ముక్క ముట్టాలంటే రూ. వెయ్యి పెట్టాల్సిందే!
రాష్ట్రంలో మాంసాహారానికి భారీ డిమాండు ఏర్పడింది. గొర్రెలు, మేక మాంసం రికార్డుస్థాయిలో ఆదివారం కిలో రూ.800 నుంచి 950కి అమ్ముడుపోయింది. మూడేళ్ల క్రితం కిలో ధర రూ.400-500 ఉండేది. ఇప్పుడు అంతకన్నా వందశాతం అదనంగా పెరిగింది.
కిలో రూ.800 నుంచి 950కి అమ్మకం
కనుమ వేళ భారీ డిమాండు
మూడేళ్లలోనే ధర రెట్టింపు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మాంసాహారానికి భారీ డిమాండు ఏర్పడింది. గొర్రెలు, మేక మాంసం రికార్డుస్థాయిలో ఆదివారం కిలో రూ.800 నుంచి 950కి అమ్ముడుపోయింది. మూడేళ్ల క్రితం కిలో ధర రూ.400-500 ఉండేది. ఇప్పుడు అంతకన్నా వందశాతం అదనంగా పెరిగింది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 2 కోట్లను దాటిందని, ఈ విషయంలో తెలంగాణ.. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పశుసంవర్ధకశాఖ తెలిపింది. ‘డిమాండు - సరఫరా’ సూత్రం ప్రకారం వస్తువుల ఉత్పత్తి పెరిగితే ధర పడిపోవాలి. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య భారీగా పెరిగినా.. ధర తగ్గాల్సింది పోయి, ఏకంగా రెట్టింపయింది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో మాంసం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. సంక్రాంతికి ప్రత్యేకించి కనుమ పండగ సందర్భంగా మాంసాహారం తినడం కొన్ని వర్గాల ప్రజలకు ఆనవాయితీ. ఆదివారం రాష్ట్రంలో మాంసం విక్రయాలు గరిష్ఠస్థాయికి చేరాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఆదివారం ఒక్కరోజే 10వేల గొర్రెలు, మేకలకు పైగా కోసి మాంసం విక్రయించారని టోకు వ్యాపారి ఒకరు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లారీలు, వ్యాన్లలో మేకలు, గొర్రెలను పెద్దసంఖ్యలో తెచ్చి విక్రయించారు. వాటి రవాణాకు కిరాయిలు పెరిగినందున.. అధిక ధరలకు జీవాలను విక్రయించారని, అందుకే మాంసం ధరనూ పెంచినట్లు దిల్సుఖ్నగర్ చెందిన ఓ చిల్లర వ్యాపారి స్పష్టం చేశారు. గత ఏడాది కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి గొర్రెలు, మేకల ధరలను వాటి పెంపకందారులు పెంచుతున్నారు. వాటికి వేసే దాణా, గ్రాసం ధరలు, రవాణా కిరాయిలు 30 శాతం దాకా పెరిగాయి.
విదేశాలకు విక్రయించే ధరల కన్నా దాదాపు రెట్టింపు..
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలో మాంసం ధరలు మండిపోతున్నాయని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి 7 నెలలు గత ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకూ భారత్ నుంచి 4,903 టన్నుల గొర్రె, మేక మాంసాన్ని ఎగుమతి చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో మాంసం ధర రూ.514కి పలికిందని జాతీయ వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి(అపెడా) తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ధర ఇంతకు మించితే విదేశీ మార్కెట్లలో భారత మాంసాన్ని కొనడం లేదు. కానీ, హైదరాబాద్ మార్కెట్లో ఏకంగా రూ.800 నుంచి 950కి అమ్ముతుండటం గమనార్హం. దాణాఖర్చులు బాగా పెరగడంతో పాటు రాష్ట్రంలో జీవాల కొరత ఉన్నందున మాంసం ధరలు పెరుగుతున్నాయని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు ఉడుత రవీందర్ తెలిపారు.
ధర ఎక్కువగా ఉన్నందునే ఎగుమతుల్లేవు
రాష్ట్రంలో మాంసం ధరలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. అందుకనే విదేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నాం. ధరలను పురపాలక అధికారులు నియంత్రించాలి. మేకలు, గొర్రెలను పెంపకందారులు కబేళాలకు ఎంతకు అమ్ముతున్నారనే అంశంపై పశుసంవర్ధకశాఖ, సమాఖ్య కలసి అధ్యయనం చేశాయి. కిలో ధర రూ.700కి మించి అమ్మకుండా చూడాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. అప్పట్లో అధికారులు దాడులు చేస్తే కొద్దిరోజులు ధరలు తగ్గించారు. మళ్లీ ఇప్పుడు పెంచేశారు. సంక్రాంతి సెలవులకు నగర ప్రజలు పెద్దసంఖ్యలో ఊళ్లకు వెళ్లారు. డిమాండు లేనందున ధర తగ్గించాల్సింది పోయి పెంచారు.
- రాంచందర్, ఎండీ, రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
ఓయూలో నీటి కొరత.. విద్యుత్తు కోతలు!
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్ వార్డెన్ కొమరెల్లి శ్రీనివాస్ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఉత్తర్వును ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. -
తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
భానుడు.. భీకరం
రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. -
రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత
‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. -
కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు
రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
‘టెయిల్పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత