మన ఊరు.. మన బడి.. మందకొడి
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులనూ తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి.
విద్యా సంవత్సరం సగం పూర్తయినా.. అరకొర పనులే
అంచనా వ్యయం రూ.30 లక్షలు దాటిన చోట ఊసేలేదు
టెండర్లు పిలిచినా ముందుకురాని గుత్తేదార్లు
తీరని తరగతి గదుల కొరత... పిల్లలకు తప్పని తిప్పలు
ఈనాడు - హైదరాబాద్
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులనూ తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికే పనులను పూర్తి చేయాలన్న సంకల్పం నెరవేరకపోగా... వచ్చే ఏడాదికి కూడా సంపూర్ణంగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తక్కువ ఖర్చయ్యే విద్యుత్తు పనులే ఎక్కువ చోట్ల పూర్తవుతున్నాయి. తర్వాత చిన్న మరమ్మతు పనులు జరుగుతున్నాయి. శౌచాలయాలు, వంట గదులు, ప్రహరీల నిర్మాణ పనులు ఎక్కువ చోట్ల మొదలేకాలేదు. శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదుల స్థానంలో కొత్తవి వస్తాయని, తమ అవస్థలు తీరతాయని ఆశించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు నిరాశ తప్పడం లేదు. ఏ ఒక్క చోటా ఆ పనులు ప్రారంభం కాలేదు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను ‘ఈనాడు’ పరిశీలించగా...మందకొడిగా నడుస్తున్నట్లు తేలింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.
టెండర్లకు ముందుకురాని గుత్తేదార్లు
పనుల అంచనా వ్యయం రూ.30 లక్షల లోపు ఉన్న పాఠశాలల్లో ఎక్కువ చోట్ల ఏదో ఒక పని మాత్రమే మొదలయింది. లేదా ఆ ప్రయత్నాల్లో ఉండటమో కనిపించింది. ఆ పనులను పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్లు లేదా కమిటీ తీర్మానించిన వారికి అప్పగించారు. రూ.30 లక్షలకు మించితే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. అలాంటి పనులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల వరకు ఉన్నాయి. వాటికి టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల మూడు నాలుగు సార్లు పిలిచినా ప్రయోజనం ఉండటం లేదు. ఉదాహరణకు నిర్మల్ జిల్లాలో 82 పాఠశాలల పనులకు టెండర్లు పిలిస్తే ఇప్పటివరకు 35 చోట్లే పనులు ఖరారయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 84 బడులకు ఏడు చోట్లే గుత్తేదార్లు ముందుకువచ్చారు. అటూఇటుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. పనులు చేపడితే సకాలంలో బిల్లులు ఇస్తారో లేదోనని వారు జంకుతున్నట్లు సమాచారం. నిధుల కొరత లేదని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నా నష్టపోతామేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటివరకు ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మాత్రమే నిధులు విడుదలైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రకటించి 18 నెలలు...ప్రారంభించి 9 నెలలు...
ప్రభుత్వ బడుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు కొత్త పథకం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చిలో బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తామని వెల్లడించింది. అయినా 2021-22లో నిధులు కేటాయించలేదు...పనులు మొదలుపెట్టలేదు.2022 మార్చి బడ్జెట్లో రూ.7,289 కోట్లతో మూడు విడతల్లో అన్ని పాఠశాలల్లో వసతులు కల్పిస్తామని సర్కారు ప్రకటించింది. తొలి విడత పనులకు మార్చి 9న వనపర్తిలో సీఎం శ్రీకారం చుట్టారు. మొత్తానికి గత జూన్లో బడుల ప్రారంభం నాటికి పనులు పూర్తి చేస్తారని భావించినా విద్యాసంవత్సరం (2022-23) ముగిసే ఏప్రిల్ వరకూ అది నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
ఇదీ కొన్ని పాఠశాలల్లో దుస్థితి...
