CSK vs GT: ఫైనల్ చేరేదెవరో?
మార్చి 31న గుజరాత్, చెన్నై మ్యాచ్తో ఐపీఎల్- 16 ఆరంభమైంది. ఇప్పుడు మే 23న అదే జట్ల మధ్య పోరుతో ప్లేఆఫ్స్కు తెరలేవనుంది.
నేడే తొలి క్వాలిఫయర్
గుజరాత్తో చెన్నై ఢీ
ఓడిన జట్టుకు మరో ఛాన్స్
రాత్రి 7.30 నుంచి వేదిక చెన్నై
రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్-16లో మరింత వినోదాన్ని అందించే ప్లేఆఫ్స్కు సమయం ఆసన్నమైంది. మంగళవారం తొలి క్వాలిఫయర్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ను నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోన్న టైటాన్స్ రెట్టించిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్లో చెన్నైపై ఆడిన అన్ని మ్యాచ్ల్లోను ఆ జట్టు నెగ్గడం విశేషం. మరోవైపు.. సొంతగడ్డపై ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అని భావిస్తుండడంతో భావోద్వేగ వాతావరణంలో చెన్నై బరిలోకి దిగుతోంది. అతని కోసం టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది సూపర్కింగ్స్. టైటాన్స్ లాగే చెన్నై కూడా బలంగానే ఉంది. మరి సమవుజ్జీల పోరులో గెలిచి ఫైనల్ చేరేదెవరో? ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్ రూపంలో మరో అవకాశముంది.
చెన్నై
మార్చి 31న గుజరాత్, చెన్నై మ్యాచ్తో ఐపీఎల్- 16 ఆరంభమైంది. ఇప్పుడు మే 23న అదే జట్ల మధ్య పోరుతో ప్లేఆఫ్స్కు తెరలేవనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మంగళవారం తొలి క్వాలిఫయర్ పోరాటం హోరాహోరీగా సాగడం ఖాయమని భావిస్తున్నారు. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది కాబట్టి రెండు జట్లు గట్టిగా పోరాడతాయనడంలో సందేహం లేదు. ఫామ్, గణాంకాల పరంగా చూసుకుంటే చెన్నైపై గుజరాత్దే కాస్త పైచేయి. ఇప్పటివరకూ ఐపీఎల్లో చెన్నైతో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ టైటాన్స్ గెలిచింది. నిరుడు రెండు మ్యాచ్ల్లో నెగ్గిన ఆ జట్టు.. ఈ సారి లీగ్ మ్యాచ్లోనూ విజయం సాధించింది. అయితే సొంతగడ్డ చెపాక్లో ఆడుతున్న సీఎస్కేను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం.
ప్లేఆఫ్స్ చేరాయిలా..
అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన జట్టు గుజరాత్ టైటాన్స్. లీగ్ దశలో నిలకడ కొనసాగించి 14 మ్యాచ్ల్లో 10 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 14 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించగా.. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో ఆ జట్టు 17 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తన చివరి మ్యాచ్లో దిల్లీని ఓడించి చెన్నై ప్లేఆఫ్స్ చేరింది. లఖ్నవూ కూడా 17 పాయింట్లతోనే నిలిచినప్పటికీ మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా చెన్నై రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.
పటిష్టంగా టైటాన్స్
నిరుడు ఐపీఎల్లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఈసారీ అదే జోరు కొనసాగిస్తోంది. బలమైన జట్టుతో, తిరుగులేని ప్రదర్శనతో మైదానంలో టైటాన్స్ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారింది. బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకూ హిట్టింగ్ చేసే ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ ఆ జట్టుకు పెద్ద బలం. అతడు వరుసగా రెండు సెంచరీలు బాదేశాడు. 14 మ్యాచ్ల్లో 680 పరుగులు సాధించాడు. గిల్ క్రీజులో నిలబడితే బౌలర్లకు చుక్కలే. విజయ్ శంకర్ కూడా జోరుమీదున్నాడు. సాహా, హార్దిక్, మిల్లర్, తెవాతియా.. ఇలా అందరూ కీలక ఆటగాళ్లే. బౌలింగ్లోనూ ఆ జట్టుకు తిరుగులేదు. పేస్తో చెలరేగుతున్న షమి, స్పిన్తో చుట్టేస్తున్న రషీద్ ఖాన్.. చెరో 24 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ కూడా వైవిధ్యమైన బౌలింగ్తో చివరి ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా ఆకట్టుకుంటున్నాడు.
తిరుగులేని కింగ్స్
12వ సారి ప్లేఆఫ్స్కు చేరి పదో ఫైనల్పై గురిపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్, కాన్వే కీలకం. మంచి ఫామ్లో ఉన్న ఈ ఇద్దరూ మరోసారి శుభారంభాన్నివ్వాలని చెన్నై కోరుకుంటోంది. 14 మ్యాచ్ల్లో కాన్వే 585 పరుగులు చేయగా.. రుతురాజ్ 504 పరుగులు సాధించాడు. రహానె, శివమ్ దూబె ఆ జట్టు బ్యాటింగ్్ ఆర్డర్కు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. జడేజా ఆల్రౌండర్ పాత్రకు తగిన న్యాయం చేస్తూనే ఉన్నాడు. మరోవైపు ధోని అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. తుషార్ దేశ్పాండే, పతిరన లాంటి యువ పేసర్లతో సీఎస్కే బౌలింగ్లో ఉత్తమ ప్రదర్శన చేస్తోంది. తుషార్ 14 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశాడు. 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టిన పతిరన చివరి ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. దీపక్ చాహర్, మొయిన్ అలీ, తీక్షణ కూడా రాణిస్తున్నారు. ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల మధ్య ధోనీని కనీసం మరో రెండు మ్యాచ్ల్లో చూసే అవకాశం అభిమానులకు దక్కింది.
చెపాక్ పిచ్
ఈ సీజన్లో చెపాక్ పిచ్పై చెన్నై ఓ స్పష్టమైన అంచనాకు రాలేకపోతోంది. కొన్ని మ్యాచ్ల్లో నెమ్మదిగా స్పందించిన పిచ్.. మరికొన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్కు అనుకూలించింది. ఈ సారి చెన్నైలో 4 మ్యాచ్లు గెలిచిన సీఎస్కే.. 3 మ్యాచ్లు ఓడింది. మరోవైపు చెపాక్లో గుజరాత్కు ఇదే తొలి మ్యాచ్. మందకొడిగా ఉండే అవకాశమున్న పిచ్ బ్యాటర్లకు సవాలు విసురుతుందని భావిస్తున్నారు. స్పిన్నర్లు సత్తాచాటే ఆస్కారముంది.
3
ఐపీఎల్లో ఇప్పటివరకు చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గుజరాత్ గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్