నీరుగప్పిన నిర్లక్ష్యం
శ్రీశైలం.. కృష్ణా నదిపై ప్రధాన ప్రాజెక్టు. రెండు తెలుగు రాష్ట్రాలకూ చాలా కీలకమైనది. కాలక్రమేణా వరద ప్రవాహానికి ఇది దెబ్బతింటోంది. స్పిల్వే గేట్ల నుంచి విడుదల చేసినపుడు నీరు కిందికి దుమికి ఎగిరి పడేచోట (ప్లంజ్పూల్) 40 మీటర్ల
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులను పట్టించుకోని అధికారులు
నిపుణుల కమిటీల నివేదికలన్నీ కాగితాల్లోనే భద్రం
తాము తీసుకున్నాక ఎలా అని కృష్ణాబోర్డు తర్జనభర్జన
ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం
వరద ఉద్ధృతి సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు
ఈనాడు హైదరాబాద్: శ్రీశైలం.. కృష్ణా నదిపై ప్రధాన ప్రాజెక్టు. రెండు తెలుగు రాష్ట్రాలకూ చాలా కీలకమైనది. కాలక్రమేణా వరద ప్రవాహానికి ఇది దెబ్బతింటోంది. స్పిల్వే గేట్ల నుంచి విడుదల చేసినపుడు నీరు కిందికి దుమికి ఎగిరి పడేచోట (ప్లంజ్పూల్) 40 మీటర్ల లోతు గుంత పడింది. దీనిని కాంక్రీటుతో పూడ్చాలి. దీంతోపాటు మరిన్ని పనులు తక్షణం చేయాల్సిన అవసరం ఉందని డిజైన్స్ నిపుణుల కమిటీ సిఫార్సు చేసి ఏడాదిన్నర దాటింది. రూ. 722 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనా వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అతీగతీ లేదు. డ్యాం భద్రతతో సహా మరిన్ని అంశాలపై పుణెలోని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చి (సీడబ్ల్యూపీఆర్ఎస్) సంస్థతో అధ్యయనం చేయించాలి. ఇలాంటివన్నీ పెండింగ్లో ఉన్నాయి. ప్రాజెక్టులను తమ అధీనంలోకి తెచ్చుకొనే ప్రక్రియలో కృష్ణా బోర్డు అధికారులు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. డ్యాం భద్రతపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, సిఫార్సుల అమలు జరగకపోవడంతో ప్రస్తుత వాస్తవ పరిస్థితిని రికార్డు చేసినట్లు తెలిసింది.
నేపథ్యం ఇదీ..
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి డిజైన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒకసారి 19 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అంచనా వేశారు. స్పిల్వే నుంచి 13.2 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేలా 12 గేట్లను అమర్చారు. 2006లో కేంద్ర జలసంఘం సూచన మేరకు గరిష్ఠ వరద ప్రవాహంపై అధ్యయనం చేయగా, 26.5 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తేలింది. 2009లోనే 25.5 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ఈ సమయంలో స్పిల్వే నుంచి 14 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని వదిలారు. దీంతో నీరు కిందకు వచ్చి ఎగిసి పడేచోట పెద్ద గుంత పడింది. అంతకుముందు పడిన చిన్న గుంతను కాంక్రీటుతో పూడ్చివేయగా, అది కూడా లేచిపోయింది. సుమారు 40 మీటర్ల లోతు గుంత పడటం.. అది ఎప్పటికప్పుడు విస్తరించే అవకాశం ఉండటంతో అధ్యయనం చేయించారు. ప్రస్తుతానికి డ్యాం పునాదుల వైపు రాకపోయినా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చన్న ఆందోళన ఇంజినీర్లలో ఉంది. ఆరు నుంచి ఎనిమిదో గేటు వరకు, 10 నుంచి 16వ సిలిండర్ల వరకు ఎక్కువ నష్టం జరిగినట్లు గుర్తించారు.
అతీగతీ లేని సిఫార్సులు
శ్రీశైలం డ్యాం భద్రతపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2017లో నివేదిక ఇచ్చింది. ప్లంజ్పూల్ ప్రాంతంలో బాతీమెట్రిక్ సర్వే, నీటి లోపల సిలిండర్లు, ఆప్రాన్ గురించి తెలుసుకొనేందుకు వీడియోగ్రఫీ, గేట్ల నిర్వహణలో మార్పులు, పూడికపై అధ్యయనం, వచ్చే వరదను తట్టుకొనేందుకు ముందుగానే నీటిని ఖాళీ చేయడం, అదనపు స్పిల్వే ఏర్పాటు మొదలైన సిఫార్సులు చేశారు. వాటిలో కొన్నే అమలయ్యాయి. వరద నీటిని పక్కనున్న కుందూ నదికి మళ్లించడం, డ్యాంను పటిష్ఠం చేయడం, ఎత్తు పెంచడం ఇలా అనేక అంశాలపై చర్చ జరగడం తప్ప ఏదీ ముందుకెళ్లలేదు. డ్యాంకు ఎడమవైపు పైభాగంలో ఐదో కిలోమీటరు వద్ద అదనపు స్పిల్వే ఏర్పాటుకు అనువైన ప్రాంతంపైనా చర్చ జరిగింది కానీ కార్యాచరణ జరగలేదు. మళ్లీ పాండ్యా ఛైర్మన్గా కొత్త కమిటీ వేశారు. ఈ కమిటీ 2020 మార్చిలో నివేదిక ఇచ్చింది. 12, 13, 14వ బ్లాకుల వద్ద డ్యాం భద్రతపై అధ్యయనం చేయించడం, ప్లంజ్పూల్లో పడిన గుంత విస్తరించకుండా చర్య తీసుకోవడం సహా 15 సిఫార్సులు చేసింది. ఈ పనులన్నీ చేయడానికి సంబంధిత ఇంజినీర్లు అంచనా తయారు చేయడం తప్ప పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. ఇప్పుడు కృష్ణా బోర్డు ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!