ఘంటసాల గొప్ప ఉద్యమకారుడు కూడా...
ఘంటసాల భౌతికంగా మనల్ని విడిచి వెళ్లి యాభై ఏళ్లు కావస్తున్నా.. తెలుగువారిని, తెలుగు నేలను పాటల రూపంలో ప్రతిక్షణం పలకరిస్తూనే ఉన్నారని సుప్రీంకోర్టు ప్రధాన
ఆయన స్వాతంత్య్ర సమరయోధులనూ ఉత్తేజితం చేశారు
మహా గాయకుడి సంస్మరణార్థం దిల్లీలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
పి.సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తున్న సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ. చిత్రంలో డా.వి.గీత, చోడవరం ఎంఎల్ఏ
కరణం ధర్మశ్రీ, మంత్రి శ్రీనివాసగౌడ్, మండలి బుద్ధప్రసాద్, సంజయ్ కిషోర్,
మురళీమోహన్, ఆర్.నారాయణ మూర్తి తదితరులు
రవీంద్రభార[తి, న్యూస్టుడే: ఘంటసాల భౌతికంగా మనల్ని విడిచి వెళ్లి యాభై ఏళ్లు కావస్తున్నా.. తెలుగువారిని, తెలుగు నేలను పాటల రూపంలో ప్రతిక్షణం పలకరిస్తూనే ఉన్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ‘సంగమం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకల ప్రారంభోత్సవ సభ శనివారం రాత్రి రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గానకోకిల పి.సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగిస్తూ ‘‘స్వాతంత్రోద్యమంలో 18 నెలల పాటు జైలులో ఉండి తోటి సమరయోధులను ఘంటసాల తన పాటల ద్వారా చైతన్యవంతం చేశారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో ‘తెలుగువీర లేవరా..’ పాటవింటే ఎంతో ఉత్తేజం కలుగుతుంది. ఆయన పాటల మాంత్రికుడే కాదు, గొప్ప ఉద్యమకారుడు కూడా’’అని కీర్తించారు. జీవించినంత కాలం పాడాలని.. పాడినంత కాలం జీవించాలని చెప్పినట్లుగానే ఘంటసాల తన జీవితాన్ని ముగించారని అన్నారు. దిల్లీలో ఘంటసాల సంస్మరణార్థం తన ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తానని జస్టిస్ రమణ ప్రకటించారు.
అలనాటి, నేటి సినిమాలను పోల్చి చూసుకోవాలి...
తొలినాళ్లలో సినిమారంగం వివిధ సామాజిక అంశాలపై చర్చించి ప్రజల్లో చైతన్యానికి దోహదపడింది. ఇప్పుడా విలువలు కనిపించడం లేదు. అలనాటి, నేటి సినిమాలను పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ‘పరాయిభాష నేర్చుకుంటే గొప్పవాళ్లమవుతామనే తపనలో మన భాషా సంస్కృతులు దిగజార్చేలా ప్రవర్తిస్తున్నామా.. అనిపిస్తోంది. ఆంగ్లభాష నేర్చుకుంటేనే గొప్పవాళ్లు అవుతారనే అపోహల్ని సృష్టిస్తున్నారు. నేను డిగ్రీ వరకు తెలుగులోనే చదువుకున్నాను. న్యాయవిద్యలో చేరాకే ఆంగ్లం నేర్చుకున్నా. అయినా దిల్లీ వరకు వెళ్లగలిగాన’ని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు నేర్పించి, వారితో మంచి పుస్తకాలు చదివించాలని సూచించారు. ‘ఓం నమో వెంకటేశా, ఓం నమో తిరుమలేశా..’ అంటూ ఘంటసాల పాడిన ప్రార్థనా గీతంతో జస్టిస్ రమణ తన ప్రసంగాన్ని ముగించారు.అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఘంటసాల శతజయంత్యుత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఏపీలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం సైతం ఉంటుందని అన్నారు. సంగమం నిర్వాహకులు సంజయ్కిశోర్ స్వాగతం పలికారు. సభలో శాంతా బయోటెక్ అధినేత కె.ఐ.వరప్రసాదరెడ్డి, సినీ దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్.నారాయణమూర్తి, నటి మంజుభార్గవి, వివేకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ వి.గీత కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (97), ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్, ‘మన ఘంటసాల’ పుస్తక రచయిత డా.పి.ఎస్.గోపాలకృష్ణను సత్కరించారు. అంతకుముందు సంగీత గురువులు శశికళాస్వామి, జయశ్రీ వంద మంది బాలికలతో సమర్పించిన ఘంటసాల పాటల చరణాల విభావరి మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమానికి ముందు రవీంద్ర భారతి ప్రాంగణంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..