ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషీ కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు కుముద్‌బెన్‌ మణిశంకర్‌ జోషీ (88) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె

Published : 15 Mar 2022 04:21 IST

నవ్సారీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు కుముద్‌బెన్‌ మణిశంకర్‌ జోషీ (88) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. తన స్వస్థలమైన గుజరాత్‌లోని నవ్సారీ జిల్లా ధరోరి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. గుజరాత్‌ నుంచి గవర్నర్‌ అయిన తొలి మహిళగా కుముద్‌బెన్‌ రికార్డులకెక్కారు. 1985-1990 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేశారు. ఆమె అవివాహితురాలు. అమెరికాలో ఉన్న బంధువులు వచ్చాక గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని