Israel-Hamas: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం తీరు మారేనా?
గాజాపై ఇజ్రాయెల్ ప్రస్తుతం కొనసాగిస్తున్న యుద్ధం తీరు మారుతుందని, హమాస్ నేతలే లక్ష్యంగా దాడులు కొనసాగే అవకాశముందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులేవాన్ తెలిపారు.
జెరూసలెం: హమాస్ను (Hamas) నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ (Israel) తన యుద్ధ విధానాన్ని మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సామాన్య ప్రజలు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతుండటంతో ఆ దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేవలం హమాస్ నేతలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు యుద్ధం చేస్తాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్ అన్నారు. అయితే, ఈ మార్పు ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జాక్ సలీవాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గాజాలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఇజ్రాయెల్ దళాలకు మరికొన్ని నెలలు సమయం పట్టొచ్చని అన్నారు. అయితే, ప్రస్తుతం కొనసాగిస్తున్న వైమానిక, భూతల దాడులు కాకుండా సరికొత్త యుద్ధ విధానాన్ని ఇజ్రాయెల్ అవలంబించబోతున్నట్లు చెప్పారు. దీనిపై ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి, ఆర్మీ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారని, సరైన సమయంలో వాళ్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒక వేళ యుద్ధ తీవ్రత తగ్గకపోయినా.. ఇజ్రాయెల్కు సాయంగా పంపిన బలగాలను అమెరికా ఉపసంహరించుకుంటుందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన సమాధానం దాటవేశారు. దానిపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
అక్టోబర్ 7న దాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు దాదాపు 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దళాలు యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కనీసం 1900 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాన మద్దతుదారుగా ఉన్న అమెరికా కూడా ఇటీవల ఇజ్రాయెల్ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. యుద్ధ తీవ్రతను తగ్గించాలని, పౌరుల ప్రాణాలు కాపాడటంపై దృష్టిపెట్టాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్కు కాస్త కఠినంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి. మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్తోనూ త్వరలో జాక్ సలీవాన్ భేటీ కానున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అబ్బాస్తో ఆయన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం’ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఇజ్రాయెల్లో ఆందోళన నెలకొంది. -
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్