Kate Middleton missing: కోమాలో బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్..?
బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ (Kate Middleton) డిసెంబర్ నుంచి కనిపించకుండా పోయారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ రాజ కుటుంబానికి (Britain Royal Family) సంబంధించి ఏ విషయాన్నైనా యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనిస్తుంది. తాజాగా యువరాణి కేట్ మిడిల్టన్ (Kate Middleton)పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ నుంచి ఆమె కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్న కేట్.. కోమా(Coma)లోకి వెళ్లి ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి.
కేట్ మిడిల్టన్కు సర్జరీ అయిన విషయాన్ని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరి 17న వెల్లడించింది. ఆ శస్త్రచికిత్స విజయవంతమైందని పేర్కొంది. 10 నుంచి 14 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని, అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని తెలిపింది. అయితే అప్పటినుంచి యువరాణి బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం తాజా వదంతులకు కారణమైంది.
Pakistan: కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థానీ ఎయిర్ హోస్టెస్లు!
సర్జరీ సమయంలో యువరాణికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. తొలుత వీటిని ఓ స్పానిష్ టీవీ జర్నలిస్టు కొంచా కల్లెజా (Concha Calleja) వెల్లడించారు. అయితే, ఆమె ప్రకటనను బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలేనని పేర్కొంటున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం కేట్ కనిపించకుండా పోయారనే వార్తలు ఆగడం లేదు. ఆమె భర్త ప్రిన్స్ విలియం ఇటీవల పలు కార్యక్రమాల్లో ఒక్కరే పాల్గొనడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.
ఇదిలాఉంటే, బ్రిటన్ రాజు ఛార్లెస్-3 (King Charles-III )కి క్యాన్సర్ నిర్ధరణ అయిందని బకింగ్హామ్ ప్యాలెస్ ఇటీవల వెల్లడించింది. దీంతో ఆయనకు చికిత్స నడుస్తోందని తెలిపింది. వేల్స్ యువరాణి కేట్ (Kate Middleton)కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు చేరినట్లు సమాచారం. ఇలా కేట్ త్వరలోనే ప్రజల ముందుకువస్తారని రాజకుటుంబ వర్గాలు చెబుతుండగా.. ఆమె పూర్తిగా కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలలు పట్టవచ్చని బ్రిటన్ మీడియా పేర్కొంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.