Telangana News: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్‌రాజ్‌

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వికాస్‌రాజ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 17 Mar 2022 04:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వికాస్‌రాజ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖలో రాజకీయ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో గత కొన్ని రోజులుగా మరో ఐఏఎస్‌ అధికారి బుద్ధ ప్రకాశ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రధాన అధికారిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి వికాస్‌రాజ్‌, మహేష్‌ ఎక్కా, బుర్రా వెంకటేశం పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. వారిలో ఎన్నికల సంఘం వికాస్‌రాజ్‌ను ఎంపిక చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని