ఇంటింటికీ ఇంటర్నెట్ ఎప్పుడో!
‘డిజిటల్ తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా ఇంటింటికీ ఇంటర్నెట్, వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సౌకర్యం అందించాలన్న ఆశయం నెరవేరడంలేదు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానంతో పాటు కోటి కుటుంబాలకు చౌకధరల్లో బ్రాడ్బ్యాండ్ అందించేందుకు ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఫలాలు ప్రజలకు అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా
వేల గ్రామాల్లో అసంపూర్తిగా టీ-ఫైబర్ పనులు
నానక్రామ్గూడలో పూర్తికాని ఎన్వోసీ
కొన్ని గురుకులాల్లో ప్రాజెక్టును అమలు చేస్తున్నామంటున్న అధికార వర్గాలు
ఈనాడు - హైదరాబాద్
‘డిజిటల్ తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా ఇంటింటికీ ఇంటర్నెట్, వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సౌకర్యం అందించాలన్న ఆశయం నెరవేరడంలేదు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానంతో పాటు కోటి కుటుంబాలకు చౌకధరల్లో బ్రాడ్బ్యాండ్ అందించేందుకు ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఫలాలు ప్రజలకు అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామాల్లో పనులు చేపట్టగా సగం గ్రామాల్లోనూ సాంకేతిక మౌలిక సదుపాయాలు పూర్తికాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఎంత సమయం పట్టనుందో తెలియడంలేదు.
చాలా గ్రామాల్లో కొలిక్కిరాని సాంకేతిక పనులు
ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)కు అనుమతి లభించిన వెంటనే ప్రారంభించినా పనుల్లో ప్రగతి మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తుండటంతో అవి నిదానంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2,243 గ్రామాల్లో పూర్తిస్థాయి డేటా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మరో 3,850 గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ సేవల పరికరాల రక్షణ, భద్రత చర్యలు పూర్తయ్యాయి.
ఇంకా వేలాది గ్రామాల్లో అనుసంధానం కోసం సాంకేతిక పనులు పూర్తికావాల్సి ఉంది. మరో 20 శాతం కేబుల్ నిర్మాణ పనులు పూర్తయితే ‘రింగు కనెక్టివిటీ’ కింద కేబుల్ తెగినప్పటికీ అంతరాయం లేకుండా అనుసంధానత అందించేందుకు వీలవుతుంది. ఈ నెట్వర్క్ను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేందుకు నానక్రామ్గూడలో నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్(ఎన్వోసీ) పనులు పూర్తికావాల్సి ఉంది.
యూనివర్సల్ లైసెన్సు వస్తే...
రాష్ట్రంలో ఇప్పటికే 5 వేలకు పైగా గ్రామాల్లో సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పించాం. అక్కడ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా(పైలెట్ ప్రాజెక్టు కింద) సంక్షేమ గురుకులాలు, గిరిజన పాఠశాలల్లో కొన్నిచోట్ల ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. గ్రామ పంచాయతీలను అనుసంధానం చేయాలన్నా, ఇతరులకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నా కేంద్ర టెలికంశాఖ నుంచి యూనివర్సల్ లైసెన్సు మంజూరు కావాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాం. ఈ నెలాఖరులోగా వస్తుందని భావిస్తున్నాం. అది వచ్చిన వెంటనే విడతల వారీగా గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పిస్తాం. విద్యాలయాలు, ఆసుపత్రులు తదితర విభాగాల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు అవసరమైన సామర్థ్యంతో కూడిన బ్రాడ్బ్యాండ్ అందిస్తాం.
- సుజయ్ కారంపూరి, ఎండీ, టీ-ఫైబర్
లక్ష్యానికి దూరంగా..
బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్టుతో గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలో కీలకమార్పులు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది ప్రభుత్వ భావన. ఇందులో భాగంగా ఇంటింటికీ 20 ఎంబీపీఎస్, విద్యాలయాలకు ఒక జీబీపీఎస్ కనీస వేగం కలిగిన బ్రాడ్బ్యాండ్ సేవలను తక్కువ ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భారత్నెట్లో భాగంగా రాష్ట్రంలో రూ.3,600 కోట్ల ఖర్చుతో టీ-ఫైబర్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ప్రత్యేకంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి, జిల్లాల వారీగా మూడు ప్యాకేజీలుగా పనుల్ని విభజించి ఎల్అండ్టీ, స్టెరిలైట్, టీసీఐఎల్ సంస్థలకు అప్పగించింది. ప్రాజెక్టులో భాగంగా మిషన్ భగీరథ పైపులైన్లతో పాటు కేబుల్ వేయాలని నిర్ణయించినప్పటికీ, కరోనాతో కొన్ని చోట్ల పనులు నెమ్మదించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!