోషించండి. పుంగనూరులో అడుగు పెట్టి వెనక్కి వెళ్లగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. తెదేపా జెండాలతో ఇక్కడి మీరెలా వస్తారు?’ అంటూ అధికారమదంతో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోవడం బిహార్ లాంటి రాష్ట్రాల్లో ఒకప్పుడు చూసిన ‘‘గూండా రాజ్’’ను గుర్తు చేసింది. పుంగనూరులో ప్రతిపక్ష పార్టీలకు, సామన్య పౌరులకు హక్కులు లేవా? ప్రతిపక్ష పార్టీల జెండాలు కనిపించకూడదా? ఇది నియంత పాలన కాకపోతే మరేంటి?
బట్టలు విప్పించి.. బండబూతులతో విరుచుకుపడి
‘రేయ్.. తెదేపా జెండాలు పట్టుకుని ఎవడ్రా ఇక్కడికి మిమ్మల్ని రమ్మన్నాడు. ఆ జెండాలు పీకేసి వెంటనే పారిపోండి. లేదంటే ఎస్సై, సీఐ, డీఎస్పీకి ఫోన్ చేసి పిలిపించి బొక్కలో వేయిస్తాం.. మీ అమ్మా అబ్బలు జగన్ ఇస్తున్న పింఛను, మీ పెళ్లాలు అమ్మఒడి డబ్బులు తీసుకుంటున్నారు కదరా’ అంటూ చెంగలాపురం సూరి, ఇతర వైకాపా కార్యకర్తలు తమను దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన సైకిల్ యాత్రికులు మాజీ సర్పంచి రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేష్లు వాపోయారు.
పసుపు రంగు దుస్తులు కొనటమే నేరం
‘చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ నెల 2న మా గ్రామం నుంచి కుప్పం సైకిల్పై బయల్దేరాం. 20వ తేదీ సాయంత్రం పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీ తాగేందుకు ఆగగా.. చెంగలాపురం సూరి, నీరుగట్టి శివప్ప, వినయ్కుమార్ మరికొందరు వైకాపా కార్యకర్తలు కార్లలో వచ్చారు. వెంటనే మాపై బండబూతులతో విరుచుకుపడ్డారు. మేము కూర్చొని టీ తాగుతుంటే.. మమ్మల్ని లేచి నిలబడమంటూ హుకుం జారీ చేశారు. సైకిళ్లపై ఉన్న తెదేపా జెండాలు తీసేయాలన్నారు. మా శరీరంపై పసుపు దుస్తులే ఉండకూడదని బెదిరించారు. మా దగ్గర పసుపు చొక్కాలే ఉన్నాయి. వేరేవి లేవని చెప్పగా.. ‘పసుపు రంగు దుస్తులు కొనడమే మీరు చేసిన అతి పెద్ద నేరం’ అంటూ దుర్భాషలాడారు. మమ్మల్ని వరుసగా నిలబెట్టి జెండాలు, కర్రలు తీసేంతవరకూ ముందుకు కదలనీయలేదు. జెండా కర్రలు విరిచేశారు. పసుపు చొక్కాలు తీస్తారా? తన్నమంటారా అంటూ రెచ్చిపోయారు. మేము వేసుకున్న పసుపు టీ షర్టులు విప్పించి.. వేరే రంగు షర్టులు వేసుకునే వరకూ మమ్మల్ని బూతులు తిడుతూనే ఉన్నారు. దాదాపు గంట పాటు హింసించారు. జెండాలు తీసేసిన తర్వాత కూడా మాపై భౌతికదాడికి యత్నించారు. చివరికి స్థానికంగా ఉన్న గ్రామస్థులు జోక్యం చేసుకుని జెండాలు తీసేశారు కదా.. వారిని పంపించేయండని చెప్పడంతో విడిచిపెట్టారు. మా పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తించారు. తెదేపా అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు కుప్పం వెళ్తున్నామని చెప్పగా.. ‘వాడికెందుకురా సంఘీభావం’’ అంటూ బండబూతులు మాట్లాడారు. తెదేపా జెండాలను వైకాపా కార్యకర్తలు కాళ్లతో తొక్కిన తర్వాతే మమ్మల్ని అక్కడి నుంచి పంపించారు’ అని రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరరావు, రమేష్లు చెప్పారు.
పెద్దాయన.. నోరు విప్పరేం?
జగన్ మంత్రివర్గంలో అత్యంత సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ ప్రాంతంలోని వైకాపా నాయకులు ‘‘పెద్దాయన’’ అని పిలుస్తారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఆయన అనుచరుడు, వైకాపా నాయకుడు చెంగలాపురం సూరి అలియాస్ సురతోటి సురేష్ సైకిల్ యాత్రికులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన జరిగి మూడు రోజులవుతోంది. అయినా సరే ఇప్పటివరకూ ఈ అరాచకాన్ని ఆ పెద్దాయన ఖండించలేదు.
బెయిలబుల్ సెక్షన్లతో సరిపెడతారా..?
పుంగనూరులో వైకాపా అరాచకంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు రావటంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేసినప్పటికీ బెయిల్కు వీలైన సెక్షన్ల మాత్రమే పెట్టి మమ అనిపించేశారు. దీంతో వారు గంటల వ్యవధిలోనే బయటకు వచ్చేశారు. ప్రతిపక్ష కార్యాకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపినా హత్యాయత్నం తదితర తీవ్రమైన సెక్షన్లకింద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఈ వ్యవహరంలో తేలికపాటి సెక్షన్లతో కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. కేసును నీరుగార్చేందుకే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. పెద్దిరెడ్డి అండదండలతోనే చెంగలాపురం సూరి రెచ్చిపోయారని, అధికార పార్టీ నాయకుడు కావడం వల్లే పోలీసులు మొక్కుబడి సెక్షన్లతో సరిపెట్టేశారన్న విమర్శలున్నాయి.
అలా అరెస్టు.. ఇలా బెయిలు.!
శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పానికి సైకిల్ యాత్రగా వస్తున్న తెదేపా కార్యకర్తలను పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద దూషించి, దుస్తులు విప్పించిన ఘటనలో నమోదైన కేసులో నిందితులైన వైకాపా కార్యకర్తలు చెంగలాపురం సూరి, శివప్పకు పలమనేరు కోర్టు ఆదివారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. 15 రోజుల్లోగా ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
తాను అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేరని, అందుకే తనతో చర్చకు నిరాకరిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. -
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గట్టికౌంటర్ ఇచ్చారు. -
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
రాహుల్ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. -
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. -
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు