IPL 2024: సీఎస్కే వైపు రోహిత్ పయనం? చూడాలని ఉందన్న మాజీ క్రికెటర్
ఐపీఎల్ సందడి (IPL 2024) మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. కానీ, రోహిత్ శర్మ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ముంబయికే ప్రాతినిధ్యం వహిస్తాడా? మరో జట్టుకు వెళ్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను (Rohit Sharma) సారథ్య బాధ్యతల నుంచి ముంబయి ఇండియన్స్ తప్పించిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన అతడిని కాదని.. హార్దిక్ పాండ్యను నాయకుడిగా నియమించింది. మరో పది రోజుల్లోనే ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ ప్రారంభం కానుంది. హార్దిక్ నాయకత్వంలో రోహిత్ శర్మ ఆడతాడా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. హిట్మ్యాన్ ఇతర జట్టులోకి వెళ్తాడని కొందరు చెబుతున్నారు. తాజాగా రోహిత్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్లోకి వెళ్తాడనే వార్తలు వస్తున్నాయి. వీటిపై సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) స్పందించాడు.
‘‘చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున రోహిత్ ఆడటం చూడాలని ఉంది. ఇప్పటికే ముంబయి తరఫున చాలా కాలంపాటు ఆడాడు. ఇప్పుడు సీఎస్కేకు ఆడి విజయాల్లో పాలుపంచుకుంటే బాగుంటుంది. కెప్టెన్సీ కూడా దక్కే అవకాశం లేకపోలేదు. రోహిత్కు సరైన పిలుపు వస్తుందని భావిస్తున్నా. అయితే, అతడు తీసుకుంటాడో.. లేదో వేచి చూడాలి’’ అని రాయుడు వ్యాఖ్యానించాడు. రోహిత్ సీఎస్కేకు ఆడతాడని గతంలోనే అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
రోహిత్ వస్తాడా?
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మూడో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి దిగలేదు. వెన్ను నొప్పి కారణంగా డగౌట్కే పరిమితమయ్యాడు. విజయం సాధించిన అనంతరం ట్రోఫీ అందుకొన్నాడు. యువ ప్లేయర్లతో ఫొటోలు తీసుకున్నాడు. అయితే, అతడి గాయం పరిస్థితిపై ఇంతవరకు అప్డేట్ లేదు. ఒకవేళ ముంబయి కెప్టెన్సీ మార్పుతో రోహిత్ ఈ సీజన్లో ఆడకుండా ఉండిపోతాడా? అనే ప్రశ్న తలెత్తడం సహజమే. ఈ మెగా లీగ్ ముగిసిన తర్వాత.. టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ కోసం అమెరికా-విండీస్ వెళ్లనుంది. పొట్టి కప్లో భారత్ను రోహితే నడిపిస్తాడని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో గాయం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే.. ఐపీఎల్ ఆరంభంలో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండి.. పూర్తి ఫిట్నెస్ సాధించాక బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..