Asia Cup 2023: నంబర్ -4లో విరాట్ కరెక్ట్.. ఎందుకంటే?: ఏబీ డివిలియర్స్
అందరూ చెబుతున్నట్లుగా ఆసియా కప్లో (Asia Cup 2023) నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ కానీ.. శ్రేయస్ అయ్యర్ అవసరం లేదని.. విరాట్ కోహ్లీ ఆడితే సరిపోతుందని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ (Asia Cup 2023) బరిలోకి దిగేందుకు టీమ్ఇండియా (Team India) సిద్ధమవుతోంది. అయితే, నాలుగో స్థానంలో ఆడేది ఎవరు? అనే చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, వీరిద్దరి కంటే నాలుగోస్థానంలో సరైన ఆటగాడు విరాట్ కోహ్లీనేనని ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అప్పుడే మిడిలార్డర్ మరింత బలంగా మారుతుందని చెప్పాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్లో వస్తే టీమ్ఇండియాకు తిరుగుండదని పేర్కొన్నాడు.
‘‘విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడు. ఇలాంటి అభిప్రాయం ఇంకెవరైనా చెప్పినా మద్దతుగా నిలుస్తా. అతడి గణాంకాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఇన్నింగ్స్ను నిలబెట్టి మిడిలార్డర్కు బాసటగా నిలిచే ఆటగాడు విరాట్ అని అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం అతడు ఈ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు. జట్టుకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఆడాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉంటుంది. అందుకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందే. ఇక ఆసియా కప్లో పాకిస్థాన్, భారత్ ఫేవరేట్లు. కానీ, శ్రీలంక కూడా పెద్ద జట్లకు షాక్ ఇవ్వగల సత్తా కలిగిన టీమ్. ఏమాత్రం అలసత్వం వహించినా గతేడాది ఫలితం పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు’’ అని ఏబీ డివిలియర్స్ వివరించాడు.
జట్టు ఎంపికలో అయోమయం: క్రిష్టమాచారి శ్రీకాంత్
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై మాజీ క్రికెటర్ క్రిష్టమాచారి శ్రీకాంత్ కాస్త అంసతృప్తి వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయి ఫిట్గా లేని కేఎల్ రాహుల్ను తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అయోమయానికి గురైనట్లు పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టు సరిగ్గా లేదనిపిస్తోంది. జట్టులో ఎందుకు అంతమంది మీడియం పేసర్లు? ఎవరు ఫిట్గా ఉన్నారనేది సెలెక్టర్లకు తెలిసినట్లు లేదు. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ను దృష్టిలో ఉంచుకుని.. అతడిని ఎంపిక చేయకుండా ఉంటే బాగుండేది. సెలెక్షన్ సమయానికి ఆటగాడు ఫిట్గాలేకపోతే ఎంపిక చేయకుండా ఉండాలనేదే నా పాలసీ. అతడు వరల్డ్ కప్లోనూ అందుబాటులో ఉండాలనుకుంటున్నారా? అలాంటప్పుడు ఆసియా కప్లో రెండు గేమ్లు తర్వాత ఆడతాడని ఆశిస్తున్నారా? ఇదే విషయంలో అగార్కర్ కమిటీ అయోమయానికి గురైంది. ఇక యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఐర్లాండ్పై నాలుగు ఓవర్ల స్పెల్ ఆధారంగా అతడిని ఎంపిక చేశారు. దాదాపు సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతడి ఎంపికా సరైందేనని మీరు భావిస్తున్నారా?’’ అని క్రిష్ ప్రశ్నించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్, కోల్కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. -
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్పై ఘన విజయాన్ని నమోదు చేసింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు. -
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన