BR Ambedkar: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా..
హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. శుక్రవారం(14వ తేదీ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం
భూమి నుంచి 175 అడుగుల ఎత్తు స్మారకం
పీఠం 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు
రేపు ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఆవిష్కరణ
అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు
హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. శుక్రవారం(14వ తేదీ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మహావిగ్రహ విశేషాలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా హైదరాబాద్లో నిర్మించిన ఈ స్మారకం ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. హుస్సేన్సాగర్ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా రవాణా సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనుంది. దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
125వ జయంతి సందర్భంగా ప్రకటన
అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో నిర్మించి పర్యాటక, విజ్ఞాన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది. ఈ మేరకు రూ.146.50కోట్ల నిధులు కేటాయించింది. హుస్సేన్సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. నిర్మాణ పనులకు ఎస్సీ సంక్షేమశాఖ నిధులు అందించగా, నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. ఆ శాఖ ఈఎన్సీ ఈ ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేయాలని అప్పట్లో నిర్ణయించినప్పటికీ..అధ్యయనం, నిర్మాణశైలి తదితర పనుల నేపథ్యంలో జాప్యం జరిగింది.
దిల్లీలో తయారీ.. ఇక్కడికి తరలింపు
కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. స్తూపాన్ని నిర్మించిన తరువాత విగ్రహ భాగాలను దిల్లీలో సిద్ధంచేసి హైదరాబాద్కు తరలించారు. భారీ క్రేన్ల సహాయంతో వాటిని క్రమపద్ధతిలో అమర్చారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా తయారీలో పటిష్ఠ లోహ సామగ్రిని వినియోగించారు. విగ్రహం పాదాల వద్దకు చేరుకునేందుకు వీలుగా మెట్లమార్గం, ర్యాంపుతోపాటు 15 మంది ఎక్కగల సామర్థ్యంతో రెండు లిఫ్టులు ఏర్పాటుచేశారు.
విజ్ఞానం..విశేషాల సమాహారంగా..
విగ్రహం కింద, పీఠం లోపల స్మారక భవనంలో 27,556 అడుగుల నిర్మిత స్థలం ఉంది. ఇక్కడే మ్యూజియం, అంబేడ్కర్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో కూడిన ఫొటో గ్యాలరీ ఏర్పాటుకానుంది. భవనం లోపల ఆడియో విజువల్ రూమ్స్ ఉన్నాయి. ఈ గ్యాలరీ కోసం ఆ మహనీయుని జీవిత విశేషాలకు సంబంధించిన అరుదైన చిత్రాలను సమీకరించేందుకు ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ మ్యూజియంతోపాటు గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయడంలో నిమగ్నమైంది. గ్రంథాలయంలో అంబేడ్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించి ఏయే పుస్తకాలు అందుబాటులోకి తేవాలనే అంశంపై త్వరలో నిర్ణయం జరగనుంది. మూడు నెలల్లోగా ఈ ఏర్పాట్లు పూర్తికానున్నాయి. స్మారకం వెలుపల పచ్చదనం కోసం 2.93 ఎకరాల ఖాళీ స్థలం ఉంటుంది. స్మృతివనంలో రాక్గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్, శాండ్ స్టోన్ ఉన్నాయి. స్మృతివనంలో దాదాపు 450 వరకు కార్లను నిలిపే అవకాశం ఉంటుంది.
బౌద్ధ గురువుల ప్రార్థనలు.. హెలికాప్టర్తో పూలవర్షాలు
విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. జీహెచ్ఎంసీ, రోడ్లు భవనాలు, రవాణా, విద్యుత్తు శాఖల అధికారుల సమన్వయంతో అతిథులకు సౌకర్యాలు కల్పిస్తోంది. రెండు లక్షల మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీటు ప్యాకెట్లు సిద్ధంచేస్తోంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా పీఠం లోపల ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్కు అవసరమైన కసరత్తు పూర్తయింది. విగ్రహావిష్కరణలో భాగంగా సీఎం కేసీఆర్ తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. సీఎంను దాదాపు 30 మంది బౌద్ధగురువులు ప్రార్థనలతో అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత స్తూపం లోపల ఉన్న లిఫ్టులో ముఖ్యమంత్రి అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. అక్కడ 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. విగ్రహావిష్కరణ తరువాత హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆహూతులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
స్మారకం రూపుదిద్దుకుందిలా..
అసమానమైన వ్యక్తిత్వానికి ప్రతీక
- మల్లేపల్లి లక్ష్మయ్య, ఛైర్మన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్
అంబేడ్కర్ స్మారకం అపూర్వకట్టడమే కాదు. జాతికి గర్వకారణమైన చిహ్నం. ఆ మహనీయుడు దేశానికి చేసిన కృషి, సాధించిన విజయాలు చాలా ఉన్నతమైనవి. 125 అడుగుల విగ్రహం మూర్తీభవించిన అసమానమైన ఆయన వ్యక్తిత్వానికి ప్రతీక.
భావితరాలకు ఆత్మవిశ్వాసం
- ఘంటా చక్రపాణి, అకడమిక్ డైరెక్టర్, అంబేడ్కర్ వర్సిటీ
అంబేడ్కర్ ఓ చైతన్య స్ఫూర్తి. ఈ విగ్రహం భావితరాలకు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. 1930 నుంచి హైదరాబాద్ సంస్థానంతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. హైదరాబాద్ను ఆయన రెండో ఇల్లుగా భావించేవారు. రౌండ్టేబుల్ సమావేశాలకు ఫెలోషిప్ ఇచ్చి మూడేళ్లపాటు ఆయన లండన్లో ఉండేందుకు నిజాం నవాబు సహకరించారు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు. -
దూరవిద్య బలోపేతానికి ప్రభుత్వాలు సహకరించాలి
దూరవిద్య బలోపేతం చేయడంతో పాటు, ఆధునికీకరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ఓయూలో నిర్వహించిన జాతీయ సదస్సులో వక్తలు విజ్ఞప్తి చేశారు. -
గురుకుల డిగ్రీ పరీక్షకు 87.79% హాజరు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరం సీట్ల భర్తీకీ ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.79 శాతం విద్యార్థులు హాజరైనట్లు టీజీఆర్డీసీ సెట్ కన్వీనర్ సైదులు తెలిపారు.