ఉద్యోగాల గని.. డేటా సైన్స్
సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచానికి మానవ వనరులను అందిస్తున్న భారత్.. డేటా సైన్స్ నైపుణ్యంలో మాత్రం బాగా వెనకబడిపోయింది. అభివృద్ధికి, ఉద్యోగాలకు భారీ అవకాశాలున్న ఈ రంగంపై దృష్టి పెడితే భారతీయ యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని ప్రపంచ నైపుణ్య
ఆ రంగంలో ఉద్యోగావకాశాలు అధికం
నైపుణ్య ప్రావీణ్యంలో భారత్ వెనకబాటు
ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగు
కోర్సెరా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్-2022లో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్
సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచానికి మానవ వనరులను అందిస్తున్న భారత్.. డేటా సైన్స్ నైపుణ్యంలో మాత్రం బాగా వెనకబడిపోయింది. అభివృద్ధికి, ఉద్యోగాలకు భారీ అవకాశాలున్న ఈ రంగంపై దృష్టి పెడితే భారతీయ యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని ప్రపంచ నైపుణ్య నివేదిక-2022 సూచించింది. డిజిటల్ ఎకానమీలో అత్యధిక ఉద్యోగావకాశాలను కల్పించే మూడు నైపుణ్య విభాగాలు-బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్లలో పరిస్థితిని నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోల్చుకుంటే టెక్నాలజీలో ఈసారి భారత్ నాలుగు స్థానాలను మెరుగుపర్చుకోగా.. వ్యాపారం, డేటా సైన్స్లో దిగజారినట్టు తెలిపింది. నైపుణ్యంలో దేశం మొత్తం ఒకే స్థాయిలో లేదని, ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. ఆన్లైన్ కోర్సులను అందించే ప్రతిష్ఠాత్మక కోర్సెరా సంస్థ ఈ గ్లోబల్ స్కిల్ రిపోర్ట్-2022ను ఇటీవల విడుదల చేసింది. ఈ సంస్థలో గత ఏడాది కాలంలో 100కిపైగా దేశాల నుంచి 10 కోట్ల మంది వరకు వివిధ నైపుణ్యాలను నేర్చుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించి.. వాటిలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా నైపుణ్యాల స్థాయులను వెల్లడించింది.
భారత్కు 68వ స్థానం...
మొత్తం మీద నైపుణ్యంలో భారత్ 68వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే ఈసారి 4 స్థానాలు దిగజారింది. డేటా సైన్స్లో భారత్ ప్రావీణ్యం 2021లో 38 శాతం ఉండగా.. 2022లో అది 26 శాతానికి తగ్గింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 12 స్థానాలు పడిపోయింది. ఆసియాలో 19వ స్థానంలో నిలిచింది. అయితే టెక్నాలజీ ప్రావీణ్య స్థాయులు 38 నుంచి 46 శాతానికి పెరగడం విశేషం. ఇందులో ఆరు స్థానాలను మెరుగుపర్చుకున్నట్లు నివేదిక వెల్లడించింది. భారత్లో నైపుణ్యం విషయంలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్ది కావడం విశేషం.
ఏడాదిలో 47 శాతం పెరిగిన కొలువులు
నైపుణ్యాలను భారత్ నిరంతరం మెరుగుపరుచుకోవాలని నివేదిక సూచించింది. ముఖ్యంగా మార్కెట్ దృష్ట్యా బహుళ జాతి కంపెనీలు దక్షిణాసియా వైపు చూస్తున్నాయని, అందుకే డేటా సైన్స్లో నైపుణ్యాల స్థాయులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొంది. దేశంలో 2020-2021 మధ్య కాలంలో డేటా సైన్స్ కొలువులు 47.10 శాతం పెరిగాయని తెలిపింది. ఈ రంగంలో 26 శాతం ప్రావీణ్యం కారణంగా కంపెనీలు ప్రతిభావంతులైన మానవ వనరులు లేక ఇబ్బంది పడతాయని పేర్కొంది.
రెండేళ్లలో మెరికలు వస్తారు
బీటెక్లో మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ అంశాలను పదేళ్ల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాం. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యలో రెండేళ్ల క్రితమే బీటెక్ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్ లాంటివి ప్రవేశపెట్టారు. మరో రెండేళ్లలో డేటా సైన్స్లో ప్రతిభావంతులు బయటకొస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఐ) ఉండటం వల్ల డేటా సైన్స్లో అక్కడి విద్యార్థులు మెరుగ్గా ఉన్నారు.
- ఆచార్య కామాక్షిప్రసాద్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్, కంప్యూటర్ సైన్స్, జేఎన్టీయూహెచ్
భవిష్యత్తు అవసరాలకు నైపుణ్యాలను పెంచుకోవాలి
భవిష్యత్తు అవసరాలు మారుతున్నందున దానికి తగ్గట్టుగా ఇంజినీరింగ్, కామర్స్ విద్యను మార్చుకొని నైపుణ్యాలను పెంచుకోవాలి. అందుకు కంపెనీలు, కళాశాలలు కలిసి పనిచేయాలి. మైక్రోసాఫ్ట్ ‘ఎంగేజ్’ లాంటి కార్యక్రమాలతో ఇప్పటికే కొన్ని సంస్థలు ఆ దిశగా పనిచేస్తున్నాయి. మేమూ ఈ అంశంపై అవగాహన పెంచుతున్నాం.
- వెంకట్ కాంచనపల్లి, సీఈవో, సన్టెక్ కార్ప్ క్యాంపస్ ప్లేస్మెంట్ శిక్షణ సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా