Telangana News: కొనకుంటే కష్టమే.. మిగిలేది నష్టమే
ప్రస్తుత యాసంగిలో రాష్ట్రంలో 70 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. ఇప్పటికే కొన్నిచోట్ల వరికోతలు ప్రారంభం కాగా ఏప్రిల్ మొదటివారానికల్లా అన్ని ప్రాంతాల్లో ముమ్మరం కానున్నాయి.ఉప్పుడుబియ్యం
యాసంగిలో 78.85 లక్షల టన్నుల దిగుబడి
రైస్మిల్లర్లే ఈ పంటనంతా కొనుగోలు చేయరనే ఆందోళనలో రైతులు
కేంద్రం సేకరించకుంటే మద్దతు ధర రావడమూ అనుమానమే
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత యాసంగిలో రాష్ట్రంలో 70 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. ఇప్పటికే కొన్నిచోట్ల వరికోతలు ప్రారంభం కాగా ఏప్రిల్ మొదటివారానికల్లా అన్ని ప్రాంతాల్లో ముమ్మరం కానున్నాయి.ఉప్పుడుబియ్యం తీసుకునేది లేదని కేంద్రం చెప్పడంతో ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయబోమని రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలిపింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలనీ సూచించింది. అయినప్పటికీ రైతులు 35.84 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. ఇప్పుడు ప్రభుత్వం కొనకపోతే ధాన్యాన్ని విక్రయించడం ఎలా అని వారు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్లో కొనుగోలు చేసిన విధంగా తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా కోరుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోందన్నది చర్చనీయాంశంగా మారింది. గతేడాది యాసంగిలో మాదిరిగా గ్రామాల్లో, సమీపంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే రవాణా, ఇతర ఖర్చుల పేరిట రైతులకు క్వింటాకు రూ.100కి పైగా అదనపు భారం తప్పదు.ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే తరుగు పేరుతో మరింత నష్టపరుస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పండే మొత్తం ధాన్యాన్ని రైస్మిల్లర్లు లేదా ఇతర వ్యాపారులు మద్దతు ధరకు కొనడం అసాధ్యమని అంచనా. మిల్లర్లు 15 లక్షల నుంచి 20 లక్షల టన్నులకు మించి సొంతంగా కొనరని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర అవసరాలకు మరో 15 లక్షల టన్నులు పోయినా కనీసం 40 లక్షల టన్నులనైనా కేంద్రం కొనాల్సి ఉంటుంది. ఏప్రిల్ మొదటివారానికి మార్కెట్లకు ధాన్యం వెల్లువలా రానుంది. ఈ నెలాఖరుకల్లా కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకోకపోతే వ్యాపారులు ఇదే అదనుగా ధర తగ్గించి కొని రైతులను నష్టపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. 1 నుంచి 5 ఎకరాల్లో సాగుచేసే చిన్నరైతులే ఎక్కువమంది ఉంటారు. వారు అప్పులు తెచ్చి పంట సాగు చేస్తారు. అయినకాడికి తెగనమ్మి అప్పులు తీర్చాలనే వారి ఆరాటాన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు క్వింటాకు రూ.200 నుంచి 300 దాకా తగ్గించి కొంటారు. ఎకరానికి కనిష్ఠంగా రూ.6 వేల నష్టం చొప్పున లెక్కించినా 35.84 లక్షల ఎకరాలకు రైతులు నష్టపోయే సొమ్ము రూ.2,150 కోట్లకు పైగా ఉంటుంది.
సాధారణ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వటంలోనూ మిల్లర్లు తాత్సారం చేస్తున్నారు. గడిచిన ఏడాది (2021) మార్చితో ముగిసిన యాసంగి సీజనుకు సంబంధించిన 10.81 లక్షల మెట్రిక్ బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి. అందులో సుమారు 7.70 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ బియ్యం. 3.11 లక్షల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం. సాధారణ బియ్యం ఇవ్వటంలోనూ మిల్లర్లు జాప్యం చేస్తున్నారు.ఎఫ్సీఐకి 6.58 లక్షల మెట్రిక్ టన్నుల, రాష్ట్ర ప్రభుత్వానికి 1.12 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం ఇవ్వాల్సి ఉంది. యాసంగిలో 10.81 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీ చివరి గడువు.
2020-21 యాసంగిలో 20 వేల మెట్రిక్ టన్నులకుపైగా బియ్యం నిల్వలు మిల్లర్ల వద్ద ఉన్న జిల్లాల వివరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!