* ఇది జనగామ జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల. గదులన్నీ దాదాపు శిథిలావస్థకు చేరాయి. మన ఊరు-మన బడి కింద రూ.1.50 కోట్లతో ఎనిమిది తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. టెండర్లు ఖరారు కాకపోవడంతో పనులు మొదలుకాలేదు. వరండా ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉండటంతో పెంకులను తీసివేశారు. గదుల కొరత కారణంగా కొన్ని తరగతులను చెట్ల కిందే నడుపుతున్నారు. జనగామ స్టేషన్రోడ్డులోని ఉన్నత పాఠశాల సైతం ఎంపికైనా పనులు మొదలుకాలేదు. అక్కడ కనీసం వంట గది కూడా లేదు. తరగతి గదులు సరిపోకపోవడంతో అదే ప్రాంగణంలో ఉన్న జూనియర్ కళాశాల గదుల్ని వాడుకుంటున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాలకు రూ.12.50 లక్షలు మంజూరుకాగా విద్యుత్తు పనులు పూర్తయ్యాయి. తాగునీటి సంపు పనులు జరుగుతున్నాయి. ప్రహరీ, మరమ్మతు, మరుగుదొడ్ల పనులు మొదలుకాలేదు. విద్యుత్తు పనులకుగాను రూ.88 వేలు మాత్రమే చెల్లించారు.
* జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల ప్రాథమిక పాఠశాలలో పనులు దాదాపు పూర్తయ్యాయి. విద్యుత్తు తాగునీరు, ఇతర మరమ్మతులతోపాటు ఫ్యాన్లు బిగించే పనులన్నీ పూర్తయ్యాయి. రంగులు వేసే ప్రక్రియ చివరి దశలో ఉంది. మొత్తం రూ.13.61 లక్షలు మంజూరు కాగా ఆమేరకు కొంతమంది గ్రామ యువకులు ముందుకొచ్చి పనులు పూర్తిచేశారు. వారికి ఇప్పటివరకు రూ.6.45 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన నిధుల కోసం వారు ఎదురుచూస్తున్నారు. అదే ప్రాంగణంలోని ఉన్నత పాఠశాలకు రూ.32 లక్షలు మంజూరు కాగా పనులు ఇంకా మొదలుకాలేదు. జనగామ జిల్లాలో 176 పాఠశాలలు ఎంపికకాగా 67 చోట్ల పనులు పూర్తయ్యాయని, మరో 64 చోట్ల పురోగతిలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే 45 బడుల్లో పనులు ప్రారంభమే కాలేదు.
* సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి. రెండు తరగతి గదులు, భోజనశాల, ప్రహరీ తదితర పనులు చేయాల్సి ఉండగా...ఇప్పటికీ మొదలుకాలేదు. టెండర్లు ఖరారు కాకపోవడమే కారణం. తాటిపాముల ప్రాథమిక పాఠశాలలో విద్యుత్తు పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఉపాధి హామీ నిధుల కింద వంట గది, ప్రహరీ, శౌచాలయాలను నిర్మించాల్సి ఉండగా ఒకట్రెండు రోజుల కిందే వంట గది పునాదుల పనులు ప్రారంభమయ్యాయి. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి ఉన్నత పాఠశాలలో ఇప్పటికీ ఏ ఒక్క పనీ మొదలుకాలేదు.
ఇదీ కార్యక్రమం...
* లక్ష్యం: 26,065 సర్కారు బడుల్లో వసతులు మెరుగుపరచడం
* బడ్జెట్: రూ.7,289 కోట్లు
* మొదటి విడతలో వ్యయం: రూ.3,497 కోట్లు
* తొలివిడతలో ఎంపిక చేసిన పాఠశాలలు: 9,123
(ప్రతి మండలంలో మూడో వంతు)
పర్యవేక్షణ...
పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, టీఎస్ఈడబ్ల్యూఐడీఎస్, మున్సిపాలిటీ, సాగునీటి పారుదల
చేయాల్సిన 12 రకాల పనులు ఇవే...
1.నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2.విద్యుదీకరణ 3.తాగునీరు 4.ఫర్నిచర్ (పిల్లలు, ఉపాధ్యాయులకు) 5.రంగులు 6. పెద్ద, చిన్నతరహా మరమ్మతులు 7.గ్రీన్ బోర్డులు) 8.ప్రహరీగోడ 9.వంట గది 10.శిథిల భవనాల స్థానంలో నూతన గదులు 11.భోజనశాల (ఉన్నత పాఠశాలల్లో మాత్రమే) 12. డిజిటల్ సౌకర్యాలు
ఇదీ పరిస్థితి...
* మొత్తం పాఠశాలలు: 9,123
* కలెక్టర్లు పరిపాలన అనుమతులు ఇచ్చినవి: 8,833 (96.82 శాతం)
* పనులు ప్రారంభం: 7,211 (79 శాతం)
* పనులు పూర్తయినవి: 1200 (13.15%)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య