లెక్కలూ లేవు... పత్రాలూ లేవు!
కోట్ల రూపాయల ప్రజాధనం వినియోగంలో గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం, జవాబుదారీతనంలో నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ఆడిట్ శాఖ
పంచాయతీల్లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
2.12 లక్షల ఆడిట్ అభ్యంతరాలు
నిధుల వినియోగంలో అడ్డగోలు వ్యవహారాలు
వివరణ కోరిన ఆడిట్శాఖ
ఈనాడు, హైదరాబాద్: కోట్ల రూపాయల ప్రజాధనం వినియోగంలో గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం, జవాబుదారీతనంలో నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ఆడిట్ శాఖ తేటతెల్లం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 12,789 గ్రామ పంచాయతీల ఆడిట్ను పూర్తి చేసిన రాష్ట్ర ఆడిట్ శాఖ నిధుల వ్యయం తీరు, నిబంధనల ఉల్లంఘన, రికార్డులను అందుబాటులో ఉంచకపోవడం, వసూలు చేసిన నిధులను జమచేయకపోవడం సహా వివిధ అంశాలను గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,12,651 అభ్యంతరాలను నమోదు చేసింది. వాటిపై వివరణ ఇవ్వాలని సంబంధిత పంచాయతీలకు నోటీసులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు వసూలు చేసే మొత్తాలను సంబంధిత శాఖలకు ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకుంటున్న వ్యవహారాన్ని తప్పుపట్టింది. పంచాయతీల్లో నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కోట్ల రూపాయల నిధుల వినియోగంలో ప్రధానంగా 18 అంశాలపై ఆడిట్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
నగదు నిర్వహణ అధ్వానం...
పంచాయతీల్లో నగదు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆడిట్శాఖ గుర్తించింది. బడ్జెట్లో నిర్దేశించిన గ్రాంట్ల కంటే ఎక్కువ మొత్తం వినియోగించారు. నిధులు విడుదల కాకముందే ఖర్చు చేయడం, ఉన్న నిధులను వినియోగించకపోవడం, కనీసం వాటిని ఖర్చు చేసేందుకు గడువు కోరకపోవడం వంటి లోపాలు అనేక పంచాయతీల్లో జరిగాయి. మరికొన్నిచోట్ల నిధుల వినియోగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. బకాయిల వసూలు విషయంలో చట్టపరమైన చర్యల జోలికిపోకపోవడంతో అవి అలాగే ఉండిపోయాయి. ప్రత్యేక సందర్భాల్లో కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్లను తిరిగి వసూలు చేయకపోవడం గమనార్హం.
వసూలైనవీ జమ చేయట్లేదు...
వసూలు చేసే పన్నులను సంబంధిత శాఖలకు బదిలీ చేయాల్సి ఉన్నా పంచాయతీలు ఆ నిధులను తమవద్దే ఉంచుకున్నాయి. జీఎస్టీ, ఆదాయపు పన్ను, లేబర్ సెస్, లైబ్రరీ సెస్లను సంబంధిత సంస్థలకు ఇవ్వలేదు. సీనరేజీ చెల్లింపులూ పాక్షికంగానే ఉన్నాయి. నిధుల వినియోగానికి సంబంధించిన ఎంబుక్లను ఇవ్వలేదు. ఓచర్లు లేకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలున్నాయి. ఒకే పనికి మళ్లీ మళ్లీ డబ్బులు డ్రా చేయడం, నకిలీ చలాన్ల వ్యవహారాలూ వెలుగుచూశాయి. చట్టబద్ధంగా రికవరీ చేయాల్సినవి చేయకపోగా, అనుమతించిన రేట్లకంటే ఎక్కువ చెల్లింపులు చేశారు. గ్రాంట్లు ఉపయోగించిన మొత్తాలకు వినియోగ సర్టిఫికెట్లు ఇవ్వలేదు.
అత్యధిక పంచాయతీల్లో గుర్తించిన లోపాలివి..
* వసూలు చేసి మొత్తాన్ని శాఖలకు ఇవ్వకపోవడం
* నిధుల మళ్లింపు
* అధిక చెల్లింపులు
* రికార్డులు, వినియోగ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం
* అడ్వాన్స్లు సర్దుబాటు చేయకపోవడం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
సినీ నటుడు నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్