ఉభయ సభల నుంచి తెరాస వాకౌట్
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై లోక్సభ, రాజ్యసభల్లో తెరాస ఎంపీల నిరసన కొనసాగింది. వారు నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రశ్నోత్తరాల సమయం యథావిధిగా నడిచింది. ధాన్యం సేకరణ చేపట్టాలని, కనీస
నోటీసులపై కేంద్రం స్పందించక పోవడంతో నిర్ణయం
నేడు నల్ల చొక్కాలతో పార్లమెంటులో నిరసన
ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్న నామా
అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న తెరాస పార్లమెంటరీ, లోక్సభ పక్ష నేతలు కేశవరావు,
నామా నాగేశ్వరరావు, ఎంపీలు వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, లింగయ్య యాదవ్, పసునూరి
దయాకర్, రంజిత్రెడ్డి, రాములు, మాలోత్ కవిత, బి.బి.పాటిల్, సురేశ్రెడ్డి
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై లోక్సభ, రాజ్యసభల్లో తెరాస ఎంపీల నిరసన కొనసాగింది. వారు నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రశ్నోత్తరాల సమయం యథావిధిగా నడిచింది. ధాన్యం సేకరణ చేపట్టాలని, కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలంటూ ఉభయ సభల్లో సోమవారం కూడా తెరాస సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ లోక్సభలో లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్వల్పకాలిక చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన సభ్యులు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘అంబేడ్కర్ వర్ధంతి రోజునే పార్లమెంట్ సాక్షిగా భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ అబద్ధాలు చెప్పారు. లోక్సభలో అర్వింద్ చేసిన వ్యాఖ్యలు యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. రైతుల కోసం పోరాడుతున్న తమపై చట్టసభల్లో ఆరోపణలు చేయడం అర్థ రహితం. కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమని చెప్పిన తర్వాతే వరి పంట వేయొద్దని రైతులకు చెబుతున్నాం. భాజపా నేతలు మాత్రం వరి సాగుచేయమంటున్నారు. రైతులు వరి సాగుచేసి ఇబ్బందులు పడితే దాన్ని రాజకీయం చేయాలని భాజపా నేతలు చూస్తున్నారు’’ అని నామా మండిపడ్డారు. ఎఫ్సీఐ రాష్ట్ర రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర రైతుల సమస్యను వివరించేందుకు ప్రయత్నించే తమకు మైక్ ఇవ్వడం లేదని, తమపై ఆరోపణలు చేసేందుకు భాజపా సభ్యులకు మైక్ ఇస్తున్నారని ఆక్షేపించారు.
క్షేత్రస్థాయికి వెళ్లేందుకు వ్యూహం!
పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో మంగళవారం నల్ల చొక్కాలు ధరించి సభలకు హాజరుకావాలని తెరాస సభ్యులు నిర్ణయించారు. మంగళవారం ఉభయ సభల్లో మాట్లాడేందుకుగానీ, చర్చకుగానీ అవకాశం కల్పించకపోతే శీతాకాల సమావేశాలను బహిష్కరించాలని తెరాస సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయికి వెళ్లి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రైతులకు వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!