దొంగలున్నారు జాగ్రత్త!
దొంగతనాలు, సైబర్ మోసాల ద్వారా నిందితులు రాష్ట్రంలో గంటకు రూ.రెండున్నర లక్షలు, రోజుకు రూ.అరకోటిపైనే దోచేస్తున్నారు. సైబర్ నేరాలన్నింటినీ కలిపి చూస్తే ఈ మొత్తం దీనికి రెట్టింపు ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొలుసు దొంగతనాలు తగ్గినట్లు కనిపిస్తున్నా
రాష్ట్రంలో రోజుకు రూ.అర కోటి చోరులపాలు
గతేడాది చోరీ, సైబర్ ఫ్రాడ్ ఫిర్యాదుల్లో నమోదైన మొత్తం రూ.209 కోట్లు
సైబర్ నేరాలన్నీ కలిపితే పోయింది.. మరో రూ.300 కోట్లకుపైనే
ఈనాడు, హైదరాబాద్: దొంగతనాలు, సైబర్ మోసాల ద్వారా నిందితులు రాష్ట్రంలో గంటకు రూ.రెండున్నర లక్షలు, రోజుకు రూ.అరకోటిపైనే దోచేస్తున్నారు. సైబర్ నేరాలన్నింటినీ కలిపి చూస్తే ఈ మొత్తం దీనికి రెట్టింపు ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొలుసు దొంగతనాలు తగ్గినట్లు కనిపిస్తున్నా మామూలు చోరీలు భయపెడుతూనే ఉన్నాయి. ఇక సైబర్ నేరాలు ఏటికేడు రెట్టింపవుతున్నాయి. మొత్తంగా అప్రమత్తంగా లేకుంటే.. బీరువాలో డబ్బుకే కాదు మెడలో గొలుసుకీ, జేబులో పర్సుకీ, బ్యాంకులో దాచుకున్న సొమ్ముకూ గాలం వేసేవారు అదృశ్యంగా మనచుట్టూనే ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పోలీసులు!!
* గత ఏడాది రాష్ట్రంలో ఆస్తికి సంబంధించిన నేరాల్లో (చోరీలు, దోపిడీలు..) 17,429 కేసులు నమోదయ్యాయి. ఆయా ఘటనల్లో రూ.113.50 కోట్ల సొత్తు నేరగాళ్ల పాలయింది.
* సైబర్ నేరాల్లో.. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్)కు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం ప్రజలు నష్టపోయిన సొమ్ము విలువ మరో రూ.95.71 కోట్లు. సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో బాధితులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థని ఏర్పాటు చేసింది. సైబర్ నేరానికి గురైన వారు 155260 నంబరుకు ఫోన్ చేస్తే బాధితుల వివరాలు తెలుసుకొని కోల్పోయిన సొత్తు తాలూకూ లావాదేవీని నిలిపివేస్తారు.
* పై రెండింటి ప్రకారం గతేడాది రాష్ట్ర ప్రజలు కోల్పోయిన మొత్తం రూ.209.21 కోట్లు. అంటే రోజుకు రూ.57.31 లక్షలు పోగొట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది.
* ఇవికాకుండా.. సైబర్ నేరాలపై అనేక మంది సరాసరి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటారు. ముఖ్యంగా బహుమతుల పేరుతో ఆశలు చూపి, పెళ్లి పేరుతో, ఇతరత్రా డబ్బు గుంజేవారికి సంబంధించి.. గత ఏడాది మరో 8,839 కేసులు నమోదయ్యాయి. ఈ నేరాల్లో కోల్పోయిన మొత్తం రూ.300 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
నగలు, నగదు కొంతమేర స్వాధీనం
* చోరీ అయిన నగలు, నగదుని పోలీసులు కొంతవరకూ తిరిగి స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. గత ఏడాది ఈ సొత్తులో రూ.53.11 లక్షలు (47 శాతం) తిరిగి రాబట్టగలిగారు.
* సైబర్ నేరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. నిందితులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటుండటంతో వారిని గుర్తించడం, అరెస్టు చేయడం, సొత్తు రాబట్టడం సాధ్యం కావడంలేదు. కొంతమేరకు ఆయా బ్యాంకు లావాదేవీలను నిలిపివేయగలుగుతున్నారు. ఇలా గత ఏడాది రూ.5.11 కోట్ల నగదు లావాదేవీలను నిలుపు చేయగలిగారు. పోగొట్టుకున్న సొమ్ములో ఇది 5 శాతం మాత్రమే. ఇది కూడా బాధితులకు అందేవరకూ గ్యారంటీ లేదు.
ముందు జాగ్రత్తలే ముఖ్యం
కష్టపడి కూడబెట్టిన సొమ్ము చోరులపాలు కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే ముఖ్యమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని, ఇంట్లో ఎక్కువ నగదు, నగలు ఉంచవద్దని పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా పలువురు దీన్ని పాటించడంలేదు. మాయమాటలతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలేవీ ఇతరులతో పంచుకోవద్దని.. గుర్తింపులేని, అపరిచిత వ్యక్తులు పంపే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?