TS News: అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. తెలంగాణ గురుకులాలు మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని అభిప్రాయపడింది. వ్యవసాయం తదితర అనుబంధ రంగాల బలోపేతంతో గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని..పల్లెల్లోని తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని.. దీంతో గ్రామాల్లో
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు చట్టం
విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం
రూ.7,289 కోట్లతో ‘మన ఊరు - మన బడి’
రాష్ట్రంలో కొత్తగా మహిళా, అటవీ విశ్వవిద్యాలయాలు
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. తెలంగాణ గురుకులాలు మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని అభిప్రాయపడింది. వ్యవసాయం తదితర అనుబంధ రంగాల బలోపేతంతో గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని..పల్లెల్లోని తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని.. దీంతో గ్రామాల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధనకు డిమాండు పెరిగిందని చర్చించింది. సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య అనివార్యమని సమావేశం అభిప్రాయపడింది. అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని విద్యాశాఖను ఆదేశించింది. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రుసుముల నియంత్రణకు చట్టాన్ని తెచ్చేందుకూ ఆమోదం తెలిపింది. ముసాయిదా చట్ట రూపకల్పన అనంతరం రానున్న శాసనసభా సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లులకు చట్టబద్ధత కల్పిస్తుంది. ఆంగ్లమాధ్యమ బోధన, రుసుముల నియంత్రణపై పూర్తి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించేందుకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావులు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘‘మన ఊరు - మన బడి’’ కార్యక్రమం చేపట్టేందుకు అనుమతించింది. రాష్ట్రంలో కొత్తగా మహిళా, అటవీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. హైదరాబాద్ కోఠిలోని మహిళా కళాశాల స్థలంలో, సిద్దిపేట జిల్లా ములుగులో వీటి ఏర్పాటుకు ఉన్నత విద్యాశాఖ, అటవీ శాఖలు ప్రతిపాదనలు సమర్పించగా ఆమోదం తెలిపింది. వీటిపై వచ్చే మంత్రిమండలి సమావేశం నాటికి సమగ్ర నివేదికను రూపొందించి మంత్రిమండలికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించింది.
ఇదీ మన ఊరు - మన బడి ప్రణాళిక
మూడు దశల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని సమావేశంలో మాట్లాడారు. మొదటి దశలో, మండలం కేంద్రాన్ని యూనిట్గా తీసుకొని అత్యధికంగా విద్యార్థులు నమోదైన 9,123 (ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత) ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు చెందిన స్కూళ్లలో ముందుగా కార్యక్రమం అమలు చేయాలి. నీటి సౌకర్యంతో కూడిన సౌచాలయాలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా.. ఫర్నిచర్, పాఠశాలకు రంగులు, మరమ్మతులు, చాక్బోర్డులు, ప్రహరీలు, వంటగది షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మించాలి. ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో చేపట్టే కార్యక్రమాలకు పరిపాలనా అనుమతిని జిల్లా కలెక్టర్లు ఇస్తారు. ఒక మండలంలో కార్యక్రమాన్ని అమలుచేసే ఏజెన్సీ ఒకటే ఉండే విధంగా అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి తమ జిల్లాలో అమలు చేసే ఏజెన్సీని ఎంచుకోవచ్చు. నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి. దాతలు, సీఎస్ఆర్ నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.
అటవీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ) బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివిన విద్యార్థులకు అటవీ శాఖ ద్వారా ఉద్యోగాల భర్తీలో నేరుగా నియామక (డైరెక్ట్ రిక్రూట్మెంట్) కోటా కింద రిజర్వేషన్లు కల్పనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్’ (ఏసీఎఫ్) విభాగంలోని ఉద్యోగాల్లో 25%, ‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్’ (ఎఫ్ఆర్వో) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50%, ‘‘ఫారెస్టర్స్’’ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అటవీశాఖ సేవా నిబంధనలు-1997, స్టేట్ అటవీ సబార్డినేట్ నిబంధనలు-2000లో సవరణలు చేస్తారు.
కరోనాపై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మంత్రిమండలి సమావేశంలో తెలిపారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ టీకాల కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని, టీకాలపై ప్రజలను చైతన్యపరచాలన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా సమావేశంలో వివరించారు.
ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి
అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా అమ్మకానికి వస్తున్నందున...ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనాలని అధికారులను సీఎం
ఆదేశించారు.
రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడే వద్దు!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ అవసరం లేదని వైద్యఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కు తగ్గినట్టు సమాచారం. మరిన్ని కేసులు పెరిగితేనే అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో తొలుత ఈ అంశం చర్చకు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!