IRE vs IND: తొలి పేసర్గా అర్ష్దీప్.. ధోనీ నుంచే ‘కెప్టెన్సీ’ సలహాలు.. ఆరో స్థానంలో రింకు పర్ఫెక్ట్!
ఐర్లాండ్తో టీ20 సిరీస్లో (IRE vs IND) భారత యువ ఆటగాళ్లు అదరగొట్టేస్తున్నారు. ఈ క్రమంలో అర్ష్దీప్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్ కీలక ఇన్నింగ్స్లు ఆడారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో (IRE vs IND) భారత్ యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో కెప్టెన్ బుమ్రా (Bumrah) రికార్డును అధిగమించడం విశేషం. రెండో మ్యాచ్లో ఒక్క వికెట్ను మాత్రమే తీసిన అర్ష్దీప్ టీ20ల్లో 50 వికెట్లు పడగొట్టిన జాబితాలో చేరాడు. అయితే, అతి తక్కువ మ్యాచుల్లో ఈ మార్క్ను తాకిన భారత పేసర్గా అవతరించాడు. అర్ష్దీప్ 33 మ్యాచుల్లో 50 వికెట్లు తీశాడు. అంతకుముందు బుమ్రా ఈ మైలురాయిని చేరుకొనేందుకు 41 మ్యాచ్లను తీసుకున్నాడు. అయితే, ఓవరాల్గా భారత రెండో బౌలర్గా అర్ష్దీప్ కొనసాగుతున్నాడు. కుల్దీప్ యాదవ్ కేవలం 30 మ్యాచుల్లోనే 50 వికెట్లు తీశాడు.
కెప్టెన్సీ చేపట్టడంపై రుతురాజ్
ఆసియా గేమ్స్లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రను నడిపించిన రుతురాజ్ తొలిసారి భారత జట్టుకు కెప్టెన్సీ చేపట్టనున్నాడు. అయితే మాజీ సారథి ఎంఎస్ ధోనీ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నట్లు గైక్వాడ్ తెలిపాడు. నాయకత్వం గురించి ధోనీ కీలక సూచనలు చేసినట్లు వెల్లడించాడు.
రుతురాజ్ క్లాస్.. రింకు సింగ్ ఊరమాస్.. వీడియోలు అదుర్స్
‘‘కెప్టెన్సీ బాధ్యతలు చాలా క్లిష్టంగా ఉంటాయి. మాహీ భాయ్ ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉంటాడు. ఎప్పుడైనా సరే ఒక్కసారి ఒకే మ్యాచ్ గురించి ఆలోచించాలని సూచించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందనేది చాలా ముఖ్యం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కంగారు పడకూడదు. ప్రతి ఒక్కరూ అంచనాలను పెంచేస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోకూడదు. అందుకే, నేను ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో కాను. నా గురించి ఏం మాట్లాడుకున్నా వినను. ఇదే సీఎస్కే నుంచి నేర్చుకున్న కీలక విషయం. మైదానంలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఒక్కసారి ఇంటికి వచ్చేస్తే స్నేహితులతో కలిసి సేదతీరుతా. నా దృష్టిలో నాయకత్వమంటే మిగతా పది మందిలో ఆత్మవిశ్వాసం నింపి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే’’ అని గైక్వాడ్ తెలిపాడు.
రింకు సుదీర్ఘకాలం ఆడతాడు: కిరణ్ మోరె
భారత యువ బ్యాటర్ రింకు సింగ్ ఐర్లాండ్పై వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. తాను బ్యాటింగ్ చేసిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో రింకుపై భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరె ప్రశంసలు కురిపించాడు. ‘‘టీమ్ఇండియా తరఫున సుదీర్ఘకాలం ఆడే ఆటగాళ్లలో రింకు సింగ్ తప్పక ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆరో స్థానంలో ఆడేందుకు సరిగ్గా సరిపోతాడు. కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన రింకు సింగ్ను జట్టులోకి తీసుకోవడం మేనేజ్మెంట్ మంచి నిర్ణయం’’ అని మోరె వ్యాఖ్యానించాడు.
పాండ్య ఫామ్ ఆందోళనకరం: సంజయ్ మంజ్రేకర్
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో గొప్ప ప్రదర్శన ఇవ్వడంలో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ విఫలమయ్యాడు. జట్టును నడిపించడంలోనూ విమర్శలు ఎదుర్కొన్నాడు. మెగా టోర్నీల్లో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా లోటును తీరుస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే, హార్దిక్ ఫామ్లేమి ఆందోళనకరంగా మారిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ‘‘వరల్డ్ కప్లో హార్దిక్పై చాలా బాధ్యతలు ఉన్నాయి. కేవలం బ్యాటర్గానే కాకుండా ఆల్రౌండర్గా జట్టులో కీలక పాత్ర పోషించాలి. కానీ, హార్దిక్ ఫామ్ కాస్త కలవరానికి గురి చేస్తోంది. కనీసం ఆరేడు ఓవర్లు బౌలింగ్ చేయాలి. భారత్ 2011 వరల్డ్ కప్లో విజయం సాధించడానికి ప్రధాన కారకుల్లో యువీ, సురేశ్ రైనా ఉంటారు. వారు బ్యాటింగ్లో మాత్రమే కాకుండా బౌలింగ్లోనూ వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచారు’’ అని మంజ్రేకర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్