PM Modi: అవమానకరంగా ఆంధ్రా విభజన
కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం,....
పెప్పర్ స్ప్రేకొట్టి, మైకులు ఆపి చర్చలు లేకుండా చేశారు
అప్పటి స్పర్థలు ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తున్నాయి
అంజయ్యను అవమానించారు.. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు
రాజ్యసభలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వీటన్నింటికీ కాంగ్రెసే కారణమని నిప్పులు చెరిగారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారు. మైకులు బంద్ చేసి, పెప్పర్ స్ప్రే చేసి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్ర విభజన చేశారు. ఇది మంచి పద్ధతా? ఇదేనా ప్రజాస్వామ్యం. వాజపేయీ హయాంలోనూ మూడు రాష్ట్రాలను విభజించి ఛత్తీస్గడ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. వాజపేయీ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి తుపానూ రాలేదు. అందరూ కూర్చొని శాంతియుతంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ విషయంలోనూ అలా జరిగి ఉండొచ్చు. మేం తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కానీ మీ అహంకారం, అధికార మత్తు దేశంలో స్పర్థలను సృష్టించింది. ఆ స్పర్థ ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తోంది. మీక్కూడా ఎలాంటి రాజకీయ ప్రయోజనం దక్కడం లేదు...’’ అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
అంజయ్యకు చేసిన అవమానాన్ని మరిచిపోయారా?
ఇదివరకు రాజీవ్గాంధీ చేతుల్లో ముఖ్యమంత్రి అంజయ్యకు అవమానం జరిగినట్లు ప్రచారంలో ఉన్న సంఘటననూ ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘‘సమాఖ్య వ్యవస్థ గురించి పెద్దపెద్ద ప్రసంగాలు చేసేవారు ఎయిర్పోర్టులో చిన్న విషయం కోసం ముఖ్యమంత్రిని తొలగించడాన్ని మరిచిపోయినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య విషయంలో ఏ జరిగిందో ఈ సభలోని వారందరికీ బాగా తెలుసు. ప్రధానమంత్రి కుమారుడికి ఎయిర్పోర్టులో చెప్పిన స్వాగతం నచ్చకపోవడంతో ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించారు. తద్వారా కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్ను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవమానకరరీతిలో పదవీచ్యుతుడ్ని చేశారు...’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
్య ప్రస్తుతం ఏపీ, తెలంగాణల నుంచి పసుపు ఎగుమతులు పెరగడం తమ ప్రభుత్వ కృషి ఫలితమేనన్నారు. కరోనా సమయంలో ఆయుష్ మంత్రిత్వశాఖ ద్వారా భారతీయ వైద్య పద్ధతులకు ప్రచారం కల్పించడంతో ప్రజల్లో దానిపట్ల ఆసక్తి పెరిగి పసుపు వాడకం పెరిగిందని, దాని వల్ల పసుపు ఎగుమతులు వృద్ధి చెందాయని చెప్పారు.
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచింది ఎవరు?
ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అంశాన్నీ ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘మొదట అవిశ్వాసం కల్పించడం, తర్వాత అస్థిరపరచడం, తర్వాత డిస్మిస్ చేయడం అన్న మూడు సూత్రాల ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించింది. ఫరూక్ అబ్దుల్లా, చౌదరీ దేవీలాల్, చరణ్సింగ్, సర్దార్ బాదల్ ప్రభుత్వాలను ఎవరు అస్థిర పరిచారు? మహారాష్ట్రలో బాల్ఠాక్రేని అవమానించడానికి ఎవరు కుటిల ప్రయత్నాలు చేశారు? కర్ణాటకలో రామకృష్ణహెగ్డే, ఎస్ఆర్ బొమ్మై ప్రభుత్వాలను ఎవరు కూలదోశారు? 50వ దశకంలో కేరళలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టారు? తమిళనాడులో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ప్రభుత్వం, 1980లో ఎంజీఆర్ ప్రభుత్వాలను ఎవరు పతనం చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరు ప్రయత్నించారు? కేంద్ర ప్రభుత్వం మాట వినడం లేదని ములాయంసింగ్ను ఇబ్బంది పెట్టింది ఎవరు?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..