మద్యం మార్కెట్ కోసం మాయోపాయాలు
దేశ రాజధాని దిల్లీలో మద్యం వ్యాపారం ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వ్యాపారులు అనేక అవకతవకలకు పాల్పడ్డట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది.
దిల్లీ కేసు అభియోగపత్రంలో ఈడీ
ఈనాడు, హైదరాబాద్: దేశ రాజధాని దిల్లీలో మద్యం వ్యాపారం ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వ్యాపారులు అనేక అవకతవకలకు పాల్పడ్డట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ కుంభకోణం బయటపడగానే ఆధారాలు మాయం చేయడంతోపాటు తప్పుడు నివేదికలు ఇవ్వడం, ప్రజాభిప్రాయం కూడా తమకు అనుకూలంగా వచ్చినట్లు నమ్మించడం సహా అనేక మాయోపాయాలకు పాల్పడినట్లు ఈడీ అభియోగపత్రంలో పేర్కొంది. మద్యం కొత్త విధానం రూపొందించేందుకు దిల్లీ ప్రభుత్వం కంటితుడుపుగా నిపుణుల కమిటీని నియమించిందని, ఆ కమిటీ సూచనలను ఎక్కడా అమలు చేయలేదని ఈడీ పేర్కొంది.
ఇవీ అభియోగాలు..
* మద్యం హోల్సేల్ వ్యాపారం ప్రభుత్వం వద్దనే పెట్టుకోవాలని నిపుణుల కమిటీ సూచించింది. తద్వారా రిటైల్ వర్తకులకు ప్రభుత్వం ద్వారానే మద్యం విక్రయిస్తే.. వెంటనే ఆదాయం వస్తుంది. దీన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న మంత్రుల కమిటీ సూచనలను నిపుణుల కమిటీ వ్యతిరేకించింది. చివరకు ప్రైవేటు వ్యక్తులకే అప్పగించాలని నిర్ణయించారు.
* ఇటువంటి మార్పులు అనేకం చేశారని, దీనిపై ప్రజాభిప్రాయం కూడా తమకు అనుకూలంగానే ఉన్నట్లు చెప్పేందుకు మద్యం వ్యాపారులు ప్రయత్నించినట్లు ఈడీ గుర్తించింది. ‘ప్రజాభిప్రాయ’ బాధ్యతలను ‘ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఏర్పాటైన మద్యం వ్యాపారుల సంఘం ఓ ప్రచార సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ కొత్త విధానాన్ని సమర్థిస్తూ.. నాలుగు వేల ఈ మెయిల్స్ పంపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 45 వేర్వేరు ఫార్మాట్లలో లేఖలు, వీటిని పంపేందుకు వెయ్యి ఈ మెయిల్ ఐడీలు కూడా సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
* ఇతర రాష్ట్రాల్లో కంటే తక్కువ ధరకే తాము మద్యం అమ్ముతున్నట్లు వ్యాపారులు అఫిడవిట్ దాఖలు చేయాలని కొత్త విధానంలో ఓ నిబంధన ఉంది. ఇతర రాష్ట్రాల కంటే దిల్లీలోనే మద్యం ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఈడీ ఆరోపించింది. దీన్ని పరిశీలించకుండానే ఆబ్కారీశాఖ అనుమతించిందని పేర్కొంది.
* దర్యాప్తు మొదలైన తర్వాత ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఫోన్లు ధ్వంసం చేయడంతోపాటు నిందితులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కొంతమంది నిందితులు ముందుజాగ్రత్త చర్యగా సిమ్ కార్డులు, ఫోన్లు వేరేవారి పేర్లమీద కొనుగోలు చేశారు. ఉదాహరణకు మనీశ్ సిసోదియా నాలుగు ఫోన్లు, ఒక సిమ్ కార్డు ఇతరుల పేర్లమీద కొని వాడుకున్నారు.
* శరత్చంద్రారెడ్డి తమ మద్యం సంస్థల సర్వర్లను కూడా మార్చేందుకు ప్రయత్నించారు. డిఫెన్స్ కాలనీలో ఉన్న ట్రైడెంట్ చెంపార్, ఆర్గానమిక్స్, శ్రీ అవంతిక సంస్థలకు చెందిన మూడు మద్యం సంస్థల సర్వర్లను అక్కడి నుంచి వెంటనే తొలగించాలని శరత్చంద్రారెడ్డి తనను ఆదేశించినట్లు ఆయన అనుచరుడు చందన్రెడ్డి దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. మద్యం విధానం రూపకల్పన దగ్గర నుంచి వ్యాపార లావాదేవీలన్నీ ఈ సర్వర్ల నుంచే జరిగి ఉంటాయని.. అందుకే వాటిని తరలించేందుకు ప్రయత్నించారని అధికారులు భావిస్తున్నారు. కాని తమ సాంకేతిక బృందం ఈ సర్వర్లను స్వాధీనం చేసుకోగలిగిందని ఈడీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!