ఉచిత వై-ఫైతో ముప్పు!
అంతర్జాల అవసరాలు పెరిగిన ఈ రోజుల్లో.. కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై సదుపాయం అందుబాటులో ఉంటోంది. మెట్రో రైల్వే నుంచి విమానాశ్రయం వరకు వివిధ ప్రదేశాల్లో
సమాచారం తస్కరణ.. నగదు బదిలీతో బ్యాంకు ఖాతాలు గుల్ల
ఈనాడు, హైదరాబాద్: అంతర్జాల అవసరాలు పెరిగిన ఈ రోజుల్లో.. కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై సదుపాయం అందుబాటులో ఉంటోంది. మెట్రో రైల్వే నుంచి విమానాశ్రయం వరకు వివిధ ప్రదేశాల్లో వందలాది మంది దీన్ని వినియోగిస్తుంటారు. అవసరం మాటెలా ఉన్నా.. ఇలా వాడేవారు ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నట్లే.. ఎందుకంటే వై-ఫై నెట్వర్క్లోకి సైబర్ నేరస్థులు చొరబడుతున్నారు. నెట్వర్క్లో ఉన్న వారందరి డేటాను తస్కరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి నగరాల్లో కొద్దినెలలుగా ఇలాంటి నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లకు భయపడి.. బాధితులు నగదు బదిలీ చేస్తున్నారని, అందుకే ఈ నేరాల తీవ్రత కనిపించడం లేదంటున్నారు.ఉచిత వై-ఫై నెట్వర్క్లో సైబర్ నేరస్థులు సాధారణ వినియోగదారుల్లాగానే ప్రవేశిస్తున్నారు. మ్యాన్ఇన్ మిడిల్ అటాక్ పద్ధతిలో దాడి చేస్తున్నారు. నెట్వర్క్లోకి వైరస్లు.. స్పామ్ వేర్లు పంపుతున్నారు. వై-ఫై వినియోగిస్తున్నవారు వారి పనులు చేసుకునే సమయంలో..ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్లు, మెయిల్ చిరునామాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల వివరాలు, పాస్వర్డ్లు తీసుకుంటున్నారు. ఈ వివరాల ఆధారంగా యువత, విద్యార్థులు, సాఫ్ట్వేర్, ఫార్మా కంపెనీలు, ప్రైవేటు, కార్పొరేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసుకుంటున్నారు. తర్వాత వారి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను తెలుసుకుని బాధితులకు తెలియకుండా బ్యాంక్ ఖాతాల్లో ఎంతుంటే అంత నగదు బదిలీ చేసుకుంటున్నారు. విద్యార్థులను బ్లాక్మెయిల్ చేసి రూ.వేలు, రూ.లక్షల్లో నగదు వసూలు చేసుకుంటున్నారు.
* ముంబయిలోని ఓ ఫార్మా కంపెనీలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తున్న అధికారి కొద్దినెలల కిందట మలాడ్ ప్రాంతంలో ఉచిత వై-ఫై వినియోగించుకున్నారు. సైబర్ నేరస్థుడు ఆయన వివరాలు తెలుసుకుని అతని కంపెనీ ఖాతాలోంచి రూ.44 లక్షలు కాజేశాడు.
* గతేడాది జులైలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్చేసి అల్ఖైదా నెట్వర్క్ నుంచి మాట్లాడుతున్నాం.. విమానాశ్రయంలో దాడులు చేస్తున్నామన్నాడు. పోలీసులు, సైబర్ నిపుణులు పరిశోధించి.. ఉత్తుత్తి బెదిరింపు కాల్గా నిర్ధారించారు.
సురక్షితమైనవైతేనే..
అత్యవసర పరిస్థితులు, అనుకోని అవసరాలతో ఎక్కడైనా వై-ఫై వినియోగించుకోవాలని అనిపించినప్పుడు సురక్షిత నెట్వర్క్లను ఎంచుకోవాలి. ప్రజలు, ప్రయాణికులను ఆకర్షించేందుకు రెండుమూడేళ్లుగా ఆర్టీసీ బస్టాండ్లు.. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో వై-ఫై సౌకర్యం కల్పిస్తున్నారు. అక్కడి నెట్వర్క్ను పరిశీలించాలి. మనం వై-ఫైని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు పాస్వర్డ్ వచ్చేలా చూసుకోవాలి. అక్కడ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి వాడకూడదు.
-నల్లమోతు శ్రీధర్, సైబర్ నిపుణులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు నేడే
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.