ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేయండి
మౌలిక వసతుల కల్పనలో సమయమే అత్యంత విలువైన పెట్టుబడి అని.. ఏ ప్రాజెక్టు అయినా నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయకపోతే దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల
భూ సేకరణపై సమీక్షలు నిర్వహిస్తుండండి
మౌలిక వసతుల కల్పనలో సమయమే పెద్ద పెట్టుబడి
పీఎం గతిశక్తిపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఈనాడు-దిల్లీ, హైదరాబాద్: మౌలిక వసతుల కల్పనలో సమయమే అత్యంత విలువైన పెట్టుబడి అని.. ఏ ప్రాజెక్టు అయినా నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయకపోతే దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సమయానికున్న కచ్చితమైన విలువను అధికారులు అర్థం చేసుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం పీఎం గతిశక్తి కార్యక్రమంపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల సదస్సును ఉద్దేశించి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణ నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ‘‘పీఎం గతిశక్తి కార్యక్రమం వల్ల రాష్ట్రాల ఆదాయమూ పెరుగుతుంది. కేంద్రం ప్రతిపాదించే ప్రాజెక్టులకు సకాలంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు పూర్తి చేసేలా సీఎంలు చొరవ తీసుకోవాలి. భూసేకరణ విషయంలో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులకు ఇబ్బంది లేదు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా ముందుకు సాగి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిని సాధిద్దాం.
రాష్ట్రాలపై వివక్ష లేదు..
రాష్ట్రాల విషయంలో ఎలాంటి వివక్ష లేదు. బెంగళూరు-హైదరాబాద్ హైవేను 6 వరుసలుగా అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఇన్ఫర్మేషన్ సూపర్హైవే నిర్మాణం, హైదరాబాద్-విశాఖపట్నం మధ్య జాతీయ రహదారి అభివృద్ధి చేపడుతున్నాం. నాగ్పుర్-హైదరాబాద్ మధ్య గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే, ఖమ్మం-దేవరపల్లి మధ్య ఎక్స్ప్రెస్వే నిర్మిస్తున్నాం. జహీరాబాద్ వద్ద ఇండస్ట్రియల్ నోడ్ ఏర్పాటు చేస్తున్నాం. నాగ్పుర్-విజయవాడ ఎకనమిక్ కారిడార్లో ఫార్మా సిటీని చేరుస్తున్నాం. రూ.17 వేల కోట్లతో ప్రాంతీయ రింగు రోడ్డును మంజూరు చేశాం. హైదరాబాద్ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణానికి డీపీఆర్ తయారీ ఇప్పటికే ప్రారంభమైంది.
20 హైవేల్లో విమానాల అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం..
20 హైవేల్లో విమానాల అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నాం. దీనివల్ల ఈ రోడ్లను ఎయిర్పోర్టులు, హైవేలుగా ఉపయోగించడానికి వీలవుతుంది. రాష్ట్రాలు ఇక్కడ చిన్న విమానాశ్రయాలు అభివృద్ధి చేయొచ్చు. దేశవ్యాప్తంగా 30 చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, అనంతపురం వద్ద వీటి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఇస్తే.. ఈక్విటీ ఇస్తాం. పెట్టుబడి పెట్టి పార్కులను అభివృద్ధి చేస్తాం’’ అని గడ్కరీ పేర్కొన్నారు.
రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణపై చిన్నచూపు: కేటీఆర్
రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయటంలో తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. 2014లో 1,733 కిలోమీటర్లు మంజూరు చేయగా.. 2021 నవంబరు వరకు అది 1,870 కిలోమీటర్లకు మాత్రమే పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తరవాత తెలంగాణ ఉంది. ఆ జాబితాలో గుజరాత్ లేదని గమనించాలి. స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణది 5శాతం వాటా. ఈ గణాంకాలు ఆర్బీఐ వెలువరించినవే. తెలంగాణలో డ్రైపోర్టులతోపాటు పోర్టులకు అనుసంధానతను మరింత బలోపేతం చేయాలి. హైదరాబాద్కు రావాల్సిన డిఫెన్స్ కారిడార్ను బుందేల్ఖండ్కు ఏ కారణంతో తీసుకెళ్లారో కేంద్రానికే తెలియాలి. జాతీయస్థాయి ప్రాజెక్టుల మంజూరు జాబితాను చూస్తే హైదరాబాద్ అంతగా కనిపించటం లేదు. హైదరాబాద్కు ప్రాంతీయ రింగు రోడ్డుకు భూసేకరణను వేగవంతం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
ఓయూలో నీటి కొరత.. విద్యుత్తు కోతలు!
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్ వార్డెన్ కొమరెల్లి శ్రీనివాస్ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఉత్తర్వును ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. -
తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
భానుడు.. భీకరం
రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. -
రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత
‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. -
కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు
రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
‘టెయిల్పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత