భాజపా అభ్యర్థిగా ‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ బాధిత మహిళకు భాజపా టికెటిచ్చింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు.. సందేశ్‌ఖాలీలో మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు వచ్చిన ఆరోపణలుతీవ్ర దుమారం రేపాయి.

Updated : 26 Mar 2024 06:15 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ బాధిత మహిళకు భాజపా టికెటిచ్చింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు.. సందేశ్‌ఖాలీలో మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు వచ్చిన ఆరోపణలుతీవ్ర దుమారం రేపాయి. ఈ అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన రేఖ పత్రా అనే మహిళ కొద్ది నెలల క్రితం ఇక్కడ మహిళలు చేపట్టిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. తాజాగా భాజపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బసిర్‌హట్‌ స్థానం నుంచి ఆమెకు టికెట్‌ లభించింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే సందేశ్‌ఖాలీ గ్రామం ఉంది. బసిర్‌హట్‌ నియోజకవర్గానికి ప్రస్తుతం తృణమూల్‌ నేత, నటి నుష్రత్‌ జహాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఆమెను పక్కనబెట్టి హజీ నురుల్‌ ఇస్లామ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని