Bandi Sanjay: ఆట మొదలైంది
ధర్మం కోసం, తెలంగాణ సమాజం కోసం అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్తానని, రాష్ట్రంలో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
317 జీవోను సవరించే వరకు పోరాటం ఆగదు
హైకోర్టు మొట్టికాయలతో కేసీఆర్ సిగ్గు తెచ్చుకోవాలి
జైలు నుంచి విడుదల అనంతరం బండి సంజయ్ వ్యాఖ్యలు
కరీంనగర్ జైలు ముందు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న బండి సంజయ్
ఈనాడు డిజిటల్, కరీంనగర్: ధర్మం కోసం, తెలంగాణ సమాజం కోసం అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్తానని, రాష్ట్రంలో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధర్మయుద్ధంలో ఈ గెలుపు ఆరంభమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 7.30 గంటలకు కరీంనగర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఆయన బయటికి వస్తున్న సమయంలో కేంద్ర సహాయమంత్రి భగవంత్ ఖుబాతోపాటు రాష్ట్ర నాయకులు ఎస్.కుమార్, మనోహర్రెడ్డిలు స్వాగతం పలికారు.అక్కడికి భారీగా చేరుకున్న కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం సంజయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘భాజపా కేసీఆర్ని ఇక వదిలిపెట్టేది లేదు. జైళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నా. భవిష్యత్తులో ఆయనను, ఆయన కుటుంబసభ్యులను తప్పకుండా జైలుకు పంపుతాం. నేను జైలుకు వెళ్తే బయటకు రావాలని తెలంగాణ సమాజమంతా దేవుళ్లకు మొక్కింది. అదే కేసీఆర్ జైలుకు వెళ్తే బయటకు రావద్దని మొక్కుతారు. నన్ను జైలుకు పంపిన అని కేసీఆర్ సంతోషపడ్డడు. హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇకనైనా సిగ్గు తెచ్చుకో. నేను మోసం, దొంగ కేసుల్లో జైలుకు పోలేదు. ప్రజాసమస్యలపై జైలుకు వెళ్లడం నాకు కొత్తేమీ కాదు. ఇప్పుడు తొమ్మిదోసారివెళ్లి వచ్చా. ఈ సారి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం కోసం వెళ్లాననే సంతోషం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను సవరించాలి. అప్పటివరకు మా పోరాటం ఆగదు. ఉద్యోగులు నరకయాతన పడుతున్నారు. సీఎం వైఖరి వల్ల సీనియర్లు, జూనియర్లకు కొట్లాటలవుతున్నాయి. కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు సర్కారుకు కొమ్ముకాస్తున్నారు. అలాంటివారికి బుద్ధిచెప్పాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మేం అన్నిరకాలుగా అండగా నిలబడతాం. కేసీఆర్కు మమ్మల్ని కొట్టే అధికారం ఎవరిచ్చారు? దుండగులమా..? చీటర్లమా..? ఎందుకని గ్యాస్ కట్టర్లతో, క్యాన్లతో మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టించారు? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని. కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించలేదు.అయినా అమానుషంగా దాడి చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. మహిళా నాయకురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రజలు గల్లీల్లో ఏమనుకుంటున్నారో కేసీఆర్ తెలుసుకోవాలి. కేటీఆర్ జర కేసీఆర్ను జాగ్రత్తగా చూసుకోవాలి. జైల్లో ఉన్నప్పుడు సహకరించిన జాతీయ, రాష్ట్ర పార్టీ నాయకులకు అండగా నిలబడిన తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని సంజయ్ పేర్కొన్నారు.తర్వాత జాగరణ దీక్ష సమయంలో గాయపడిన కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఎంపీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు.
జైలు నుంచి విడుదలైన బండి సంజయ్తో కలిసి వస్తున్న కేంద్ర సహాయమంత్రి భగవంత్ ఖుబా
బండి సంజయ్ను కలిసిన కేంద్ర సహాయమంత్రి భగవంత్ ఖుబా
అంతకుముందు కరీంనగర్ జైల్లో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖుబా బుధవారం సాయంత్రం పరామర్శించారు. ఎంపీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఆరోపించారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ రాజకీయనేతలా వ్యవహరిస్తున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..