‘అన్నారం’లోని మూడో పంపు ట్రయల్‌ రన్‌

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీప అన్నారం (సరస్వతి) పంపు హౌస్‌ లో చెడిపోయిన మూడో పంపునకు మరమ్మతులు నిర్వహించిన అధికారులు సోమవారం రాత్రి ట్రయల్‌ రన్‌ చేశారు.

Published : 01 Nov 2022 03:34 IST

మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీప అన్నారం (సరస్వతి) పంపు హౌస్‌ లో చెడిపోయిన మూడో పంపునకు మరమ్మతులు నిర్వహించిన అధికారులు సోమవారం రాత్రి ట్రయల్‌ రన్‌ చేశారు. గత జులైలో కురిసిన వర్షాలకు పంపు హౌస్‌లోకి వరద నీరు చేరడంతో 12 పంపులు మునిగి దెబ్బతిన్నాయి. వాటిలో ఇప్పటికే రెండు పంపులకు మరమ్మతులు చేపట్టి ట్రయల్‌ రన్‌ చేశారు. తాజాగా మూడో పంపును బాగు చేసి 10 నిమిషాల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మంగళవారం పూర్తిస్థాయిలో ట్రయల్‌ రన్‌ చేపట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని