Israel - Hamas: మాయమైన మానవత్వం!
మాయా ఆల్పర్.. ఇజ్రాయెలీల మ్యూజిక్ పార్టీలో బార్ వెనుక పర్యావరణ వాలంటీర్లతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు.. వారి పని పార్టీలో చెత్తను ఏరివేయడంతోపాటు అక్కడికొచ్చిన వారికి వోడ్కా అందించడం.. ఉదయం ఆరు గంటలవుతోంది.. స్టేజీ మీద డీజే ప్రదర్శన సాగుతోంది.
సంగీత సంబరంలో మాటలకందని విషాదం
పొదల్లో దాక్కున్నా వెతికి మరీ చంపారు
జెరూసలెం: మాయా ఆల్పర్.. ఇజ్రాయెలీల మ్యూజిక్ పార్టీలో బార్ వెనుక పర్యావరణ వాలంటీర్లతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు.. వారి పని పార్టీలో చెత్తను ఏరివేయడంతోపాటు అక్కడికొచ్చిన వారికి వోడ్కా అందించడం.. ఉదయం ఆరు గంటలవుతోంది.. స్టేజీ మీద డీజే ప్రదర్శన సాగుతోంది. సరిగ్గా అప్పుడు సంగీతాన్ని చీల్చుకుంటూ హెచ్చరిక సైరన్ వచ్చింది. రాకెట్లు పడుతున్నాయి. దీంతో వెంటనే 25 ఏళ్ల ఆల్పర్ తన కారులోకి దూకేసి.. మెయిన్ రోడ్డుపైకి దూసుకొచ్చారు. కానీ అప్పటికే చాలామంది రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. భయకంపితులైన యువతీయువకులు కార్లను వదిలి రోడ్లపై పరుగెడుతూ రక్తసిక్తమై ఆల్పర్ ఎదుటే కుప్పకూలిపోయారు. అలా.. 260 మంది ఒక్కచోటే ప్రాణాలొదిలారు. ఇదీ.. ఇజ్రాయెల్లో నోవా సంగీత సంబరంలో చోటుచేసుకున్న మాటలకందని విషాదం. హమాస్ మిలిటెంట్లు విచ్చలవిడిగా చేసిన దాడికి సాక్షీభూతం.
గాజా సరిహద్దులోని కిబ్బుజ్ రీమ్వద్ద జరిగిన ఈ సంగీత సంబరానికి సుమారు 3,000 మంది హాజరయ్యారు. శనివారం ఉదయం కొన్ని నిమిషాల్లోనే పలు వ్యాన్లలో 50 మంది సాయుధ ముష్కరులు అక్కడికి వచ్చారు. వీక్షకులపై తూటాల వర్షం కురిపించారు. దీంతో సంగీత సంబరానికి వచ్చిన వారంతా నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు రోడ్డుపై నిస్సహాయంగా ఉన్న కొంత మందిని ఆల్పర్ తన కారులో ఎక్కించుకున్నారు. వ్యతిరేక దిశగా కారును వేగంగా పోనిచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. కారులో ఎక్కిన వారిలో ఒక వ్యక్తి సీట్లో కూర్చుని కారు వెనుక అద్దంలో చూస్తూ.. ‘మనం చనిపోబోతున్నాం’ అని గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. ఆల్పర్ కారు నడుపుతుండగా.. సమీపంలోకి ఒక వ్యక్తి వచ్చి ‘దేవుడు గొప్పవాడు’ అని అరవడం ప్రారంభించాడు.
దీంతో భయపడిన వారంతా కారు దిగి సమీపంలోని పొదల్లోకి పరుగెత్తారు. ఒక బుల్లెట్ ఆల్పర్ చెవి పక్క నుంచి వెళ్లింది. దీంతో ఆమె ఒక్కసారిగా పొదల్లోకి దూకారు. కారులో వచ్చిన ఓ యువతీ కుప్పకూలిపోయింది. ఆమె మృతదేహం పక్కనే సాయుధుడు నిల్చుని ఉన్నాడు. 6 గంటలపాటు ఆల్పర్తోపాటు వేల మంది పార్టీకి వచ్చిన వారు ఇజ్రాయెల్ సైన్యం సాయం కోసం ఎదురుచూశారు. పొదల్లోకి దూకడంతో ఆమె చేతులన్నీ దెబ్బతిన్నాయి. ఆ పొదలే తమను కాపాడాయని ఆల్పర్ తెలిపారు. ఇజ్రాయెలీ ట్యాంకరు వచ్చాక ఆ శబ్దాలు విన్నాకే తాను క్షేమమని అనుకున్నానని ఆమె వివరించారు. ఆల్పర్ గట్టిగా అరవడంతో సైనికులు వచ్చి ఆమెను పొదల నుంచి రక్షించారు.
అత్యవసర ద్వారాలవద్ద కాచుకు కూర్చుని..
కాల్పులు మొదలయ్యాక ప్రజలు అత్యవసర ద్వారాల వద్దకు చేరుకుంటారని మిలిటెంట్లు ముందే అంచనా వేశారు. ఈ క్రమంలో చాలామంది సాయుధులు అక్కడ వేచి ఉన్నారు. ఈ ద్వారాల నుంచి బయటకు వచ్చేవారిని కాల్చి చంపారు. తన జీవితంలో ఇలాంటి నరమేధం చూడలేదని యనీవ్ అనే వ్యక్తి పేర్కొన్నారు.
విదేశీయుల హత్య, అపహరణ
ఈ పార్టీలో ఉన్న విదేశీయులను హమాస్ ముష్కరులు దారుణంగా హత్య చేశారు. జర్మనీకి చెందిన ఓ యువతి ఈ పార్టీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె జాడలేదు. బ్రిటన్కు చెందిన జాక్ మార్లోవ్ ఈ పార్టీలో గార్డుగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన జాడా లేదు. ఈ పార్టీలో పాల్గొన్న ఇజ్రాయెలీ అమెరికన్ హెర్ష్ గోల్బెర్గ్ పోలిన్ ఆచూకీ లభించడం లేదు. అతడి పుట్టిన రోజు చేసుకున్న కొద్ది సేపటికే హమాస్ దాడి జరిగింది.
చనిపోయినట్లు నటించి ప్రాణాలు కాపాడుకుని..
పార్టీకి హాజరైన వారిలో ఏస్తర్ బ్రోచోవ్ అనే మహిళ ఉన్నారు. కాల్పులు మొదలు కాగానే కారులో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వాహనం మరో దానిని ఢీకొనడంతో ఆగిపోయింది. సమీపంలో కారు నడుపుతున్న ఓ యువకుడు ఆమెను రక్షించేందుకు తన వాహనంలో ఎక్కించుకున్నారు. కొద్దిసేపటికే ఆ యువకుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో హమాస్ ముష్కరులు కాల్చి చంపారు. దీంతో ఏస్తర్ చనిపోయినట్లు నటిస్తూ ఏమాత్రం కదలకుండా అక్కడే పడిపోయారు. ముష్కరులు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. ఇజ్రాయెల్ సైనికులు వచ్చి ఆమెను రక్షించే వరకూ అలాగే ఉన్నారు. మరికొందరు చెట్లు, పొదల చాటున దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. మిలిటెంట్లు ప్రతి చెట్టు వద్దకూ వెళ్లి వెతికి కనిపించిన వారిని విచక్షణా రహితంగా కాల్చి చంపారు.
ఇళ్లల్లోకి చొరబడి.. పాయింట్ బ్లాంక్లో కాల్చేసి..
ఇజ్రాయెల్పై మెరుపు దాడికి దిగిన హమాస్ ఉగ్రవాదులు అక్కడి పౌరులపై జరిపిన దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముష్కరులు ఇళ్లల్లోకి చొరబడి పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరిపి అమాయక పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారని ఐరాసలో ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి గిలాడ్ ఎర్డాన్ ఆవేదన చెందారు. ‘క్రూరమైన ఈ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులను వీధుల్లో పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతున్నారు. పురుగుల్ని నలిపినట్లుగా.. ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను పాయింట్ బ్లాంక్లో కాల్చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను బలవంతంగా లాక్కొని వారిని బంధిస్తున్నారు. గత రెండు రోజులుగా మా దేశం హమాస్ దాడిలో వందలాది మంది పౌరులను పోగొట్టుకుంది. ఇవన్నీ యుద్ధ నేరాలే’ అని ఎర్డాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
* నేపాల్కు చెందిన కొంత మంది విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. తమను కాపాడాలంటూ వారు వీడియో సందేశాన్ని నేపాల్కు పంపించారు. బంకర్లోనే సురక్షితంగా లేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో శత్రుదేశం ఇజ్రాయెల్ (Israel) పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
Helicopter Crashes: ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన అత్యంత ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదాలు ఏవో చూద్దాం -
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
పారిస్లోని ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో వచ్చిన దుండగులు రూ. కోట్ల విలువైన ఆభరణాలు, వస్తువులను ఎత్తుకెళ్లారు. -
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
తుర్కియే పంపిన అత్యాధునిక బైరక్తర్ అకిన్సి డ్రోన్లు ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ గాలింపులో బాగా ఉపయోగపడ్డాయి. ప్రమాద స్థలం వివరాలను అత్యంత కచ్చితత్వంతో ఇరాన్కు అందజేశాయి. -
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ విదేశాంగ మంత్రిని కోల్పోవడం ఇరాన్కు పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. -
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
ఇరాన్ అధ్యక్షుడు రైసీ చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఎదిగారు. ప్రాసిక్యూటర్గా జీవితం మొదలుపెట్టిన ఆయన అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు. -
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చివరి క్షణాలకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పటి ఫొటో అది. -
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ 212గా గుర్తించారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచదేశాలను షాక్కు గురిచేసింది. -
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశాధ్యక్షుడి ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా దేశ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై చర్చ మొదలైంది. -
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
Iran president Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ధ్రువీకరించింది. -
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అక్కడి సహాయక బృందాలను పంపినట్లు వెల్లడించింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. -
విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్యం
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. -
అఫ్గాన్లో కొనసాగుతున్న కుండపోత వర్షాలు
అధిక వర్షాలు అఫ్గానిస్థాన్ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. -
ఆ ఘటనతోనే భారత్తో వాణిజ్య బంధానికి తెర : పాక్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడటంతో 17 మంది మృతి
-
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
-
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
-
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!