Viveka Murder Case గంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు కుట్ర
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. హత్యకు నెల రోజుల ముందు నిందితులైన షేక్ దస్తగిరి, ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్లను ఇంటికి పిలిపించి హత్యకు పథకరచన చేశారని వివరించింది. వివేకాను
కొందరు సాక్షులు ఆయన ప్రభావానికి లోనయ్యారేమో..
జనవరిలోనే హైకోర్టులో సీబీఐ పిటిషన్
ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే కుట్ర జరిగిందని సీబీఐ తెలిపింది. హత్యకు నెల రోజుల ముందు నిందితులైన షేక్ దస్తగిరి, ఉమాశంకర్రెడ్డి, సునీల్ యాదవ్లను ఇంటికి పిలిపించి హత్యకు పథకరచన చేశారని వివరించింది. వివేకాను అంతం చేస్తే శివశంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారంటూ నిందితులు ముగ్గురికీ గంగిరెడ్డి చెప్పారని పేర్కొంది. హత్యలో కీలకపాత్ర అతనిదేనని వెల్లడించింది. ఈ కేసులో గతంలో అరెస్టయ్యి, ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దుచేయాలని కోరుతూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్సింగ్ జనవరిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్యలో గంగిరెడ్డి పాత్ర, దర్యాప్తులో గుర్తించిన అంశాలు, అతను సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న తీరు తదితర అంశాల్ని ఆ పిటిషన్లో వివరించారు. ప్రధానాంశాలివీ..
లోపలికి తీసుకెళ్లింది గంగిరెడ్డే
‘‘2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకాను హత్య చేసేందుకు సునీల్యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్రెడ్డిలను వివేకా ఇంట్లోకి తీసుకెళ్లింది గంగిరెడ్డే. హత్య తర్వాత మిగతా నిందితులతో కలిసి వివేకా ఇంటివద్ద నుంచి పారిపోతుండగా వాచ్మన్ రంగన్న చూశారు. ఎవరితోనైనా చెబితే చంపేస్తానని అతన్ని బెదిరించారు.
* 2019 మార్చి 15వ తేదీ ఉదయాన్నే వివేకా ఇంటి వద్దకు చేరుకుని.. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డితో కలిసి వివేకా గుండెపోటుతో మరణించారనే ప్రచారం ప్రారంభించారు.
* ఇంటివద్ద ఉన్న జనాల్ని నియంత్రించేందుకు రావాలని సీఐ శంకరయ్యకు చెప్పారు.
* ఘటనాస్థలంలో ఆధారాలు ధ్వంసం చేయటంలోనూ, బాత్రూమ్, బెడ్రూమ్లోని రక్తపు మడుగు, మరకల్ని శుభ్రం చేయించటంలోనూ గంగిరెడ్డి, శివశంకర్రెడ్డిలదే కీలకపాత్ర.
* లోపల గడియ పెట్టేసి మృతదేహానికి కట్లు కట్టించారు. ప్రశ్నించినందుకు సీఐ శంకరయ్యను నోర్మూసుకుని ఉండాలంటూ హెచ్చరించారు.
* శివశంకర్రెడ్డి, సునీల్యాదవ్, ఉమాశంకర్రెడ్డి ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో కుట్ర, ఆధారాల ధ్వంసంపై దర్యాప్తు జరుగుతోంది.
* గంగిరెడ్డి బయటే ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు
గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వారి సన్నిహితులు, ఇతర కుట్రదారులతో కలిసి సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షులైన కల్లూరు గంగాధర్రెడ్డి, సీఐ జె.శంకరయ్య, వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిలు.. వారి ప్రభావానికి లోనయ్యారన్న అనుమానం ఉంది.
* వివేకా హత్యానేరాన్ని తనపై వేసుకుంటే రూ.10కోట్లు ఇస్తానంటూ శివశంకర్రెడ్డి ఆఫర్ ఇచ్చారని తొలుత వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్రెడ్డి ఆ తర్వాత మాట మార్చారు.
*వివేకా హత్య సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె.శంకరయ్య విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అప్పట్లోనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి తొలుత అంగీకరించి, నిరాకరించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయన సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తేసింది.
* కృష్ణారెడ్డి ఫిర్యాదుతోనే తొలుత ఘటనపై పులివెందుల స్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత సీబీఐ అదనపు ఎస్పీ రామ్సింగ్ తనను ఒత్తిడి చేసి, తప్పుడు వాంగ్మూలం నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వారి సన్నిహితులు చెప్పబట్టే ఆయన ఫిర్యాదు చేసినట్లు అనుమానం ఉంది’’ అని పిటిషన్లో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే