భానుడు.. భీకరం
రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది.
నల్గొండ, ములుగు జిల్లాల్లో 45 డిగ్రీల నమోదు
వడదెబ్బతో అయిదుగురు, పిడుగుపాటుకు ఒకరు మృతి
వచ్చే నాలుగు రోజులు వడగాలులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. ఈ జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని సూచించింది. సోమవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 45.1, నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం తిమ్మాపురంలో 45.1, మాడుగులపల్లిలో 45, త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 44.9 డిగ్రీల ఎండ కాసింది. ఖమ్మం, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లో 44.9, నిజామాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో 44.5 నుంచి 44.8 డిగ్రీల మధ్య నమోదైంది. నల్గొండ జిల్లా త్రిపురారం, దామరచెర్ల, మాడుగులపల్లి మండలాల్లో వడగాలులు వీచాయి.
ఆరుగురు మృత్యువాత..
ఏటూరునాగారం, బెజ్జూరు, కాగజ్నగర్, పెద్దఅడిశర్లపల్లి, ఏటూరునాగారం, న్యూస్టుడే: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బూటారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోనే ఉంటూ టీచర్గా కొనసాగుతున్న రామగిరి ప్రేమలీల(70) ఆదివారం ఎండ వేడికి అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం కేంద్రానికి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా పలకకపోవడంతో.. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా మృతిచెంది కనిపించారు. కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఎండదెబ్బకు గురైన చౌధరి రవి(23)ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. కాగజ్నగర్ రైల్వేస్టేషన్లోని రెండో ప్లాట్ఫాంపై గుర్తుతెలియని వృద్ధుడు వడదెబ్బతో మృతిచెందినట్లు ఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ సురేష్గౌడ్ తెలిపారు. శంషాబాద్లో భిక్షాటన చేస్తూ జీవించే 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి ఎండకు తాళలేక మృత్యువాతపడ్డారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురానికి చెందిన మాచర్ల రాజశేఖర్, భార్గవి దంపతుల కుమారుడు కౌషిక్(12) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అంబులెన్సులో దేవరకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎక్కెల గ్రామానికి చెందిన దుబ్బ ఉపేందర్(26) స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబోశారు. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో గాలులు వీస్తుండటంతో వడ్లపై పరదా కప్పేందుకు మరో రైతు రమేశ్తో కలిసి వెళ్లారు. ఒక్కసారిగా వారి సమీపంలో పిడుగుపడటంతో ఇద్దరూ స్పృహ కోల్పోయారు. అక్కడున్న వారు వెంటనే సామాజిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఉపేందర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమేశ్ కొద్దిసేపటికి తేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు
రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. -
మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్ ఆవిష్కరించారు. -
8న చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బత్తిని అమర్నాథ్గౌడ్ మాట్లాడుతూ.. 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. -
తడిసిన ప్రతి గింజనూ కొంటాం
వర్షానికి తడిసిన, మొలకెత్తిన ప్రతి వడ్ల గింజనూ కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. -
మళ్లీ ఊపందుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్రావు, రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, శ్రవణ్రావు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. -
బోనస్తో రూ.2 వేల కోట్ల భారం
వచ్చే పంట సీజన్ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్ ఇచ్చి కొంటే.. ఒక్కో సీజన్కు రూ.2 వేల కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. -
తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది. -
ఈసెట్లో 95.86% ఉత్తీర్ణత
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈసెట్లో 95.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11 బ్రాంచీల్లో ప్రవేశాలకు 23,330 మంది ఈసెట్ రాశారు. -
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి. -
భారీగా పెరిగిన విత్తన పసుపు ధర
రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా పసుపు సాగవుతుంది. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ పంటకు కొన్నేళ్లుగా ఆశించిన ధర రాలేదు. -
విత్తనాలకు రైతుల కుస్తీ
విత్తనాల కోసం రైతులు కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ ఉన్న పత్తి విత్తన రకాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ఎదుట బారులు తీరి నిల్చున్నారు. -
ఇతర రాష్ట్రాల బార్ సభ్యులనూ అనుమతించాలన్న పిటిషన్లో నోటీసులు
తెలంగాణ పరిధిలో సివిల్ జడ్జి పోస్టులకు ఇతర రాష్ట్రాల బార్ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీ బార్ కౌన్సిల్ సభ్యుడైన వి.రాకేష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషికేశ్రాయ్, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రల ధర్మాసనం ఇటీవల విచారించింది. -
ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదే
కోర్టు తీర్పులతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. హక్కుల ఉల్లంఘన జరిగినందున పరిహారం ప్రకటించే విచక్షణాధికారం కోర్టుకు ఉందని పేర్కొంది. -
వర్సిటీలు.. అవినీతికి చిరునామాలు
సమాజానికి దిక్సూచిగా మారాల్సిన విశ్వవిద్యాలయాలు అక్రమాలు, అవినీతికి నిలయాలుగా మారాయి. ఆదర్శంగా ఉండాల్సిన ఉపకులపతు(వీసీ)లు కొందరు అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా జూన్ 3 వరకు పొడిగించారు. -
రెవెన్యూ శాఖలో డీటీల పదోన్నతులకు కమిటీ
రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీని (డీపీసీ) ఏర్పాటు చేస్తూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. -
క్రష్ కేంద్రాలపై శిశు సంక్షేమ అధికారుల అధ్యయనం
రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు.. సంరక్షణతో పాటు పూర్వప్రాథమిక విద్యను అందించడం, పౌష్టికాహారం, మానసిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాలను క్రష్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. -
జూన్ మొదటి వారానికి గురుకుల ఐదోతరగతి ప్రవేశాలు పూర్తి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్ తొలివారానికి పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
యాదాద్రిలో నృసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో ఉత్సవాలకు పూజారులు, యాజ్ఞికులు శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి
-
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు