అష్ట దిగ్బంధంలో అమలాపురం
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారంనాటి ఉద్రిక్తత, విధ్వంస పరిస్థితులు చల్లారినా.. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ జిల్లావాసుల్లో, పోలీసు
ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. పునరుద్ధరణ
రావులపాలెంలో స్వల్ప ఉద్రిక్తత.. అదుపు చేసిన పోలీసులు
ఈనాడు, అమలాపురం- న్యూస్టుడే యంత్రాంగం: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారంనాటి ఉద్రిక్తత, విధ్వంస పరిస్థితులు చల్లారినా.. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ జిల్లావాసుల్లో, పోలీసు యంత్రాంగంలోనూ నెలకొంది. బుధవారం అమలాపురం పట్టణంలో కొంతసేపు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పోలీసులు భారీగా మోహరించి, పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాలిపోయిన తమ ఇంటిని మంత్రి విశ్వరూప్ సతీసమేతంగా బుధవారం పరిశీలించారు. మరోవైపు.. మంగళవారంనాటి ఉద్రిక్త పరిస్థితులపై కోనసీమ యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రావులపాలెంలోనూ ఆందోళనలు మొదలయ్యే క్రమంలో.. వాటిని పోలీసులు అదుపుచేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
స్తంభించిన సేవలు
అమలాపురంలో ఉద్రిక్తత దృష్ట్యా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. తర్వాత మళ్లీ పునరుద్ధరించారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురం వచ్చే ఆర్టీసీ బస్సులను బుధవారం తాత్కాలికంగా రద్దుచేశారు. ఇంటర్ పరీక్షలు, ఇతర అత్యవసరాల దృష్ట్యా 11 గంటల తర్వాత పునరుద్ధరించారు. వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసేశారు.
పెట్రోలు బాంబులతో దాడులు
మంగళ]వారం నాటి ఆందోళనలో పలువురు అసాంఘిక శక్తులు చొరబడి పెట్రోలు బాంబులతో దాడులు చేసి ఆస్తులు దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. కొందరు పథకం ప్రకారమే మద్యం దుకాణాల వద్ద, సినిమాహాళ్లలో వాహనాలు నిలిపి అక్కడి నుంచి ఉదయం ఆట తర్వాత ఆందోళనలో కలిశారనే ప్రచారం సాగుతోంది. మంగళవారం నాటి ఘటనలో మంత్రి విశ్వరూప్ నివాసం వద్ద ఒక జీపు, ఐదు ద్విచక్రవాహనాలు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిదగ్గర రెండు బైకులు.. కలెక్టరేట్ దగ్గర ఒక బస్సు, ఎర్రవంతెన దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించడానికి పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో 46 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీట్లు, ఇతర నేరచరిత్ర ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఉద్విగ్నం.. ఉద్రిక్తత
దాడులతో దెబ్బతిన్న భట్నవిల్లిలో ఇంటికి మంత్రి విశ్వరూప్ బుధవారం తన భార్య మీనాక్షితో కలిసి వచ్చారు. కాలిపోయిన ఇల్లు చూసి దంపతులు ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆయన అభిమానులు, అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ప్రతినిధులు... పోలీసులు, ఆందోళనకారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
ప్రభుత్వానికి నివేదిక
అమలాపురంలో మంగళవారం నాటి ఉద్రిక్త పరిస్థితులపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది. మంగళవారం పరిణామాలను.. విధ్వంసం తీరును నివేదికలో పేర్కొన్నారు. పరిస్థితిని అంచనా వేసి ఈనెల 22న కోనసీమ జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమల్లోకి తెచ్చామన్నారు. కోనసీమ సాధన సమితి ఈ నెల 22న తలపెట్టిన ఆందోళనలో అనుచిత ఘటనలు జరగకుండా నిలువరించామన్నారు. ఆందోళన విషయం గుర్తించి ఈ నెల 24న ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా 5వేల మంది వరకు వచ్చారని, కొందరిని కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించడానికి అనుమతించేటప్పుడే బయట దాడులకు పాల్పడ్డారని తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి ప్రత్యేక బలగాలు రప్పించడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్తోపాటు..ముమ్మిడివరం ఎమ్మెల్యే సోదరుడి టింబర్ డిపోలపై దాడులకు పన్నిన కుట్రను భగ్నం చేయగలిగామని నివేదికలో తెలిపారు.
మరోవంక.. సీసీటీవీ ఫుటేజీ, సామాజిక మాధ్యమాలు, స్పెషల్ బ్రాంచి ద్వారా ఫుటేజీలు సేకరించి విధ్వంసాలకు పాల్పడిన చాలామందిని గుర్తించామని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు. హింసకు కారకులైన 46 మందిని అదుపులోకి తీసుకుని ఆరు కేసులు పెట్టామని ఆయన వివరించారు.
మా నాయకులను తప్పుదోవ పట్టించారు..
‘అమలాపురంలో అల్లర్ల వెనక తెదేపా, జనసేన ద్వితీయశ్రేణి నాయకులున్నారు. ఈ విధ్వంసానికి కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలి. కోనసీమ, అమలాపురం పట్టణ ప్రజలు చాలా మంచోళ్లు. శాంతియుత ధర్నాలో కొంతమంది సంఘ విద్రోహులు, అమలాపురం పరిసరాల్లోని రౌడీషీటర్లు చేరి ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. మా ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు తగులబెట్టారు. డీఎస్పీ బాషా కాల్పులు జరిపి గుంపును చెల్లాచెదురు చేసి ఎమ్మెల్యే దంపతులను బయటకు తీసుకొచ్చారు. 50 ఏళ్ల కోనసీమ చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ లేవు. దీనివెనుక అమలాపురంలోని ద్వితీయ శ్రేణి తెదేపా, జనసేన నాయకులున్నారు. పేర్లు మాదగ్గర ఉన్నాయి. వైకాపా బీసీ కౌన్సిలర్తో నాలుగైదు రోజులుగా ఎవరెవరు సంప్రదించారో సమాచారం ఉంది. ఫైరింగ్ చేయడం మా అభిమతం కాదు.. ఫైరింగ్ చేయాలంటే 5 నిమిషాల పని. కానీ పోలీసులు సంయమనం పాటించారు. తప్పుచేసిన ప్రతిఒక్కరినీ శిక్షిస్తాం’ అంటూ మంత్రి హెచ్చరించారు. దీనిపై తెదేపా నేత చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్లు వైకాపా ప్రేరేపితమని, ఘటన వెనుక ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక వైకాపా పాత్ర ఉందని జనసేన నాయకులు ఆరోపించారు.
అన్యం సాయి చుట్టూ వివాదం
కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఈ నెల 20న జరిగిన ఆందోళనలో అమలాపురానికి చెందిన అన్యం సాయి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈయన వైకాపా కార్యకర్తని, మంత్రి విశ్వరూప్, ఇతర వైకాపా నాయకుల చిత్రాలతో సాయి ముద్రించినట్లున్న ఫ్లెక్సీ.. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సాయి ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పుట్టినరోజును సాయి నిర్వహిస్తున్న చిత్రాలూ వాట్సప్లో తిరుగుతున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ సీఎం జగన్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్తో తీసుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తిరిగాయి.
రావులపాలెంలో కట్టుదిట్టం
ఈనాడు డిజిటల్-రాజమహేంద్రవరం, న్యూస్టుడే-రావులపాలెం పట్టణం: కోనసీమ ఆందోళన అమలాపురం నుంచి బుధవారం రావులపాలేనికి పాకింది. ‘చలో రావులపాలెం’ పేరుతో యువత పెద్దఎత్తున నిరసన చేపట్టాలని భావించగా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటుచేశారు. ర్యాలీకి సిద్ధమైన 50 మంది నిరసనకారులను అడ్డుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. రావులపాలెం వచ్చే మార్గాలన్నీంటిలో 20 చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. వచ్చే వాహనాలన్నీ ఆపి తనిఖీ చేసి పంపారు. తూర్పుగోదావరి ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సాయంత్రం పట్టణంలో బందోబస్తు పర్యవేక్షిస్తుండగా ఒక నిరసనకారుడు ఇటుక రాయి విసిరారు. అది ఎస్పీ కాన్వాయ్ వాహనానికి తగిలింది. దీంతో భద్రతాదళాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి. రావులపాలెంలో బుధవారం ఇంటర్నెట్ సర్వీసులు, ఫోన్లు మధ్యాహ్నం వరకూ సక్రమంగా పని చేయలేదు. అమలాపురం వెళ్లే 90 బస్సు సర్వీసులు మధ్యాహ్నం వరకు ఆపేశారు.
మోహరించిన బలగాలు
ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలతో పాటు 1,400 మంది పోలీసులు అమలాపురంలో మోహరించారు. అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో.. బెటాలియన్ అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ, ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీలు రవీంద్రనాథ్ బాబు, ఐశ్వర్య రస్తోగి, విశాల్ గున్నీ, రవిప్రకాశ్ తదితరుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. మంగళవారం రాత్రి నుంచి అమలాపురం అష్ట దిగ్బంధంలోకి వెళ్లింది. చుట్టుపక్కల గ్రామాల్లోనూ పోలీసులు మోహరించడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. బుధవారం ఉదయం 11 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?