Huzurabad By Election: కమలంలో కొత్త జోష్
హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ సాధించిన విజయం పార్టీ నాయకులు, క్యాడర్లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఈటల రాజేందర్ వ్యక్తిగత ప్రతిష్ఠ, ఓటర్ల సానుభూతితో పాటు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్లో మకాం వేయడం, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలూ పార్టీకి కలిసివచ్చాయి.
ఫలించిన వ్యూహాలు.. వరించిన విజయం
నాలుగు నెలలు జనంతో మమేకమైన ఈటల
ఈనాడు - హైదరాబాద్
సంబరాల్లో భాగంగా విజయ సంకేతం చూపుతున్న బండి సంజయ్, డి.కె. అరుణ, పార్టీ శ్రేణులు
హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ సాధించిన విజయం పార్టీ నాయకులు, క్యాడర్లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఈటల రాజేందర్ వ్యక్తిగత ప్రతిష్ఠ, ఓటర్ల సానుభూతితో పాటు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్లో మకాం వేయడం, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలూ పార్టీకి కలిసివచ్చాయి.
ఈటలను పార్టీలో చేర్చుకోవడం దగ్గరి నుంచి ఎన్నికల ప్రచారం వరకు భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆయన జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. 14న కాషాయకండువా కప్పుకొన్నారు. ఆ తర్వాత నియోజకవర్గానికి వెళ్లి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మోకాలి శస్త్రచికిత్సతో కొద్దిరోజులు విరామం తీసుకున్నారు. జూన్ మూడో వారం నుంచి దాదాపు నాలుగు నెలలకుగాపైగా ప్రజల్లోనే ఉన్నారు. మరోవైపు నియోజకవర్గానికి, మండలాలకు ఇన్ఛార్జులను నియమించిన భాజపా.. పోలింగ్ బూత్లు, శక్తికేంద్రాల వారీగా పార్టీ శ్రేణుల్ని మోహరించింది. దాదాపు 1,200 మంది కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల పార్టీలో చేరిన కొద్ది రోజులకే పాత, కొత్త క్యాడర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన బండి సంజయ్ వారి మధ్య సమన్వయం చేశారు.
బలమైన నేత..భావోద్వేగాల కలబోత
తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పోలిస్తే ఈటల బలమైన నేత. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. తన వెంట ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్ని తెరాస ఆకర్షించినా ధైర్యం కోల్పోలేదు. ‘కేసీఆర్ అహంకారానికి, హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం’, ‘నేను మీ బిడ్డను.. చంపుకుంటారో, సాదుకుంటారో.. మీ ఇష్టం’ అంటూ ఓటర్లపై భావోద్వేగ అస్త్రాన్ని సంధించారు. పార్టీ అధ్యక్షుడు సంజయ్, ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈటల సతీమణి జమున మహిళల మద్దతు కూడగట్టేందుకు ఊరూరూ తిరిగారు. ఇవన్నీ ఆయన విజయానికి బాటలు వేశాయి.
భాజపాకు కలిసొచ్చిన ఉప ఎన్నికలు
శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం గెలిచిన కమలదళానికి ఉప ఎన్నికలు కలిసివచ్చాయి. గతేడాది దుబ్బాకలో, ఇప్పుడు హుజూరాబాద్లో విజయంతో అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ స్థానంలో రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎంపీలు విజయం సాధించారు. నాటినుంచి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్, తెరాస, తెదేపాల నుంచి పలువురు నేతల్ని చేర్చుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్రావు విజయం సాధించగా.. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో సీట్లను భాజపా గెలుచుకుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ పట్టభద్రుల సిట్టింగ్ సీటును కోల్పోగా.. నల్గొండలో నాలుగో స్థానానికి పరిమితమైంది. నాగార్జునసాగర్ ఉపపోరు, పురపాలక ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఈ తరుణంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో వచ్చిన అవకాశాన్ని కమలదళం అందిపుచ్చుకుంది. ఈటల రాజేందర్ విజయంతో వచ్చిన ఉత్సాహంతో 2023 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తోంది.
మిన్నంటిన సంబురాలు
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించడంతో హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. నృత్యాలతో హోరెత్తించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు నేతలు పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం అన్ని మండల కేంద్రాల్లో విజయోత్సవాలు జరపాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
బెదిరింపులకు లొంగని ప్రజలకు వందనం: కిషన్రెడ్డి
ఈనాడు, దిల్లీ: హుజూరాబాద్ ప్రజలు చరిత్ర తిరగరాశారని.. నీతికి, నిజాయతీకి, న్యాయానికి మద్దతుగా నిలిచారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘హుజూరాబాద్లో భాజపా గెలుపు ప్రజల విజయం. హుజూరాబాద్ హీరోలు ప్రజలు, ఈటల రాజేందరే. వ్యక్తిత్వం కూడా ఈటల గెలుపునకు తోడైంది. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచిపోతాయి. 40 ఏళ్లలో ఇలాంటి ఎన్నికలను చూడలేదు. ఉప ఎన్నిక కోసం పాలక పార్టీ రూ.వేల కోట్ల పథకాలు పెట్టినా.. డబ్బు, పథకాలు, బెదిరింపులకు లొంగకుండా ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నందుకు హుజూరాబాద్ ప్రజలకు వందనం(సెల్యూట్) చేస్తున్నా. అహంకారం, అవినీతిని వారు వ్యతిరేకించారు’’ అని అన్నారు.
అమిత్షా హర్షం
హుజూరాబాద్లో విజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సంతోషం వ్యక్తంచేశారు. రౌండ్ల వారీగా వస్తున్న ఆధిక్యం వివరాల్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, అమిత్షాకు బండి సంజయ్ ఎప్పటికప్పుడు పంపించారు. సంజయ్కు ఉదయం ఫోన్ చేసిన అమిత్షా ఫలితాల సరళిపై ఆరా తీశారు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి. -
ఓయూలో నీటి కొరత.. విద్యుత్తు కోతలు!
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్ వార్డెన్ కొమరెల్లి శ్రీనివాస్ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఉత్తర్వును ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. -
తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
భానుడు.. భీకరం
రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. -
రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత
‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. -
కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు
రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
‘టెయిల్పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. -
సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!