ఉపాధి హామీపై పిడుగు
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులను రూ.89,400 కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు తగ్గించడంతో అది తెలంగాణపై ప్రభావం చూపనుంది.
నిధుల కేటాయింపును తగ్గించిన కేంద్రం
రాష్ట్రంపై తీవ్ర ప్రభావం
ఇక పనులకు కటకటే
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపులను రూ.89,400 కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు తగ్గించడంతో అది తెలంగాణపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన కూలీలకు సరిపడా పనులు దొరకట్లేదు. కేంద్ర తాజా నిర్ణయంతో మరింత మంది ఉపాధిని కోల్పోనున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని 12,771 గ్రామాల్లో ఇది అమలవుతోంది. 2018-19 కాలంలో ఏకంగా 106 శాతం పనులు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలల గడువు ఉండగా... జనవరి నెలాఖరు నాటికి 10.5 కోట్ల పనిదినాలను కల్పించింది. కూలీలు ఇంకా పనులను కోరుతున్నారు. అయితే నిధులు తక్కువగా కేటాయించడం వల్ల రాష్ట్రంలో నమోదైన వారిలో 35 శాతం మందికే ఉపాధి లభిస్తోంది.
పెంచాలని రాష్ట్రం కోరినా...
పథకం డిమాండ్కు తగ్గట్లు కేటాయింపులను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి కేంద్రాన్ని కోరుతోంది. కానీ, కేటాయింపుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. 2018-19లో రాష్ట్రం రూ.2,900 కోట్లకు పైగా వినియోగించి ఇంకా పెంచాలని కోరగా.. 2019-20లో రూ.712 కోట్లు తగ్గించింది. 2020-21లో దేశవ్యాప్తంగా కేటాయింపులు పెరగడంతో తెలంగాణకు రూ.4,163 కోట్లు నిర్దేశించింది. రాష్ట్రం పెంచాలని కోరగా పెంచకుండా 2021-22లో రూ.4,119 కోట్లకు పరిమితం చేసింది. 2022-23లో ఇంకా రూ.1,621 కోట్లను తగ్గించింది. ఈ ఏడాది కేటాయింపుల్లో ఇంకా రూ.800 కోట్ల మేరకు సామగ్రి కోటా (మెటీరియల్ కాంపొనెంట్) కింద కేంద్రం నుంచి రావాలి. అవి ఇవ్వకపోగా.. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రైతువేదికల నిర్మాణానికి వెచ్చించిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.అయిదువేల కోట్లు కేటాయించాలని, పనిదినాల సంఖ్యను 12 కోట్లకుపైగా పెంచాలని కేంద్రాన్ని కోరింది. కానీ, తాజా బడ్జెట్లో కేంద్రం దేశవ్యాప్తంగా ఈ పథకం కేటాయింపులను నిరుటి కంటే రూ.29,400 కోట్ల మేరకు తగ్గించింది. ఈ క్రమంలో రాష్ట్రానికి మరో రూ.వెయ్యి కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని, పనులు తగ్గడంతో పాటు గ్రామీణుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ప్రభుత్వవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చట్టసభల్లో పవన్ గొంతు వినాలి: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!