అధికార పార్టీకి రూ.వందల కోట్ల అనుచిత లబ్ధి
ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖలో కీలక స్థానంలో ఉన్న కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు అధికార వైకాపాకు అనుచిత లబ్ధి కలిగిస్తున్నారు.
వైకాపా అనుయాయులకే బిల్లుల చెల్లింపులు
ఎన్నికల కోడ్ వచ్చినా అదే పరిస్థితి
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖలో కీలక స్థానంలో ఉన్న కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు అధికార వైకాపాకు అనుచిత లబ్ధి కలిగిస్తున్నారు. ఈ ఎన్నికల వేళ ఆర్థికశాఖలో రూ.వేల కోట్లు అధికారపార్టీ అనుయాయులకే చెల్లింపులు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఫిఫో) విధానం అనుసరించడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చినా ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు ప్రస్తుత నెలలో మార్చి 6 నుంచి 15 వరకు రూ. 6,500 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఎన్నికల కోడ్ వచ్చాక రూ.500 కోట్లు చెల్లించారు. ఇవన్నీ అధికార పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా సాగిన చెల్లింపులే. ఆర్థికశాఖలో ఈ ఉన్నతాధికారిని, ఆపైన ఉన్న మరో ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను మార్చకపోతే పోలింగు లోపు వైకాపాకు రూ.వేలకోట్ల అనుచిత లబ్ధి కలిగించేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. ఆ సొమ్ములన్నీ తిరిగి ఎన్నికల అవసరాలకే ఉపయోగపడతాయి. ఎప్పటినుంచో వైకాపా పెద్దలతో అంటకాగుతున్న సీఎంఓలోని ఉన్నతాధికారి, సచివాలయంలో ఒక అత్యున్నతస్థాయి అధికారులను ఆ స్థానాల నుంచి మారిస్తేనే ఈ అక్రమాలకు తెరపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖలో బడ్జెట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కార్యదర్శి పోస్టు ఎంతో కీలకం. ఆ స్థానంలో ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి హోదాలో కె.వి.వి.సత్యనారాయణ ఉన్నారు. ఫిఫో విధానానికి తిలోదకాలిచ్చి 5 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా బిల్లుల చెల్లింపు సాగిపోయింది. ఇందులో ఆర్థికశాఖలో బిల్లుల చెల్లింపు వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కె.వి.వి.సత్యనారాయణ కీలకం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వచ్చినా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా రూ.వేల కోట్ల చెల్లింపులు జరిగిపోతున్నాయి.
కొత్త అప్పులు అనుయాయులకు కట్టబెట్టే యోచన?
ఏప్రిల్లో కొత్త ఆర్థిక సంవత్సరం వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల అప్పులు తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇస్తుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5% మేర నికర రుణపరిమితిగా లెక్కించి కొన్నింటిని మినహాయించి, మరికొన్నింటిని జత చేసి ఈ రుణపరిమితి ఎంతో కేంద్ర ఆర్థికశాఖ తేలుస్తుంది. తొలి 9 నెలలకు రూ.55 వేల కోట్ల వరకు రుణపరిమితి వచ్చే ఆస్కారం ఉంది. అంటే నెలకు సగటున రూ.5,500 కోట్లు మాత్రమే రుణం తీసుకోవాలి. కానీ మే 13 వరకు దాదాపు రూ.20వేల కోట్లకు పైగా కొత్త అప్పులు పుట్టించి అధికారపార్టీ అనుయాయులకే చెల్లింపులు చేసే వ్యూహాలు సాగుతున్నాయని సమాచారం. అవన్నీ వైకాపాకు ఈ ఎన్నికల్లో ఉపయోగపడబోతున్నాయి. ఆర్థిక శాఖలో, ఆపైన అత్యంత ఉన్నత స్థానంలో వైకాపా పెద్దలకు ఎప్పటి నుంచో అండగా ఉంటున్న అధికారులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల కోడ్ వచ్చినా వారే ఆ పోస్టులో ఉన్నారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ బిల్లుల చెల్లింపు రూపంలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇద్దరు ఉన్నతాధికారులనూ మారిస్తే తప్ప ఈ వ్యవహారానికి చెక్ పెట్టడం సాధ్యం కాదనే చర్చ ఆర్థికశాఖలో అంతర్గతంగా సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను చేయను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను చేయను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం