కాబుల్లో ఉగ్ర ఘాతుకం
అందరూ భయపడినట్టే జరిగింది! తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో కనీసం 72 మంది దుర్మరణం చెందారు. చనిపోయినవారిలో తమ మెరీన్ కమాండోలు 11 మంది,
కాబుల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్లు
72 మంది దుర్మరణం... 143 మందికి గాయాలు
మృతుల్లో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనే..!
పేలుళ్లను ఖండించిన భారత్
కాబుల్: అందరూ భయపడినట్టే జరిగింది! తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో కనీసం 72 మంది దుర్మరణం చెందారు. చనిపోయినవారిలో తమ మెరీన్ కమాండోలు 11 మంది, ఒక నేవీ వైద్యుడు ఉన్నట్టు అమెరికా తెలిపింది. ఇది కచ్చితంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని పెంటగాన్ వెల్లడించింది. రష్యా విదేశాంగ శాఖ కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. ఈ దాడుల్లో 143 మంది తీవ్రంగా గాయపడినట్టు అఫ్గాన్, అమెరికా అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లోనూ అమెరికా సైనిక సిబ్బంది 12 మంది ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. పేలుళ్ల తీవ్రతకు కొందరి శరీరాలు తునాతునకలయ్యాయి. గాయపడినవారు రక్తమోడుతూ లేవలేని స్థితిలో హాహాకారాలు చేస్తూ కనిపించారు.కాబుల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడబోతున్నారని.. పేలుళ్లు చోటుచేసుకోవడానికి కొద్ది గంటల ముందే బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలు హెచ్చరించాయి. అఫ్గాన్ నుంచి బయటపడేందుకు విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో వేచిచూస్తున్న వారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని, వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అప్రమత్తం చేశాయి. అంతలోనే ముష్కరులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దాడులను తాలిబన్ ఖండించడం విశేషం!
తాలిబన్ల దురాక్రమణ క్రమంలో అఫ్గాన్ను వీడేందుకు అమెరికా, మిత్రదేశాల పౌరులు, గతంలో విదేశీ బలగాలకు సహకరించిన అఫ్గాన్లు కొద్దిరోజులుగా కాబుల్ విమానాశ్రయానికి వేల సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈనెల 31న, అఫ్గాన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకునే చివరిరోజు నాటికి ఎలాగైనా దేశం విడిచి వెళ్లిపోవాలని... లేకుంటే తాలిబన్లు తమను లక్ష్యంగా చేసుకుంటారన్న తీవ్ర ఆత్రుత, ఆందోళనలో వారుండగానే... ఉగ్రవాదులు చెలరేగిపోయారు. విమానాశ్రయం వెలుపల, అబే గేటు లోంచి లోనికి వెళ్లేందుకు జనం భారీగా గుమిగూడిన చోట ఒక పేలుడు సంభవించింది. కాసేపటికే అక్కడికి సమీపంలోని బేరన్ హోటల్ వద్ద మరో పేలుడు చోటుచేసుకుంది. ఈ రెండు చోట్ల ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు సభ్యులు పేలుళ్లకు పాల్పడినట్టు అమెరికా రక్షణశాఖ కార్యాలయ ప్రతినిధి జాన్ కిర్బి వెల్లడించారు.
ముందే ‘అత్యంత విశ్వసనీయ’ హెచ్చరికలు
కాబుల్లో ఉగ్రదాడులు జరగబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందినట్టు అమెరికా నిఘా అధికారులు అధ్యక్షుడు బైడెన్కు చెప్పినట్టు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అఫ్గాన్ నుంచి అమెరికా పౌరులతో పాటు మిత్రదేశాల వారిని తరలిస్తామని, అయితే రక్తపాతం జరగకుండా అది సాధ్యంకాదని బైడెన్ కొద్దిరోజుల కిందటే వెల్లడించారు. విమానాశ్రయం వద్ద భారీ దాడులు జరుగుతాయని, ఇందుకు సంబంధించి అత్యంత విశ్వసనీయ సమాచారం అందిందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బెల్జియం నేతలు హెచ్చరించారు.
ముందు అభయం... తర్వాత ఖండన...
అయితే, ఈ హెచ్చరికలను తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కొట్టిపారేశాడు. అలాంటిదేమీ జరగదని చెప్పుకొచ్చాడు. అఫ్గాన్ నుంచి తరలింపు ప్రక్రియ ముగిసేంతవరకూ ఎలాంటి దాడి జరగబోదని తాలిబన్ నేతలు అభయమిచ్చారు. ఈనెల 31 నాటికి ఆ పని పూర్తికావాలని షరతు పెట్టారు. కానీ, గడువు ఇంకా ముగియకముందే ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పేలుళ్లను జుబిహుల్లా ఖండించాడు.
హెచ్చరిక సందేశాలు వచ్చాయి... అంతలోనే...
విమానాశ్రయం వద్ద అఫ్గాన్కు చెందిన నదియా సదాత్(27) మాట్లాడుతూ... ‘‘నా భర్త నాటో దళాలతో కలిసి పనిచేశారు. తాలిబన్లకు లక్ష్యంగా మారతామన్న భయంతో మా రెండేళ్ల పాపను తీసుకుని విమానాశ్రయానికి వచ్చాం. దాడి జరగడానికి కొద్దిసేపటి ముందే మా ఫోన్కి అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ నుంచి మిస్డ్కాల్ వచ్చింది. గుర్తుతెలియని నంబరు నుంచి హెచ్చరిక సందేశాలూ వచ్చాయి. జనాన్ని తోసుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే పేలుడు సంభవించింది’’ అని ఆమె పేర్కొన్నారు. తాలిబన్ల దురాక్రమణ క్రమంలో జైళ్ల నుంచి పలువురు ఉగ్రవాదులు విడుదలయ్యారు. వీరిలో ఐసిస్కు అనుబంధంగా ఉన్న అఫ్గాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కూడా ఉండొచ్చని... అఫ్గాన్ సైన్యం విడిచివెళ్లిన ఆయుధాలు వీరికి చిక్కి ఉంటాయని భావిస్తున్నారు.
ఖండించిన నాటో, ఐరాస
కాబుల్ పేలుళ్లను నాటో చీఫ్ జెన్స్ స్టోటెన్బర్గ్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్లు ఖండించారు. దాడి క్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ స్పందించారు. ‘‘అఫ్గాన్లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. అమెరికా, మిత్రదేశాలతో కలిసి కాబుల్ విమానాశ్రయంలో తరలింపునకు సిద్ధంగా ఉన్న మా పౌరులను, అఫ్గాన్లను సురక్షితంగా తరలించేందుకు కృషి చేస్తాం’’అన్నారు.
రద్దీ.. ఉద్రిక్తత.. బాష్పవాయు గోళాల ప్రయోగం..
అఫ్గాన్ను వీడేందుకు వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరగడంతో గురువారం ఉదయం కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్నడూ చూడనంత రద్దీ నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా బలగాలు జనంపై బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి.
భారత్ ఖండన
కాబుల్లో ఉగ్రదాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఉగ్రవాదంపై ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా పేలుళ్లు చాటు తున్నాయని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
ఓయూలో నీటి కొరత.. విద్యుత్తు కోతలు!
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్ వార్డెన్ కొమరెల్లి శ్రీనివాస్ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఉత్తర్వును ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. -
తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
భానుడు.. భీకరం
రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. -
రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత
‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. -
కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు
రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
‘టెయిల్పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద