వైరస్ పెరుగుతోంటే స్టేడియాల్లోకి ఫ్యాన్స్
ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడలను నిర్వహించడమే కత్తిమీద సాము. ఇక బయో బుడగను సృష్టించడం అంతకు మించి కష్టం. అలాంటి ఓ పక్కన వైరస్ కేసులు పెరుగుతోంటే స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తామని షాకిచ్చారు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు. అంతేకాకుండా అంతర్జాతీయ సర్క్యూట్..
ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులపై విమర్శలు
ప్యారిస్: ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడలను నిర్వహించడమే కత్తిమీద సాము. ఇక బయో బుడగను సృష్టించడం అంతకు మించి కష్టం. అలాంటి ఓ పక్కన వైరస్ కేసులు పెరుగుతోంటే స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తామని షాకిచ్చారు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు. అంతేకాకుండా అంతర్జాతీయ సర్క్యూట్ ఆరంభమయ్యాక అభిమానులను అనుమతించిన మొదటి టోర్నీ తమదేనని గొప్పగా చెబుతున్నారు. క్రీడాకారులు సహా అనేక మంది ఈ నిర్ణయాన్ని విమర్శిస్తుండటం గమనార్హం.
కరోనా వైరస్ కారణంగానే మే నెల్లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడటంతో సెప్టెంబర్ 27 నుంచి టోర్నీ ఆరంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే అభిమానులను అనుమతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు గ్రాండ్స్లామ్లు ఆడేందుకు నిరాకరిస్తున్నారు. యూఎస్ ఓపెన్లో చాలామంది ఆడలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆష్ బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడనని ప్రకటించేసింది.
‘యూఎస్ ఓపెన్ ముగిసిన కొన్నాళ్లకే ఎర్రమట్టి కోర్టుల్లో సమరాలు మొదలవ్వనున్నాయి. అంతర్జాతీయ సర్క్యూట్ ఆరంభమైన తర్వాత అభిమానులను అనుమతించిన తొలి టోర్నీ రొలాండ్ గ్యారోస్ మాత్రమే’ అని ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్ గిడిసెల్లి సోమవారం ప్రకటించారు. అయితే సమాఖ్య నిర్ణయంలో అర్థం లేదని గ్రీక్ టెన్నిక్ క్రీడాకారిణి మరియా సక్కారి విమర్శించింది. అభిమానులతో బయో బుడగ ఎలా సృష్టిస్తారని ప్రశ్నించింది.
స్టేడియం సామర్థ్యంలో 50-60 శాతం మందిని అనుమతించాలని నిర్వాహకులు తొలుత భావించారు. అంటే రోజుకు దాదాపుగా 20 వేల మంది అన్నమాట. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం కేవలం 5000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో ప్రణాళికల్లో మార్పు చేశారు. మొత్తం మూడు జోన్లుగా విభజించారు. ప్రధాన కోర్టులున్న ఫిలిఫ్ ఛాట్రూయిర్, సుజన్ లెగ్లెన్ ప్రాంగణాల్లో 5000 చొప్పున అనుమతిస్తారు. ఆ తర్వాత పెద్దదైన మూడో కోర్టులో 1500 మందికే ప్రవేశం కల్పిస్తున్నారు. అభిమానులకు కచ్చితంగా మాస్క్ ధరించాలని, వైరస్ టెస్టులు చేయించుకోవాలని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!