MotoGP: భారత్‌లో గ్రాండ్‌ మోటోజీపీ.. త్వరలో టికెట్ల విక్రయాలు!

భారత్‌లో మొదటిసారి మోటోజీపీ రేసింగ్‌ జరగనుంది. దీని కోసం టికెట్ల విక్రయాలను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు.

Published : 02 Jun 2023 17:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలిసారి భారత్ వేదికగా జరిగే మోటో జీపీ మోటార్‌సైక్లింగ్‌ రేస్‌ కోసం టికెట్ల విక్రయాలు త్వరలో ప్రారంభమవుతాయని నిర్వాహకులు ప్రకటించారు. ఇండియన్‌గ్రాండ్ ప్రిక్స్ ‘మోటోజీపీ భారత్’ టికెట్ల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. తొలిసారి భారత్‌లో సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్‌ 24వరకు రెండు రోజులపాటు రేస్‌ జరగనుంది. గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్లో రేస్‌లు ఉంటాయి. ఫెయిర్‌స్ట్రీట్‌ స్పోర్ట్స్‌, మోటోజీపీటీఎం సంయుక్తంగా మెగా రేస్‌ను నిర్వహిస్తున్నాయి. మోటోజీపీతో బుక్‌మైషో కలిసి టికెట్లను అభిమానుల కోసం ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఆఫర్లతోపాటు అదనపు ప్రయోజనాలను అందించనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు