PM Modi: అమ్మభాష స్వాభిమాన సంకేతం
మన జీవితాన్ని అమ్మ ఎలా తీర్చిదిద్దుతుందో మాతృభాష కూడా అలాగే ఓ రూపునిస్తుంది. మాతృమూర్తి, మాతృభాష రెండూ కలిసి మన జీవిత పునాదులను బలోపేతం చేసి చిరంజీవులను చేస్తాయి. అమ్మను ఎలా వదిలిపెట్టలేమో.. మాతృభాషనూ అలాగే కాపాడుకోవాలి.
మాతృభాష గురించి చెప్పుకోడానికి సంకోచమేల!
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు
మన్కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
మన జీవితాన్ని అమ్మ ఎలా తీర్చిదిద్దుతుందో మాతృభాష కూడా అలాగే ఓ రూపునిస్తుంది. మాతృమూర్తి, మాతృభాష రెండూ కలిసి మన జీవిత పునాదులను బలోపేతం చేసి చిరంజీవులను చేస్తాయి. అమ్మను ఎలా వదిలిపెట్టలేమో.. మాతృభాషనూ అలాగే కాపాడుకోవాలి.
- మోదీ
ఈనాడు, దిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా మన దేశంలో ఇప్పటికీ కొందరు సొంత భాష, వస్త్రధారణ, అన్నపానీయాల గురించి చెప్పుకోడానికి సంకోచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది స్వాభిమానానికి సంబంధించిన అంశమని అన్నారు. ఆదివారం ఉదయం ‘మన్కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధాని మాట్లాడుతూ మాతృభాష ప్రాధాన్యం వివరించారు. యువత విభిన్న భాషల్లోని ప్రఖ్యాత గీతాలతో వీడియోలు చేయాలని పిలుపునిచ్చారు. ‘‘భారత్లో అత్యంత పురాతన భాష తమిళం. ప్రపంచంలో ఇంత ఘనమైన వారసత్వం మనకు ఉన్నందుకు గర్వించాలి. పురాతన ధర్మశాస్త్రాల గురించి మన సంస్కృత భాషలోనే అభివ్యక్తీకరించారు. 2019లో ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీ మూడోస్థానంలో నిలిచింది. దీన్ని ప్రతి భారతీయుడూ గర్వంగా భావించాలి. భాషంటే అభివ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే కాదు, అది సమాజ సంస్కృతి, వారసత్వాల సంరక్షణకు దోహదం చేస్తుంది. జాతీయ విద్యావిధానంలోనూ స్థానిక భాషలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ప్రధాని తెలిపారు.
శభాష్ విశాఖపట్నం
ప్రధాని మోదీ తన ప్రసంగంలో విశాఖపట్నంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద జరుగుతున్న పనుల గురించి కూడా వివరించారు. అక్కడ పాలిథిన్కు బదులు నూలుసంచులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. పర్యావరణ ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్కు వ్యతిరేకంగా విశాఖవాసులు ప్రచారం కూడా మొదలుపెట్టారని అభినందించారు.
అమెరికాలో తెలుగువెలుగు
‘‘నాకు కొన్నేళ్ల కిందటి ఓ సంఘటన గుర్తుకువస్తోంది. అమెరికా వెళ్లినప్పుడు విభిన్న కుటుంబాలను కలిసే అవకాశం దక్కేది. అందులో భాగంగా ఒకసారి ఓ తెలుగు కుటుంబం ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఒక సంతోషకరమైన దృశ్యం కనిపించింది. కుటుంబసభ్యులంతా స్థానికంగా ఉన్నపుడు ఎంత పనున్నా అందరూ కలిసి ఒకేచోట కూర్చొని రాత్రిభోజనం చేయాలని, ఆ సమయంలో అందరూ కచ్చితంగా తెలుగే మాట్లాడాలని వారి నియమం. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడటం చూసి నేనెంతో ప్రభావితమయ్యా.’’
భారత్లో 121 మాతృభాషలు
‘‘భాషల విషయంలో భారత్కున్న సుసంపన్నతను కొలవడం అసాధ్యం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి.. కచ్ నుంచి కోహిమా వరకు వందల భాషలు, వేల యాసలున్నాయి. ఒకదానికొకటి భిన్నమైనా అన్నీ మమేకమై మనుగడ సాగిస్తున్నాయి. భాషలు ఎన్నున్నా భావం ఒక్కటే. భారతీయులు దాదాపు 121 మాతృభాషలతో మమేకమై ఉన్నారు. యూరోపియన్ దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువమంది మన దేశంలోని 14 భాషలతో అనుసంధానమై ఉన్నారు.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?