మార్చిలో మొబైల్స్ ‘ఉప్పెన’!
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు ఇప్పుడిప్పుడే తగ్గిపోతున్నాయి. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకున్నాయి....
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్నాయి. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకున్నాయి. పలు జాగ్రత్తలు తీసుకుంటూనే జనసంచారం సాగుతోంది. మరి ఇలాంటి సమయంలో వినియోగదారుల కోసం విపణిలోకి స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చేందుకు అన్ని సంస్థలూ పోటీ పడటం సహజమే. కొత్త టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వరుసకట్టి రాబోతున్నాయి. మిడ్ రేంజ్ నుంచి హైఎండ్ ధరల్లో వచ్చే అలాంటి మొబైల్స్ గురించి తెలుసుకుందాం..
వన్ప్లస్ 9 సిరీస్లో...
మరి కొన్ని వారాల్లో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వన్ప్లస్ సమయాత్తమైంది. వన్ప్లస్ 9 సిరీస్ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. వన్ప్లస్ 9, వన్ప్లస్ 9 ప్రొ, వన్ప్లస్ 9 లైట్ వేరియంట్లలో వచ్చేస్తాయని పేర్కొంది. దీనిపై మార్చి తొలి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వన్ప్లస్ 9 సిరీస్ ఫోన్లకు సంబంధించి ఫీచర్ల గురించి పలు వార్తలు వస్తున్నాయి.
స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలు ఇవేనా..
* ప్రాసెసర్: క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 888
* డిస్ప్లే: 6.55 అంగుళాలు
* ర్యామ్: 8 జీబీ/12 జీబీ
* కెమెరా: 48 ఎంపీ ప్రైమరీ/ సెల్ఫీ కెమెరా ఎంతనేది తెలియాల్సి ఉంది
* బ్యాటరీ: 5000 mAh
* ధర: రూ.40,000 (అంచనా)
మార్చి తొలి వారంలో ఫస్ట్ సేల్...
రియల్మీ మరో రెండు రోజుల్లో తన కొత్త మొబైల్కు సంబంధించి ప్రకటన వెలువరించనుంది. నార్జో 30 ప్రో, నార్జో 30A స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్లోకి తక్కువ ధరకే 5G ఫోన్ను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. మార్చి 4న తొలి సేల్ జరపనున్న నార్జో 30 ప్రో స్మార్ట్ఫోన్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో రానుందని సమాచారం. అలానే నార్జో 30 A స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ను వినియోగించినట్లు తెలుస్తోంది.
స్వల్ప వ్యవధిలో విపణిలోకి..
షావోమీ తన ఉత్పత్తులను వెనువెంటనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెడ్మీ K40 సిరీస్తోపాటు 6జీబీ ర్యామ్తో రెడ్మీ 9 పవర్ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 25న నిర్వహించే కార్యక్రమంలో రెడ్మీ K40 సిరీస్ ఫోన్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఫోన్లను అంతర్జాతీయంగా విడుదల చేయాలని షావోమీ భావిస్తోంది. క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 888 లేదా స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ను వినియోగించినట్లు టెక్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రెడ్మీ 9 పవర్ స్మార్ట్ఫోన్ గత డిసెంబర్లోనే భారత మార్కెట్లోకి వచ్చింది. అయితే అదనపు ఫీచర్లతో 6జీబీ ర్యామ్తో రెడ్మీ 9 పవర్ను తీసుకొచ్చేసింది. 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ కెపాసిటీతో రూ.12,999 ధరలో లభిస్తుంది. పోకో M3 మొబైల్కు పోటీగా రెడ్మీ 9 పవర్ (6జీబీ ర్యామ్) స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
రెడ్మీ 9 పవర్ (6జీబీ ర్యామ్) ఫీచర్లు..
* ప్రాసెసర్: క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 662
* డిస్ప్లే: 16.58 సెం.మీ (6.53 అంగుళాలు)
* కెమెరా: 48 ఎంపీ +8 ఎంపీ+ 2 ఎంపీ మాక్రో/8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* బ్యాటరీ: 6000 mAh
* ధర: రూ.12,999
చైనాలో రాబోతోంది.. భారత్లోకి ఎప్పుడో..?
గేమింగ్ ఫోన్లకు ఆసుస్ పెట్టింది పేరు. తన కొత్త మొబైల్ను చైనా మార్కెట్లోకి మార్చి 10న విడుదల చేయనుంది. ఆసుస్ ROG 5 స్మార్ట్ఫోన్ను భారత్లోకి ఎప్పుడు తీసుకురానుందో ఆసుస్ వెల్లడించలేదు. అయితే ఆసుస్కు పోటీగా నుబియా సంస్థ రెడ్ మ్యాజిక్ 6 స్మార్ట్ఫోన్ను అక్కడి మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్స్కు సంబంధించి ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. 6.78 అంగుళాల డిస్ప్లేతో గేమింగ్ ఫోన్ రావొచ్చని టెక్ వర్గాలు పేర్కొన్నాయి. క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీతో పనిచేస్తుందని వెల్లడించాయి. ఆండ్రాయిడ్ 11 వెర్షన్తో 65W ఫాస్ట్ ఛార్జింగ్తో స్మార్ట్ఫోన్ వస్తుందని పేర్కొన్నాయి. 16 GB ర్యామ్తో తీసుకొస్తుందని తెలుస్తోంది. 64 ఎంపీ ప్రైమరీ సెన్సర్, గేమింగ్ కోసం అదనపు బటన్ సౌకర్యం ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి. స్మార్ట్ఫోన్ ధర ఎంత ఉండొచ్చనేది తెలియరాలేదు.
మార్చి 3న వివో స్మార్ట్ఫోన్.. అయితే..
S సిరీస్లో తన కొత్త స్మార్ట్ఫోన్ విడుదల చేసేందుకు వివో సిద్ధమైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1100 SoC ప్రాసెసర్తో మార్చి 3న వివో S9 స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. అలానే మీడియా టెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్తో వివో S9e మొబైల్ను తీసుకురానుందని నిపుణులు తెలిపారు. అయితే వచ్చే నెలలో చైనాలోనే విడుదల కానుండగా.. భారత్లోకి త్వరలో రానుందని వివో పేర్కొంది. తమ మొబైల్ బ్రాండ్ అంబాసిడర్గా జపాన్కు చెందిన ప్రముఖ గాయని లిసాను ఎంపిక చేసుకుంది. 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 1100 చిప్సెట్తో రాబోతున్న తొలి స్మార్ట్ఫోన్గా వివో S9 నిలుస్తోందని టెక్ నిపుణులు పేర్కొన్నారు. ఫోన్ ధర ఎంత ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
వివో S9 స్పెసిఫికషన్స్ ఇవేనా (అంచనా)..
* ప్రాసెసర్: మీడియాటెక్ డెమెన్సిటీ 1100 ఆక్టాకోర్
* రేర్ కెమెరా: 64+8+2 ఎంపీ
* ఫ్రంట్ కెమెరా: 44 ఎంపీ+8 ఎంపీ
* డిస్ప్లే: 16.36 సెం.మీ (6.44 అంగుళాలు)
* ర్యామ్: 8 GB
* బ్యాటరీ: 4000 mAh
* విడుదల: మార్చి 9 (ప్రకటించాల్సి ఉంది)
* ధర: రూ.29,990 (అంచనా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్లా వాడుకుంటే సరి. మ్యాక్లోనైతే- ఫొటో బూత్ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్ను వెబ్క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్టాప్లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్వర్డ్ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్వర్డ్లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్ను అమ్ముతున్నారా?
ప్రింటర్తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్బాట్స్ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి