WPL: జెమీమా, అలీస్‌ క్యాప్సీ మెరుపులు.. ఆర్సీబీ లక్ష్యం 182

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

Updated : 10 Mar 2024 21:13 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్‌ లానింగ్‌ (29), షఫాలీ వర్మ (23) ఫర్వాలేదనిపించారు. జెమీమా రోడ్రిగ్స్‌ (58; 36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో మెరిసింది. అలీస్‌ క్యాప్సీ (48; 32 బంతుల్లో 8 ఫోర్లు) త్రుటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకుంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంకా పాటిల్ నాలుగు, శోభన ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం. దిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుతుంది. ఆర్సీబీ ఓడితే ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని